Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో చేతివత్తుల పాత్ర మరువలేనిది. నేడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ఈ వత్తిని వదిలి పట్టణాలకు వలసపోతున్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, పరిశ్రామీకరణ, ప్రపంచీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో చేతి వత్తులు, కుటీర పరిశ్రమల వారు పోటీకి తట్టుకోలేక జీవన భృతిని కోల్పోతున్నారు. గుండు సూది మొదలు సోమనాద సుందర దేవాలయ ద్వారాల వరకు, జడ పిన్ను మొదలు మహా చక్రవర్తుల మణిమయ భుశిత కిరీటములు, సింహాసనముల వరకు విశ్వకర్మ కళాకారుల సష్టే. అజంతా, ఎల్లోరా, కోణార్క్, కజురహా, నాగార్జున కొండ, హంపిలేపాక్షి, రామప్ప దేవాలయం ఇలా మన దేశంలో అనేక చిత్ర శిల్ప కళాక్షేత్రాలు మనదేశ విశ్వశిల్పుల కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. భారతీయ సంస్కతి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించడానికి కారణం విశ్వశిల్పుల కళా సంపదే అనడంలో అతిశయోక్తి కాదు. నేటికీ చిలుము పట్టని అశోక స్తంభం మన కమ్మరుల నైపుణ్యానికి నిదర్శనం కాదా? క్రీస్తుపుర్వమే మేటుపల్లి రేవులో అందమైన ఓడలను తయారుచేసి ప్రవేశపెట్టిన వడ్రంగుల కౌశల్యాన్ని మరువగలమా ? ఇంతటి అత్యున్నత ప్రమాణాలతో శోభించిన చేతి వత్తుల దేదీప్యమాన పంచవృత్తుల తేజోనిరాజనం, నేడు అత్యంత దయనీయస్థితిలో కొడిగట్టి మసిబారిపోవడం అతిశోచనీయం. కొన్నేండ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలలో దుక్కిదున్నాలి, నాగలి కర్రు సరిచేసి పెడతావా? అనే పలకరింపులు వినిపించేవి. నేటి యాంత్రీకరణ చేతివత్తుల వారిని సమాజానికి దూరంగా విసిరివేసింది. యాంత్రీకరణ ఏనాడైతే వేగం పుంజుకొని, తమ జీవన విధానానికి విఘాతం కలిగించిందో, ఆనాడే పంచవృత్తుల వారు ఐక్యంగా ఉద్యమించవల్సింది. విశ్వబ్రాహ్మణులైన కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పం, స్వర్ణకార వృత్తులుగా మనుగడ సాగిస్తున్నారు. నాయకులకు ఓట్లకు పనికొచ్చే వీరు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నా ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోడం లేదు. బడుగు బలహీన వర్గాల పేరు చెప్పుకొని నాయకులు బాగుపడుతున్నారే తప్ప వాళ్లకు చేసిందేమీ లేదు. రాష్ట్రంలో సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ అన్ని పార్టీలు వీరిని విస్మరిస్తున్నాయంటే అది సమాజ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఈ వృత్తుల సమాజం పురాతన కాలం నుంచి నేటి వరకు మనదేశ పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి ములాధారంగా ఉంటున్నది. తమ వత్తి పనులతో అసమాన ప్రతిభ కౌశలాన్ని ప్రదర్శిస్తూ సుందరమైన, కళాత్మకమైన స్వర్ణాభరణాలు, శిల్పాలు, నగిషీ వస్తువులు రూపొందిస్తూ ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని ఇనుమడింపచేశారు. చేతివ త్తుల వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు స్పందించాలి. వారి జీవన విధానాలలో మార్పు కోసం వారి సాంకేతిక ఆలోచన ధోరణి పరిశోధన దక్పథం వైపు మరల్చాలి. కంటి తుడుపు చర్యగా కాకుండా సొసైటీల ద్వారా వారి కళ నైపుణ్యానికి తగిన వెల గట్టి మార్కెట్లో సౌకర్యాలు కల్పించాలి. మన సంప్రదాయ ఉత్పత్తులకు ఆధునికత జోడించి ఔత్సాహిక యువకులను ప్రోతహించాలి. ప్రభుత్వం మనవతా ద క్పథంతో స్పందించి, వెంటనే కార్యాచరణకు దిగాలి. మహిళల కోసం ,యువత కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి .ఎందరెందరో యువకులు,విద్యావంతులు ,చైతన్య వంతులు వ త్తిపనిలో నిష్ణాతులు పనులు లేక నిరాశ్రాయులుగా మిగిలిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కల్పించడానికి కుల వృత్తులను ఆధునీకరించడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి.
- సోక్కల తిరుపతి
సెల్ :9032390776