Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో పేద, మధ్య తరగతి ప్ర జలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే చౌకైన రవాణా సాధనాలు బస్సులు, రైళ్లు మాత్రమే. సాధారణ ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించడా నికి కార ణం సరసమైన ధర, ఉన్నంతలో మారుమూల ప్రాంతాలకు అందుబా టులో ఉండడమే. 60 మంది నిండు ప్రాణాలను బలిగొన్న కొండగట్టు ప్రమాద ఘటన ప్రయాణ భద్రతను ఏవిధంగా ఎంత పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుందో తెలుపుతున్నది. ఏటా 327.7 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తున్న ఈసంస్థ-తన పనితీరును సమూలంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నది.
కాలం చెల్లిన బస్సులే కాలాంతకం
1932 జూన్లో 27 బస్సులతో నాటి నిజాం స్టేట్ రైల్వేస్లో భాగం గా ప్రారంభమైన తెలంగాణ ఆర్టీసీ నేడు 8,550కి పైగా బస్సులతో ప్రయాణికులను చేరవేస్తున్నది. వీటిలో 30శాతం బస్సులు లక్షల కి.మీ. కు పైగా తిరిగినా ఇంకా ప్రయాణికుల చేరవేతలోనే ఉన్నాయి. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,400 కి.మీ. అయితే- ఆర్టీసీలో ఒక్కో బస్సు చంద్రమండలానికి నాలుగు సార్లు వెళ్లి వచ్చినంత దూరం ప్రయా ణిస్తున్నాయి. కొండగట్టు దుర్ఘటనకు కారణమైన బస్సు కూడా 14లక్షల 93వేల కి.మీ.కు పైగా తిరిగిందని డిపో ఉద్యోగులే వెల్లడించారు. దీన్ని ఎప్పుడో స్క్రాప్ కింద పక్కన పెట్టాల్సి ఉన్నా ఇంకా తిప్పడానికి అనుమ తించటంలో అధికారుల నిర్లక్ష్యం వెల్లడవుతున్నది. ఒక బస్సును 10 నుంచి 12 లక్షల కి.మీ. వరకు నడపవచ్చని ఆటోమొబైల్ రంగం నిపుణు లు తెలుపుతున్నారు. ఇలా జరిగిన తరువాత ఒకవేళ బస్సుల్ని ఓవర్హా లింగ్ చేయిస్తే మరో రెండు లక్షల కి.మీ. నడపవచ్చని వాళ్లు చెబుతుంటే ఆర్టీసీ మాత్రం ఏకంగా ఐదారు లక్షల కి.మీ. అదనంగా తిప్పుతున్నది. ఇలాంటి కాలం చెల్లిన డొక్కు బస్సుల్ని ఇంకా వినియోగిస్తూనే ఉన్నందున ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. బస్సుల కొరత ఉంటే ప్రభుత్వం కొత్త బస్సుల్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎప్పటి నుంచో ఆర్టీసీ ఒక విధానం పెట్టుకున్నది. కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తే వాటిని తొలుత నగరాలు, పట్టణాలకు ఏసీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులుగా నడిపిస్తున్నది. ఇవి పాతబడిన తరువాత గ్రామీణ ప్రాంతాలకు బాడీ మార్చేసి పల్లె వెలుగు పేరుతో నడిపిస్తున్నది. డిపోల్లో బస్సుల నిర్వహణకు మెకానిక్లు, ఇతర సిబ్బంది తగినంతగా లేకపోవడం పెద్ద సమస్య. ఎప్పటికప్పుడు బస్సులను తనిఖీ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొండగట్టు సంఘటన రుజువు చేస్తున్నది.
తెలంగాణ ఆర్టీసీలోని 97 డిపోల్లో మెకానిక్లు, శ్రామిక్ల పోస్టుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటిని నాలుగేండ్లుగా భర్తీ చేయలేదు. కొంతమందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకున్నా.. వారికి తగిన శిక్షణ లేదు. ఇక డ్రైవర్లు స్టీరింగ్పై రోజూ 12 నుంచి 14 గంటల దాకా పని చేస్తున్నారని కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. రోజూ 8 గంటలు పని చేయాల్సిన వారిని అతిగా పని చేయిసున్నారు. తెలంగాణ ఆర్టీసీలో దాదాపు 10,750 బస్సులు తిరుగుతున్నా.. వీటిలో 2,700 డొక్కువే. వీటిని పూర్తిగా స్క్రాప్కు తరలించాల్సి ఉన్నా.. ఇంకా వినియోగించడం ప్రమాదకరం. 5000 బస్సులు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆదిశగా అడుగులు పడడం లేదు.
- కె.బాలకిషన్రావు
సెల్ : 9966554945