Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.వె. కనక మృగము భువిని కద్దు, లేదనకుండ
తరుణి విడిచిపోయే దాశరథియు
తెలివి లేనివాడు దేవుడెట్లాయెరా?
అని మధ్యయుగాల్లోనే ప్రజాకవి వేమన్న ప్రజలవైపు నుంచి సూటిగా ప్రశ్నించాడు. ఎంత దేవుడైతే మాత్రం ఆయనక్కూడా తెలివి ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా! అలాగే ప్రొఫెసర్లుగా పనిచేసిన వాళ్లకు కూడా ఇంగిత జ్ఞానం తెలివి ఉండాలని ఆశపడటంలో తప్పులేదను కుంటా ను? 4 జనవరి 2018 నాటి ఒక దినపత్రికలో ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన ''చరిత్రను వక్రీకరించింది ఎవరు?'' అన్న వ్యాసం చదివిన పాఠకులకు ఈ కోరిక కలి గితే అది వాళ్ల తప్పు కాదు. భారతీయ జనతా పార్టీలోనో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్)లోనో సభ్యత్వం కలిగిన అతి మామూలు కార్యకర్త మాట్లాడినంత పేలవంగా ఒకింత దుందుడుకుగా వీరావేశంగా రాసిన శివ ప్రసాద్కు చరిత్రకూ పుక్కిటి పురాణాలకూ మధ్య గల తేడా తెలిసినట్టు లేదు. ఆ తేడా తెలుసుకోవడం వల్ల వచ్చిన గందరగోళం వల్ల నష్టపోయేది ఆయనొక్కరే కాదు, పాఠకు లు కూడా. ''త్రేతాయుగం నుంచి నేటి వరకు గల ప్రపంచ చరిత్ర అష్టదశ పురాణాల్లో ఉంది'' అని అనటాన్ని పదవ తరగతి చరిత్ర చదువుకున్న పిల్లవాడు కూడా ఒప్పుకోడు. విజ్ఞాన శాస్త్రాలు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలోనే కొన్ని చారిత్రక సంఘటనలను ధృవీకరించటానికి చరిత్రకా రులు అష్టకష్టాలు పడుతుంటే చాలా పరిమిత జ్ఞానంతో అంతూపొంతులేని అభూతకల్పనలతో జుగుప్సాకరమైన శారీరక సంబంధాలతో నిండిఉన్న ప్రాచీన కాలపు అష్టదశ పురాణాల్లో ప్రపంచ చరిత్ర ఎలా ప్రతిఫలించిందో ముదిగొం డ వారికొక్కరికే తెలియాలి. పోనీ పురాణాలు ఇక్కడే పుట్టాయి కాబట్టి వాటిలో భారతదేశ చరిత్ర ఉందని రాసినా అర్థం చేసుకోవచ్చు. ఏకంగా వాటిలో ప్రపంచ చరిత్రనే అవుతుంది. అప్పటి పురాణకర్తలు కండ్లు మూసుకొని ప్ర పంచంలో జరుగుతున్నదంతా గ్రహించి పురాణాల్లో చరి త్రగా నిక్షిప్తం చేశారా? పుష్పక విమానలెక్కబోయి విదేశా ల చరిత్రనంతా తెలుసుకొని పురాణీకరించినట్టున్నారు పాపం. అంతకుమించిన మార్గమైతే వాళ్లకు ఆ కాలంలో లేదు. నడిచి ప్రపంచాన్ని మొత్తం చుట్టొచ్చినార నుకున్నా అది సాధ్యమయ్యే పనికాదు. సము ద్రయానమేమో నిషిద్ధం. కానీ పురాణాల్లో మా త్రం వారు ప్రపంచ చరిత్రను మొత్తం నింపి పారేశారు. ఆ చరిత్ర ఏమిటో బయటపెట్టి ప్ర పంచానికి మహోపకారం చేయాలని ముదిగొం డ శివప్రసాద్ గారిని సవినయంగా వేడుకుంటు న్నాను. 1 జనవరి 2018 నాడు కలకత్తాలో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ ప్రారం భోపన్యాసంలో దాని అధ్యక్షుడు కెఎం.పరిమళి మాట్లాడిన మాటలను అసత్యాలు అనే ఆరోపణ చేసి ఖండించడం పనిలోపనిగా తాననుకుంటు న్న చరిత్రను వ్యాఖ్యానించడం ముదిగొండ వారు తన వ్యాసం ద్వారా పెట్టుకున్న లక్ష్యం. అయితే కెఎం.