Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమాసియాలోని జెరూసలెం మహానగరం అంటే తెలియని వారుండరు. ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రపంచంపై మరో బాంబ్ పేల్చారు. ఇప్పటికే ఉత్తరకొరియా, అమెరికాల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమంటున్నది. ఎన్నికల సమయంలో యూదుల ఓట్లను ఆకర్షించేందుకు ట్రంప్ జెరూసలెం వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే ఇజ్రాయిల్కు రాజధానిగా అమెరికా గుర్తిస్తుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నది. జోర్డాన్ రాజు అబ్దుల్లా నిరసన వ్యక్తం చేశారు. టర్కీ అధ్యక్షుడు విర్డోజన్ తీవ్రంగా ప్రతిఘటించారు. మధ్య ప్రాశ్చ్యాంలో సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముందని చైనా అధ్యక్షుడు అన్నారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సౌదీ అరేబియా రాజు మండిపడ్డారు. ట్రంప్కు ఈజిప్టు అధ్యక్షుడు లేఖను విడుదల చేశారు. తమ ప్రాంత సమస్యను జటిలం చేయొద్దన్నారు. యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్లు సమర్థించలేకపోయాయి. మధ్యధరా సముద్రం, మృత్యు సముద్రం, మధ్యభాగంలో జుడామెన్ పర్వతాలపై జెరూసలెం ఉంది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే నగరమిది. ఈ నగరంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. 1948లో అరబ్, ఇజ్రాయిల్ యుద్ధంలో పశ్చిమ జెరూసలెం ఇజ్రాయిల్ ఆధీనంలోకి వచ్చింది. అదే సమయంలో పాత నగరంతో కూడిన తూర్పు జెరూసలెం ప్రాంతాన్ని జోర్డాన్ స్వాధీనం చేసుకుంది. మళ్లీ 1967లో ఆరు రోజుల యుద్ధం తరువాత జోర్డాన్ నుంచి తూర్పు జెరూసలెంను ఇజ్రాయిల్ ఆధీనంలోకి తెచ్చుకుంది. జెరూసలెం అంతా తనదేనని ఇజ్రాయిల్ వాదన. కానీ తూర్పు జెరూసలెం తమదేనని ఎప్పటికైనా, ఎన్నటికైనా తమ రాజధాని అని పాలస్తీనియన్లు అంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా తూర్పు జెరూసలెం పాలస్తీనాకు చెందిన ప్రాంతమని ఇజ్రాయిల్ అక్రమంగా ఆక్రమించుకుందని వాదిస్తున్నది. ఇజ్రాయిల్ సాలస్తినా దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్ని దేశాలు శతాబ్ద కాలం నుంచి సూచిస్తున్నాయి. 2000 సంవత్సరంలో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని అనాటి పాలస్తీనా అధినేత అవగాహనకొచ్చారు. ఆ నగరం అడుగునున్న సొరంగాల నియంత్రణపై విబేధాలొచ్చి ఒప్పందం ఆగిపోయింది. విభజన లేఖను గౌరవించి తూర్పు జెరూసలెంతో సరిపెట్టుకోవడానికి పాలస్తీనీయులు అంగీకరించారు. చర్చలకు, ఒప్పందాలకు సిద్ధమంటూనే జెరూసలెంలో అంగుళం భూమిని వదిలేది లేదని షరతు విధిస్తుంది ఇజ్రాయిల్. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల బీరూట్, లెబనాన్, పాలస్తీనా, గాజా, లిబియా, సిరియా, శరణార్థి శిబిరాల్లోనూ భయాందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడు, ఏమి జరుగుతుందోనని, ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. 90వ దశకాలలో ఓస్లో వేదికగా ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగాయి. జెరూసలెం అడ్డు ఉండకూడదని భవిష్యత్తు చర్చలకు వదిలేశారు. అమెరికా దౌత్య కార్యాలయాన్ని టెల్ ఆవీవ్ నుంచి జెరూసలెంకు తరలిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్న పశ్చిమాసియాలో మరో చిచ్చు రగిల్చారు. మూడు మతాలకు పవిత్రమైన ప్రదేశం. యూదులకు విడదీయరాని అనుబంధం. ఏసుక్రీస్తు నడియాడిన నేల. మహ్మద్ ప్రవక్త ప్రార్థన. మూడు మతాలకు చెందిన పురాతన చిహ్నాలు జెరూసలెంలో ఉంటాయి. అంతర్జాతీయ సమాజం గతంలో హెచ్చరించినా ఇజ్రాయిల్ లెక్క చేయలేదు. యూదుల నివాసం అంటూ ప్రపంచాన్నే నమ్మించడానికి ప్రయత్నించింది. ఇజ్రాయి ల్కున్న ఆర్థిక సైనిక సంపద వల్ల జెరూసలెంపై గుత్తాధి పత్యం కోసం ప్రయత్నిస్తుంది.1980 నుంచి జెరూసలెంను శాశ్వత రాజధానిగా చేసుకోవాలని ఇజ్రాయిల్ ప్రయత్నాల కు ట్రంప్ నిర్ణయం ఊతమిచ్చినట్టయింది. పాలస్తీనీయుల ఆశలు వట్టివైపోయాయి. ఆజ్యం రాజుకుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందోనని ప్రపంచ దేశాల్లో అలజడి మొదలైంది.
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటం వల్ల బిల్ క్లింటన్ నుంచి బరాక్ ఒబామా వరకు జెరూసలెం రాజధాని అంశాన్ని వాయిదా వేశారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయంతో అరబ్బు దేశాల్లో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి పాలస్తీనా పౌరులకు భరోసా కల్పించడం, అమెరికా ప్రజానీకం యావత్తు పాలస్తీనీయులకు మద్దతు ప్రకటించి వారికి నమ్మకం కల్గించాలి. ట్రంప్ నిర్ణయం మళ్లీ వెనక్కి తీసుకున్నట్టయితే పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుంది. లేనిచో ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఉహలకు అందదు. పాలస్తీనా, ఇజ్రాయిల్ల సమస్య పరిష్కారానికి ఐక్య రాజ్య సమితి చొరవ చూపాలి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పాలస్తీనీయులకు న్యాయం చేయాల్సి ఉంది.
- దామరపల్లి నర్సింహ్మారెడ్డి
సెల్ : 9581358696