Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలువైన వస్తు వు మనకు తెలియకుండా పోతే కలిగే బాధకన్నా, తెలిసీ పోగొట్టుకు న్నప్పుడు కలిగే బాధ తీవ్రంగా ఉంటుంది. అట్లాంటి ది వెలక ట్టలేని ప్రాణంపై కత్తి వేటు అదీ.. ప్రమా దం కాపు కా సుకొని ఉందని ముందే తెలిశాక కూ డా పడితే ఎంతలా విలవిల్లాడిపోతాం..? బుద్ధిమం తుడైన ఓ పాతికేండ్ల విద్యా ధికుడు, అట్టడుగు వర్గా ల్లోని ఆణి ముత్యం ప్రాణానికి ముప్పు వాటిల్లు తుందన్న వైబ్రేష న్స్ ఎంతలా స్ప్రెడ్ అయినప్పటి కీ.. జరుగకూడని క్రూర దుశ్చర్య జరిగిపోవడం పదాలకూ పెదాలకూ అందనంతలా కలిచివేస్తున్నది. చెట్టు కొమ్మను నరికినట్టుగా ఓ మనిషి యుడి మెడను తెగనరికిన కిరాతకం యావత్ సమాజాన్ని కదిలించింది. పదవి, అధికారం వంటివి ఏమా త్రమూ లేని ఒక సాధారణ యువ కుడి అంత్య క్రియలను టెలివిజన్ న్యూస్ చానళ్లు స్వచ్ఛం దంగా లైవ్ టెలికాస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. అంటే.. ఆ అంతిమ సంస్కారాల ప్రక్రియ నేపథ్యం ప్రజా బాహుళ్యం గుండెల్ని ఎంతగా పిండేసి ఉంటుంది. వ్యవస్థ ల విఫల జాడలకూ ఇది ఓ తార్కాణం. డబ్బు తో ఎంతకైనా తెగించవ చ్చనే మతిలేని తలంపులు, యంత్రాంగంలో అక్క డక్కడా నెలకొన్న బలహీనతలూ ఎంతటి హాని కలుగజేస్తాయో మిర్యాల గూడ ఉదంతం చాటుతున్నది. కుల, మత దురంహకారం, నిలువెల్లా పోగుబడిన ద్వేషం ఎంతటి అపాయానికి ప్రేరేపించిందో తెలుపుతున్నది. నిజానికి అమృత వర్షిణి 'ప్రణయ'ంలో నూటికి నూరు పాళ్లూ మెచ్యూరిటీ ఉన్నది. కనీసం ఏడేండ్ల అను'బంధం'తో ఏడడుగులు నడిచి ఆ మీదట ఒక్కటైన చక్కని జంట. క్షణికాకర్షణకు తావులేని నిఖార్సైన, ప్రేమ వారిది. బాగా చదువుకొని, ఆపై ఉద్యోగయోగానికి దగ్గరవుతున్నారు. సమాజ హితానికి, మూఢత్వాలు, మూర్ఖత్వాల బాపతుల్లో పరివర్తన తేవాలని కలలుగన్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చూపరులు అసూయపడేంతటి దాంతప్య జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ ప్రతి రూపాన్ని మరో మూడు నెలల్లో చూసుకొని 'తల్లి-తండ్రి' హోదాలో మురిసిపోదా మని ఊసులాడుకు న్నారు. ఇంతలోనే.. ఏండ్లుగా వెంటాడుతోన్న, వేటాడుతోన్న కసి కత్తి దించింది. నాగరికత ఒడిలో కుల, మత దురంహకార దురాగతం చెలరే గింది. ఆ అందమైన దంపతులను విడదీసింది. కుల, మతాల భావదారి ద్య్రాల ముండ్లు మనసున్న ఎందరి హృదయాలనో గాఢంగా గుచ్చుకునేలా చేసింది. పాలనూ, నీళ్లనూ వేరు చేసే హంసలా తన పాత్రను పోలీసు శాఖ సవ్యంగా నిర్వహిస్తే, ఎవరికైతే అండగా నిలబడాలో వారి పక్షానే లీడర్లు ఛాతీ వెడల్పుతో నిటారుగా ఉంటే ఇంతటి హింస, అనర్థానికి చోటే ఉండేది కాదు. 