పరిమళి గారు మాట్లాడిన మాటలేవీ అసత్యం కాదు. ఆయన గురించీ చరిత్ర గురించీ ముదిగొండ వారు మాట్లాడిన మాటలే పచ్చి అబద్ధాలు. సొంత నిర్ధారణలు. మోడీ గారిమీద, బీజేపీ- ఆర్ఎస్ఎస్ల మీద ఈగవాలినా కత్తితో యుద్దానికి దిగే బృందంలోని సభ్యుడైన ముదిగొండవారు ఢిల్లీ విశ్వవిద్యాల యంలో హిస్టరీ ప్రొఫెసర్గా పనిచేసిన పరిమళి గారికి చరిత్ర పాఠాలు బోధించే పనిని తలకెత్తుకున్నారు. పాపం తాను నమ్మేదంతా చరిత్రకాదని పుక్కిటి పురాణాలను చరిత్రగా అర్థం చేసుకోవడం తన అవగాహన లోపం అని మళ్లీ పరిమళి దగ్గర చదువుకున్న శిష్యుడికి శిష్యునిలాంటి వాడొచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది గురువుగారికి.
క్రీ.శ.1521 సెప్టెంబర్లో మెక్సికోను క్రూసేడరు ఆక్రమించకముందు అక్కడ హిందూ దేవాలయాలు ఉండేవి. వాటిని స్పానిష్ క్రిష్టియన్లు ధ్వంసం చేశారు. మహ్మద్ ప్రవక్త పుట్టకముందు కాబా (మక్కా)లో విగ్రహారాధన ఉండేది. దానిని ప్రవక్త నిరోధించాడు. ప్రవక్త గారి పినతండ్రి శివభక్తుడు. ఆయన అయాత్ అనే పేరుతో శివస్తోత్రాలు రచించాడు. గ్రీసులో హిందూ సంస్కృతి ఉండేది. ఎధీనా అంటే దుర్గాదేవి. ఫాసిడాన్ అంటే పరమ శివుడు. ఇదిగో ఇట్లా నడుస్తుంది ముదిగొండ వారి ముద్దుల చరిత్ర. వాడెవడో ఉగ్రవాది ప్రపంచం మొత్తాన్ని ఒకే మతం కిందికి తీసుకొస్తానని శపథం చేసినట్టు ఈయన గారు విశ్వం మొత్తాన్ని హైందవీకరించే పనిలో ఉన్నట్టున్నారు. ఈయన గారి ఊహలకు చరిత్రతో సంబంధం లేదు. చరిత్రకు కాలవసింది అందమైన ఊహలు, అంతకు మించిన ఉద్వేగాలూ కాదు. ఆధారాలు కావాలి. ముదిగొండ వారి చరిత్రకు పురావస్తు శాఖల నుంచి కానీ, శిలాజాల సంస్థల నుంచి కానీ భారత, ప్రపంచ చరిత్ర పరిశోధనా మండళ్ల నుంచి కానీ ఏ విధమైన ఆధారాలూ లేవు. తన ఇంటి మీదికెక్కి ఈ ప్రపంచం మొత్తానికి నేనే రాజును అని అరిచేవాణ్ణి చూసి ప్రజలు నవ్వుకుంటారు. కానీ నువ్వే మా రాజువని నెత్తిమీద పెట్టుకోరు. ఇతర మతాల అస్తిత్వాలకు సొంత గుర్తింపుకు భంగం కల్గించే రీతిలో అవి కూడా హిందూ మతంలో లేదా సంస్కృతిలో భాగాలే అనే విధంగా చేసిన చారిత్రక వక్రీకరణలు హిందూ మతానికి ప్రజల్లో అదనంగా గౌరవం తెచ్చిపెట్టకపోగా ఉన్న గౌరవాన్ని తగ్గిస్తాయన్న కనీస అవగాహన కూడా మేధావులనుకునే వాళ్లకు లేకపోతే ఎలా? ''బ్రిటిషు వారు కమ్యూనిస్టులు కలిసి రూపొందించిన దొంగ చరిత్రలు చదివి వాటిని కెఎం.పరిమళిలు పాఠాలు చెప్పి విద్యార్థుల మనస్సులో విషం నింపుతున్నారు'' అని ఆరోపిస్తున్నారు శివప్రసాద్ గారు. తమ విశ్వాసాలకు అనుగుణంగా లేని చరిత్రలన్నీ ఈయన గారి దృష్టిలో దొంగ చరిత్రలు. కనీస చారిత్రకావగాహన ఉండి ఉన్నా ఆయనిలా మాట్లాడేవారు కాదు. చరిత్రలను ఎవరో ఒకరిద్దరు కలిసి రూపొందిస్తారని చరిత్రలో చాలా పరిమిత జ్ఞానం ఉన్న వాడు కూడా ఒప్పుకోడు. ఈ క్రమాన్నంతా వదిలేసి ఉనికిలో ఉన్న చరిత్రకు వ్యక్తిగత స్వార్థాలను ఆపాదించి నానాయాగి చేయడం చారిత్రక దృక్పథమనిపించుకోదు.
