Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వీరుడి పేరే కాచం కృష్ణ మూర్తి. జనగామ తాలు కాలోని నీర్మాల గ్రామం. కాచం రామచంద్రయ్య, యశోదమ్మల తొలి సంతానం. చిన్ననాటి నుండే అల్లరి పిల్లగాడు. అందగాడు. అల్లరి పిల్ల లు అద్భుతాలు సృష్టిస్తారు అన్నట్టు గానే చదువుల్లో, ఆటల్లో, పాటల్లో, లెక్కల్లో, పనిలో, పట్టుదలలో, పరు గుల్లో, ప్రతిదాంట్లో ముందుండే వాడు. ఎంత కష్టమొచ్చినా అబద్దం ఆడకూడదన్న, క్రమశి క్షణ తప్పకూడదన్న నిబద్ధత బేర తొక్కలే దు. గీత దాటలేదు. వారు చదివింది ఐదో తరగతే. అది కూడా ఉర్దూ. పై చదువులు చది వే అవకాశమే లేదు. కరుణం పంతులు దగ్గర నూటపదహార్లు సమర్పించుకొని పార్శీ, ఉర్దూ, భూమి కొలతలు నేర్చుకున్నారు. వారింటిల్లిపాది రాట్నాలు వడకడం, వాటిని ఆసుపోసి కండెలు చేసి సాలెవాళ్లకు ఇచ్చి వచ్చేదాంట్లోనే జీవనం సాగించారు. కొత్త చొక్కా వేసుకున్న రోజే పండుగ. ఆన్నం ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు వారి ఇంటి చుట్టూ దొరలే. పెద్ద భవంతులు, వందలాది ఎకరాల ఆసాముల మధ్య బిక్కుబిక్కుమంటూ వంద పులుల మధ్య మేకలా! నిత్యం భయంతో బతుకుతుండేది ఆ గ్రామం.
ఒక రోజు దొరల పిల్లలంతా కచ్చడాలపై విసునూరు రామచంద్రా రెడ్డి గారి ఇల్లు చూడటానికి బయలు దేరుతుంటే ఆ కచ్చడంలో తన కింత చోటు దొరికితే చెన్నూరుకు వెళ్లాడు. కండ్లు చెదిరే బాంబే డిజై న్తో బంగ్లా చూశాడు. ఎటు చూసినా పులి చర్మాలు, తీరుతీరు లైట్లు, వేడి నీళ్లు, చలి నీళ్లు రావడం, జర్మనీ పాలరాతి బండలు, గడీముందే నిజమైన పులి చర్మంతో తయారు చేసిన చిరుతపులిని పెట్టారు. అది జనం మీద పడేటట్టు భయంకరంగా ఉంది. ఆ బంగ్లా ఎంత గొప్పగా కట్టినా సకల వృత్తులతో వెట్టి చాకిరీ చేయించి పీడించింది వాస్తవం. ఆ పసి వయస్సులో దోపిడీ అర్థ మైంది. మనసులో కసి పెరిగింది. అంతలోనే హెడ్ కా నిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ పై ఆరు నెలల తరువా త ఎస్ఐ కూడా అవుతావు అంటూ మేనమామ కబురంపాడు. నైజాం రాజ్యంలో దిక్కుమాలిన పని వద్దనుకున్నాడు.
పేద, ధనిక అంతరాలు, అస్పృశ్యతా, మూఢాచారా లు, కులాల కుంపట్లు, దోపిడీ దురహంకారాలున్నంత కాలం స్వేచ్ఛ లేదు అనుకున్నాడు. గట్టుమీద దొర, కింద కూలీ జనంపై హూంకరింపులేమిటి? ఛీత్కారాలు, వెట్టి చాకి రీ వేధింపులు ఎదుర్కొంటున్న వైనం సమూల చ్ఛేదం చేయా లన్న కసిని పెంచింది. వయసు పెరిగే కొద్దీ పేదలపై సాగు తున్న కిరాతకత్వాన్ని అవగాహన చేసుకున్నాడు. వస్తే రానీ కష్టాల్, నష్టాల్. చలించకుండా ఫ్యూడల్ దురంతాలకు ఎదు రొడ్డి పోరాడాలని నిశ్చయించుకున్నాడు. వారు బాల్యంలో ఉండగానే ఆంధ్రమ హాసభ పుట్టి పెరుగుతూ వచ్చింది. పదకొండవ మహాసభ గురించి విన్నాడు. పన్నెండవ మహాసభలో విప్లవ ఆలోచనల కు బీజం పడింది. ఆనాటి నుండి పోరాటం. పోరాటంలో ఎప్పుడూ మడమ తిప్పలేదు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణరెడ్డి, గంగుల సాయిరెడ్డి గార్ల సమక్షంలో సంఘం సభ్యత్వం తీసుకున్నాడు. తన తోటి వాళ్లను సభ్యులుగా పక్క గ్రామాల్లో దళాలుగా ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చాడు. క్రమశిక్షణ నేర్పాడు. శత్రువు చేపట్టే చిక్కులు విప్పసాగాడు. జనం పెట్టిన పేరు రాజన్నగా మారాడు. సంచిలో బుర్ర. ఇది ఉపన్యాసాలకు , పాటలకు , ప్రచారాని కి, రెండోది కర్ర ఆత్మరక్షణకు పని కొస్తుంది. మూడోది ప్రజాశక్తి చైతన్యం కావడానికి, చైతన్యవంతం చేయడానికి రాజన్న వచ్చిండన్నా, పాట పాడినా మాట మాట్లాడినా దోపిడీపై వడిగా విసిరిన వడిసెలాగుండేది. వెట్టి చాకిరీ చేసేటోళ్లకు ఏనుగునెక్కొచ్చినంత సంబరం కలిగేది.
