Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు ప్రపంచం నలుమూలల నుం డి జ్ఞానసమూపార్జనకు మనదేశానికి వచ్చేలా చేసిన విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలైన తక్షశిల, నలంద లాంటివి ప్రాచీనకాలంలోనే భారత భూ మిని విజ్ఞాన భూమిగా మార్చిన ఘనచరిత్ర గలి గినవి. కానీ నేడు మనదేశంలో అంతటి స్థాయి విశ్వవిద్యాలయాలు లేక కునారిల్లుతున్నది. ప్ర పంచ స్థాయి ర్యాంకుల్లో ఒకటి రెండు మినహా (ఐఐటీలు) సుమారు 700 వర్సిటీలు గల మ న దేశం వాటి దరిదాపుల్లో కూడా లేకపోవటం దురదష్టం. అంతేకాదు ప్రస్తుతం ఆవిష్కరణల యుగం అని గుర్తించినప్పటికీ పరిశోధనలకు మ రింత ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ఉన్నత విద్యారంగాన్ని నిర్లక్ష్యం చే యడం గర్హనీయం. ప్రపంచంలో చాలా చిన్న దేశాలు కూడా పరిశోధన రంగానికి పెద్ద పీట వేస్తూ అనేక ఆవిష్కరణల ద్వారా కొత్త కొత్త ఉత్పత్తు లు చేస్తూ ఆర్థికంగా బలిష్టమవుతున్నవి. కానీ అందుకు విరుద్ధంగా భారతదేశంలో పరిశోధన రంగం పడకేయడమే గాక ఇతరులపై ఆధారపడటం పెరిగిపోతున్నది. నిజానికి ప్రపంచంలోని పలు దేశాలలో నూతన ఆవిష్కరణలలో భారతీయ మూలాలు ఉన్న శాస్త్రవేత్తలు అనే కులు కనిపిస్తారు. కానీ మౌలిక వసతుల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉద్యో గాలకు పెద్దపీట వేయటం లాంటి అంశాల వల్ల మనదేశం నుంచి విలు వైన ఆవిష్కర్తలు పరిశోధకులు పరాయి దేశాలకు పయనమవుతున్నారు. మన దేశంలో కూడా ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఉన్నత విద్యారం గంలో జీఈఆర్ క్రమేపి మెరుగవుతున్నది. 2009లో 9 శాతంగా ఉన్న ఉన్నత విద్యారంగం ప్రవేశాలు 2014-15 వచ్చేసరికి 23.6 శాతానికి పెరిగింది. అయినప్పటికీ వారికి ఉపాధి అవకాశాలతోపాటు నిజమైన జ్ఞాన సంపాదనను సమాజాభివద్ధికీ, నూతన ఆవిష్కరణలకు వినియో గించాల్సిన నూతన పరిశోధకులకు ఆర్థిక సహాయం లేకపోవడం కడు విడ్డూరం. ఏవో కొన్ని ప్రత్యేకమైన ఫెలోషిప్స్ తప్ప అందరికీ వర్తించేలా వారికి ఆర్థిక పరిపుష్టినిచ్చేలా ప్రస్తుతం పరిస్థితులు లేవని చెప్పాలి. ఆవిష్కరణలకు మన విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలంటే పరిశోధ నల వైపు విద్యార్థులను ఆకర్షించడమే గాక అందుకు సరిపడ మౌలిక వసతుల అభివద్ధి, విశ్వవిద్యాలయాలకు ఆర్థిక స్వావలంబనతోపాటుగా పరిశోధన విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించాలి. అలాగే యూజీసీ కూడా పరిశోధన రంగంలో ప్రక్షాళన కోసం ప్రతిపాదించిన ''కాపీ-పేస్ట్'' (నూతనత్వం లేని థీసిస్) పరిశోధన పత్రాల కట్టడికి తీసుకుం టున్న చర్యలు సమర్ధనీయమే కానీ సమర్ధ పరిశోధన చేయడానికి ఆర్థిక సహకారం, భరోసా కూడా ముఖ్యమేనని గ్రహించి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు విశ్వవిద్యాలయాలకు విరివిగా నిధులు మంజూరు చేయాలి. ఇకపోతే సమైక్య పాలనపై సుదీర్ఘ పోరాటం అనంతరం స్వరాష్ట్రం సాధించుకోవడంలో విశ్వవిద్యాలయాల విద్యార్థుల పాత్ర అనిర్వచనీయ మైనది. అందువలన మన రాష్ట్రం కూడా పరిశోధకులకు ప్రత్యేక పథకం తేవడంతోపాటు అందరికీ వర్తించేలా ఫెల్లొషిప్ పథకం ప్రవేశపెట్టాలి. గతంలోలా నాన్ నెట్ ఫెలోషిప్స్ ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకు న్న ప్రతీ పరిశోధక విద్యార్థికీ వర్తించేలా, వారి పరిశోధనలో ఆర్థిక ఇబ్బం దులు లేకుండా కనీసం రూ.ఇరవై వేలు ఇవ్వటమే కాకుండా విశ్వవిద్యా లయాల అభివద్ధికి కూడా మరింతగా కేటాయింపులు పెంచాలి. పరిశో ధకుల కనీస అవసరాలను తీర్చేలా, అద్భుత ఆవిష్కరణలకు వేదికగా వి శ్వవి ద్యాలయాలు మారాలంటే పరిశోధకులకు మరింత ఆర్థిక స్వావలం బన తప్పనిసరి. పరిశోధన రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి విలువై న ఆవిష్కరణలకు వర్సిటీలు వేదికలైతే ప్రపంచ స్థాయి మేధావులు, వా ణిజ్యవేత్తల దష్టి మనదేశంపై పడటం ఖాయం. తద్వారా దేశంలో ఉ పా ధి, ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా భవిష్యత్తులో భారతదే శం తప్పకుండా ప్రపంచ నూతన ఆవిష్కరణలకు కేంద్రస్థానం అవుతుంది.
- వినోద్కుమార్ సుద్దాల
సెల్ : 9908312949