''నెహ్రూ రాజవంశంలో ఆరుగులు పాలకులు వచ్చారు. వారంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం కమ్యూనిస్టులపై ఆధారపడ్డారు. అందుకు సామ్యవాదులు ఒక షరతు పెట్టారు. ఈ విధంగా రాజ్య పాలన మీరు చేసుకోండి. కళా సాంస్కృతిక విద్యారంగాలు మాకు స్వాధీనం చేయండి అని'' అంటూ ఇంకో ఆరోపణ. ఇట్లాంటి షరతులు, ఒప్పందాలు ఎప్పుడు ఎక్కడ జరిగాయో ఆధారాలతో సహా బయటపెడితే శివప్రసాద్ గారు చరిత్రకు ఎంతో మేలు చేసినవారవుతారు. మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు జోస్యం, సరే కమ్యూనిస్టు రాసిన అంటే మార్క్సిస్టు దృక్పథం గల రచయితలు రాసిన చరిత్రలను పక్కన పెడదామా? చదివి వాటి అసలు స్వరూప స్వభావాలను వివరిస్తూ స్పష్టమైన చారిత్రక దృక్పథంతో డా||బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నో రచనలు చేశాడు. ఆయన అటు కమ్యూనిస్టు కాదు. ఇటు కాంగ్రెస్ వాది కాదు. మరి ఆయన రాసిన చరిత్రలు కూడా హిందూమతంలోని పరస్పర విరుద్ధమైన విషయాల గురించి, వర్ణ, కుల వ్యవస్థలను, అవి పోషించిన దుర్మార్గాలను దానికి మతామోదం లభించటం గురించి బ్రాహ్మణీయ విష సంస్కృతి దేశాన్ని పట్టి పీడించటం గురించి వేదాల డొల్లతనం గురించీ, సప్రామాణిక చరిత్రలను రాశాడు. ఈ పనికిమాలిన వేదాల్లో ఉన్నవేమిటి? పవిత్రతాలేదు. ప్రశ్నాతీత్వమూ లేదు. తమ శత్రువుల నాశనం కోసం వారి ఆస్తులను దోచకొని వాటిని తమ అనుయాయులకు పంచుకోవడం కోసమూ కొండదేవతలను ప్రార్థించటం తప్ప మరేమీ లేని ఆ వేదాలను ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది. బ్రాహ్మణులు ప్రచారం చేసి అందరి మెదళ్లలోకి చొప్పించిన ఈ అర్థరహిత భావాల హిందూమతంలో చిక్కుముడులు (పుట.9) అన్న గ్రంథం ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు. దీనికి ముదిగొండలాంటి వాళ్ల సమాధానమేమిటో? మన వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అనుగుణంగా చరిత్ర నడవదు. అట్లాంటి చరిత్రలు రాసినా నిలబడవు. ఎందుకంటే వాటికి ఆధారాలుండవు కాబట్టి. లేదు లేదు మా దగ్గర ఆధారాల్లేవు కానీ అది మా నమ్మకం. మత విశ్వాసం. చరిత్ర మొత్తం మా తాటాకుల్లోనే ఉంది అని అరిచేవాళ్లంతా సాధించగలిగిందేమీ లేదు.
- తోకల రాజేశం
సెల్ : 9676761415