చిన్న, పెద్ద జీతగాండ్లు రైలు ఇంజన్ నడిపేటోళ్లు
జైకొట్టి జండబట్టిరో- ఇసునూరి రామచంద్రారెడ్డి
సంఘపోళ్లు సైకొట్టిరో ఓరి రామచంద్రారెడ్డి కూటికి గుడ్డకు కరువైనోళ్లు- చెమట తీసి బతికేటోళ్లు
తుపాకీ బట్టి నిల్చిర్రో... కట్కూరీ రామచంద్రారెడ్డి
ఎర్రజెండ లెగరేసిర్రో.. అని పాడుతుంటే జనంలో పెద్ద సంచలనం. ఆయన మాటంటే హరీంద్ర గర్జన చేసినట్టు ఉండేది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాగిన పోరాటం. దున్నేవాడికి భూమి ఆ దశకు చేరింది. మూడు వేల గ్రామాల్లో 10లక్షల ఎకరాల్ని స్వాధీనం చేసుకొని గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసిన మహత్తర పోరాటంలో సాయుధ పోరాట సారధ్య బాధ్యతలు కోరివరించినప్పుడు ఆయుధం అందిపు చ్చుకున్నాడు. అడుగు వెనక్కి, ఆలోచన పక్కకు జరగని వీరు డు, ఎత్తుగడలలో ఎత్తు పీట వేసిన దూరదృష్టి. ఆయు ధాలను సమకూర్చుకోవడంలో తన దళ సభ్యులను ఉత్సాహ పర్చడంలోనూ విపత్కర స్థితి ఎదురైనప్పుడు మెలకువగా వ్యవహరించడంలోనూ బహునేర్పరి. గ్రామాల్లో ఎర్రజెండా పునాధులు గట్టిపరిచిన ఘనాపాటి. అయిలమ్మ సంబం ధించిన భూ పోరాటం, ఆ తదుపరి సాగిన ఊరేగింపుపై ము ష్కరులు సాగించిన కాల్పులకు నేలకొరిగిన దొడ్డి కొమురయ్య ఉదంతం నుండి కృష్ణమూర్తి గారి కార్యాచరణ ముమ్మర మైంది. గ్రామాల్లో పాటలతో ప్రజలను చైతన్యపర్చడం, అడ వుల్లో దళాలకు శిక్షణ ఇవ్వడం, దళాలను నడుపడం ఎన్నో దా డులు, ఎన్నెన్నో గడీలపై ఊదర బాంబులు, హడాయి దెబ్బ లు వేస్తూ శత్రువును నిద్రపోనిచ్చేవాడు కాదు. యుద్ధ తం త్రంలో ఆరితేరిన వీరుడుమరో యుద్దానికి ఆలోచించే నేర్పరి.
''రెండుసార్లు ఈల వేస్తే దళం పొజిషన్ తీసుకోవాలి. ఒక్కసారి ఊదితే ఎన్సర్కిల్ కావాలి.మూడు సార్లు ఊదితే ఫాలో కావాలి!'' అంటూ పదివేల మందితో దేవరుప్పల గ్రామానికి వచ్చి మార్చింగ్ చేయించాడు. శత్రువును హడలెత్తించాడు. ఎన్ని వేశాలు, ఎంత జాగ్రత్తో, ఏది చేసినా శత్రువుకు చిక్కలేదు. సైకిల్ తొక్కాడు, గుర్రం స్వారీ నేర్చుకున్నాడు. మోటారు బైకు నడిపేవాడు. వడిసేలు విసిరేవాడు. ఇప్పటికీ జనగామ, ఇబ్రహీంపట్నం, మంచిర్యా ల ప్రజల వద్దకు పోయి రాజన్న గురించి కదిలిస్తే... ఉసిల్ల పుట్టల్లా ఊరంతా కథలు, కథలుగా చెబుతారు. పోరాట కాలంలో అడవుల్లో ఉన్నప్పుడే తన దళ సభ్యురాలు శారదమ్మను పెండ్లి చేసుకున్నాడు. రెండవ వివాహమే అది కూడా అనివార్యమైంది. చివరి దాకా శారదమ్మ ఆయన వెన్నంటే ఉంది. ఆదర్శ జీవిత సహచరిగా ఆమెకు పేరుంది. కృష్ణమూర్తి గారెప్పుడూ తన కోసం తనెప్పుడు బతకలేదు. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలంటారు. అన్నింటికంటే ఎక్కువ అవమానాలు భరించాడు. ఎప్పుడు ప్రజాప్రతినిధిని కావాలనుకోలేదు. ధైర్యం రిస్క్కు వెరవని గుణం జనాకర్షక వాగ్దాటి ప్రజలతో మమేకం, రాజకీయ యుక్తి వీటన్నింటినీ మిక్సీలోవేసి బాగా రుబ్బితే వచ్చిన తెలంగాణ పౌరుషాగ్ని. ఆయన మరణించి పదేండ్లయినా దున్నేవాడికి భూమికి నోచని పీడిత వర్గాలకు నేటికీ ఆయన కాంతి పుంజం. నేటి పోరాటాల ద్వారా సాధించే విజయాల్లో 'మూర్తి' అన్న పేరు స్ఫూర్తి. ప్రతి లీడర్ ప్రతి క్యాడర్ తెలుసుకోవాల్సిన అనుభవాల పుస్తకం ఇది.
భూపతి వెంకటేశ్వర్లు
సెల్ : 9490098343