Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివిధ మతాలు, జాతులతో మిళితమైన సువి శాల భారతదేశంలో పిల్లలను చదివించే ఆర్థిక స్థోమ తలేని కుటుంబాల్లో మొదటి ప్రాధాన్యం మగ పిల్ల వాడికి ఇస్తున్నారు. దేశంలోని చట్టాలు 14 ఏండ్లలో పు పిల్లలను పనిలో పెట్టుకోరాదని చెప్తున్నప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నీ అమ్మా యిని ఇంటిలోనూ, వారి వ్యవసాయ క్షేత్రాల్లోనూ ప నులకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. సంప్రదా యం ప్రకారం.. అమ్మాయికి వివాహానంతరం ఎటువంటి ఆర్థిక సహాయం అందించే సౌలభ్యం లేదు. తల్లిదండ్రులు సంపాదించే ప్రతి పైసా కుమారులపై నిస్సంకోచంగా వెచ్చిస్తున్నారు. ఆర్థిక కోణంలో ఆలోచించే కుటుంబాలు, అమ్మాయిలు చ దువులో రాణించగలిగినా, ఉన్నత విద్య కోసం ఖర్చు చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో బాలికల అ క్షరాస్యతా శాతం అతి తక్కువగా నమోదు కావడం గమనించాల్సిన విషయం. బ్రిటిష్వారు పరిపాలిం చిన కాలంలో అక్షరాస్యత 2.6శాతం మాత్రమే ఉం డేది. జ్యోతిరావుఫూలే వంటి సామాజిక వేత్తల కృషి ఫలితంగా స్త్రీల అక్షరాస్యతా శాతం, జీవన విధానం లో మార్పులు సంతరించుకున్నాయి. చదువు నేర్చు కోవడానికి స్త్రీలు, పురుషులతో సమానంగా హక్కుల ను కలిగి ఉన్నారని గ్రహించారు. ఈ క్రమం లోనే ఉద్యోగాల్లో కూడా స్త్రీలకు తగిన ప్రాధాన్యం ల భిం చింది. సామాజికవేత్తల కృషి వలన అక్షరాస్యతా శా తం పెరిగినప్పటికీ పురుషాధిక్య భావజాలంతో మ హిళలు అన్ని రంగాల్లో అనుకున్నంత ప్రగతి సాధిం చలేకపోతున్నారు. మహిళా అక్షరాస్యతా శాతం 2011 నాటికి 65.46శాతం, పురుషుల అక్షరాస్య తా శాతం 82.14శాతం ఉన్నది. 2001-11 దశా బ్దకాలంలో స్త్రీల అక్షరాస్యతా శాతం పెరుగుదల 9.2శాతం ఉండగా, పురుషులతో పోల్చినప్పుడు 25 శాతం తక్కువ నమోదైంది. ఉద్యోగ రంగంలో స్త్రీల సంఖ్య అతి తక్కువగా ఉండడానికి కూడా ఇదో కార ణం. గ్రామీణ ప్రాంతాల్లో తరగతి గదులు, మరు గుదొడ్ల సౌకర్యం సరిగా లేకపోవడం, రాష్ట్రంలో సుమారు 59శాతం పాఠశాలల్లో మంచినీటి సౌక ర్యం వంటి వసతులు లేకోపోవడం కూడా స్త్రీ అక్షరా స్యత సాధించలేకపోవడానికి కొన్ని కారణాలుగా చెప్పొచ్చు. అట్టడుగు వర్గాలకు చెందిన కుటుంబాల్లో బాలికలు 8వ తరగతి వరకు మాత్రమే చదువు కొనసాగించారు. బాలికలు కేవలం 2శాతం తిరిగి పాఠశాలల్లో చేరారు. మహిళలు నిరక్ష రాస్యులుగా ఉన్న ప్రాంతాల్లో జనాభా నియంత్రణ, పిల్లల ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ పథకాల అమ లుకు విఘాతం కల్గింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రు ల సంతానం ఆ ర్థిక, సామాజిక రంగాల్లో రాణించలే కపోతున్నారు.
మహిళా అక్షరాస్యత వృద్ధి రేటు?
అక్షరాస్యులైన స్త్రీలు కుటుంబ ఆర్థిక సమస్య లను సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగారు. ఆరోగ్యపరమైన సమస్యలను పోషకాహార లోపాన్ని, అధిక సంతానం నియంత్రణ, (ఫ్యామిలి ప్లానింగ్) బాల్య వివాహాలు, వరకట్నం వంటి సామాజిక రుగ్మ తలను కొంత వరకు సమర్థవంతంగా ఎదుర్కోగ లుగుతున్నారు. పిల్లల పెంపకం, సమాజంపై సదవ గాహన కలిగిన తల్లిదండ్రులు వారిని సామాజిక అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, కస్తూర్బాగాంధీ, మహత్మ, జ్యోతిరావుఫూలే వంటి ప్రభుత్వ పాఠశాల లు దారిద్రరేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాల వి ద్యార్థులకు విద్యను అందించడంలో తోడ్పతున్నప్ప టికీ, ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకు లు, ఆచార్యుల సంఖ్యను మరింత పెంచడం ద్వారా మహిళా అక్షరాస్యత శాతం పెరుగుతుంది. ఉన్నత విద్యావంతులైన స్త్రీలను ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగినులుగా, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రోత్స హించాల్సిన అవసమున్నది. 2017-18లో కూడా ఇంకా విద్యకు దూరంగా ఉన్న అభాగ్యులైన బాలికల ను ఆదరించి వారి అభ్యున్నతికి సహకరించడం మ న అందరి ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలి. నేటిత రం విద్యార్థినులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసి, వారి ఉన్నత చదువుల కోసం పూర్తి స్థాయి సహకారం అందిచండం నేటి సామాజిక అవసరం.
- ఎస్.సునీత
సెల్: 7995010639