'అపాయం పొంచి ఉందనే సీసీ కెమెరాలు పెట్టుకున్నాం..' అని ప్రణరు నాన్న బాలస్వామి వాపోయారు. అంటే, ఆ సీసీ కెమెరాలూ ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. అక్కడే కాదు.. మరెక్కడైనా, ఎటువంటి నేరాలైనా నిందితులను పట్టుకోవడంలో పోలీసు, దర్యాప్తు విభాగాల పనిని సులువు చేస్తాయే తప్ప, దుర్మార్గాలను ఆపలేవని ఈ ఆపదతో విదితమవుతున్నది. 'నేరం చేయాలనే ఊహకే లాగు తడిసేలా ఉ..పో యిస్తాం' అంటూ బీరాలు పలికే, పాలక పెద్దలు, శాంతి భద్రతల విభా గమూ మిర్యాలగూడ ఉందంతంతోనైనా ఒక క్షణం గుండెల మీద చేయి వేసుకొని మథనపడాలి. లపంగి దందాలతో కోట్లకు పడగలెత్తాడనే డాబు ప్లస్ రుబాబు తప్పితే ఏ నైతికతా లేని ఆఫ్ట్రాల్ గాడి ఘాతుక పన్నాగం నుంచి అణగారిన వర్గాల చక్కటి పౌరుడిని రక్షించలేకపోయారు. అదీ.. ముప్పు పొంచి ఉన్నదని తెలిసి కూడా! ఓ వైపు ఆదర్శ వివాహాలకు ప్రోత్సాహకాలను రెట్టింపు చేస్తున్నట్టు పబ్లిసిటీ ఇచ్చినా ఆరగించే నేతలు మరోదిక్కు అదే ఆదర్శ జంటల్ని బతికించలేకపోతున్న బలహీనతను జయించలేకపోతున్నారు. కోటి రూపాయల సుపారి డీల్తో కత్తి చేతబట్టి నరికివేస్తామనే పెడ పోకడలు తాండవిస్తుండడంపై సూటిగా జవాబివ్వ గలరా? ఇతర శాఖలను అటుంచి సకల హంగులతో పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నప్పటికీ ఇట్లాంటి క్రూరత్వాలు ఇంతలా వికటాట్టహాసం చేస్తున్న మూలాలను తక్షణావసరం. ఎంతసేపూ లీడర్లు ముఖ్యంగా రూలింగ్ పార్టీ పెద్దల బందోబస్తులో పునీతులయ్యే పోలీసు పెద్ద సార్లు కాస్తయినా సమాజానికీ 'బందోబస్తు' ఇవ్వాలి. మంత్రులు, ముఖ్యమంత్రి వంటి నేతలకు నాలుగం చెలు, అయిదంచెలు అంటూ అంచెల్ని అమాంతం పెంచేసే సెక్యూరిటీలో సగం లేదా పావు లేయర్ అయినా తమను అపాయం కాచుక్కూర్చుందని వేడుకొనే ప్రణరు వంటి వారికి కల్పించాలి. నేరుగా రక్షణనిచ్చే వెసులు బాటు, మ్యాన్పవర్ లేకుంటే మరోలానైనా కాపాడాలి. ప్రభుత్వానికి పన్ను లు కట్టే అసలు యజమాను లైన పౌరుల మొరనూ గౌరవంగా ఆలకిం చాలి. మారుతీరావుకు ఒకటికి పది పర్యాయాలు కౌన్సెలింగ్ ఇచ్చి నమ్మి నంతలానైనా పాపం ఆ చక్కటి జంట విన్నపాలకు విలువ ఇవ్వలేకపోయామనే పశ్చాతాపాన్ని ఉండాలి. మిర్యాలగూడ దుర్ఘటనే ఆఖరుదవ్వాలి. ఆ భయంకర దాడి, దారుణ హత్య సన్నివేశాలు మన మదిలో కదలాడుతుండగానే, సత్వర న్యాయానికి చొరవ చూపాలి. ప్రత్యక్ష, పరోక్ష నిందితులకు గరిష్ట శిక్షలు పడేలా చూడాలి. ఆ శిక్షలూ ఇంతకంటే ఎక్కువగా టీవీలూ, పత్రికల్లో, ఇతర మాధ్యమాల ద్వారా నలుమూలల్లో ముఖ్యంగా నేరమయ మనస్తత్వంగల వారి చెవికి సోకేలా ప్రయత్నించాలి. అట్లాంటి ఎఫర్ట్స్తో సభ్య సమాజంలో మారుతీరావులు, సుపారి గ్యాంగ్ల ఉనికే లేకుండా చేయాలి.
- ఇల్లెందుల దుర్గాప్రసాద్
సెల్ : 9440850384