Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకులు పరుగుల జీవితాలు, ఆధునిక నాగరికత, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన జీవన విధానంలో ప లు మార్పులు చోటుచేసుకు న్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. సమాజంలో నైతిక విలువలు దిగజారుతున్న ఆందోళనలు కలిగిస్తున్నాయి. కుటుంబ స భ్యుల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతలు దొరక్క యాంత్రికజీవనం వైపుకు పరుగులు తీస్తున్నారు. కుటుబ విలువల ప్రాధాన్యత తగ్గుముఖం పట్టడం మూలంగా సమాజంలో కూడా విపరీత ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. ఈ దుస్థితిని అధిగమించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత నిర్వ హించాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. తదనుగుణంగా కాలాన్ని సద్వినియెగం చేసుకోవాలి. సమాజంలో మనం ఒక్క బాధ్యత గల పౌరులుగా మెలగాలి.
తల్లిదండ్రులుగా ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పోస్తూ పిల్లలను పెంచాలి. తమ పిల్లలను దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. దేశం కోసం పరితపించే వారిలో జీవన నైపుణ్యాలు పెంపొందించబడుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను, ప్రాధాన్యతను గుర్తిస్తాడు. విద్యార్థులలో చిన్నప్పటి నుంచే దేశభక్తి, జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కృషి చేయాలి. ప్రధానంగా యువత మానసిక ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ రోజు మనం ప్రశాంతంగా, సుఖం గా ఉన్నామంటే ఆనాడు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సమరయోధుల త్యాగాలు మరువలేనివి. ఎముకలు కొరికే చలిలో కూడా దేశం కోసం పనిచే స్తున్న సైనికుల గురించి నేటి యు వత ఆలోచించాలి. అలనాడు తల్లి జిజీయాబాయి కథలతో శివాజీని దేశ భక్తుడిగా తీర్చిదిద్దగా, చత్రపతిగా ఎదిగిన శివాజీ చరిత్రయే ఇందుకు తార్కాణం. ప్రపంచంలో అమ్మకు మించిన దైవం మరొకటి లేదు. నవమాసాలు మోసి పురిటి నొప్పులతో మరో జన్మకు శ్రీకారం చుట్టే తల్లి తమ పిల్లలను ప్రయోజకులుగా తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. స్వాతంత్య్రం రాక పూర్వం ఆనాటి మాతమూర్తులు తన పిల్లలు ఆదర్శయువతగా ఎదగాలని కోరుకు నేవారు. అందుకు తగ్గట్టుగా తల్లి తన ప్రయత్నం ఇం టినుంచే ప్రారంభించేది. ఆ తల్లి ఆశీస్సులతో ఎంతో మంది ఆదర్శంగా ఎదిగారు. ఇటు వంటి సంస్కారం దూరమైన కొద్దీ నేడు స్వతంత్రం, స్వేచ్ఛాభావం పక్క దారులు పట్టసాగాయి. అందుకు సాయంగా స్వార్థం పెరిగి, నేను నాది నేను బాగుండాలి, తప్పుచేసినా ఒప్పుచేసినా అనుకున్నది జరిగితీరాలి అనే పట్టుదల వల్ల యువత పక్కదారులు పట్టే అవకా శాలు ఎక్కువయ్యాయి. మాతత్వం ఎంత ముఖ్యమో, పిల్లల్ని దేశ భక్తులుగా తీర్చిదిద్దటం అంత ముఖ్యం. ఒక్క సారి ఆలోచించండి. దేశభక్తి కలిగిన యువకుడే తల్లిదండ్రులను అపురూపంగా చూసుకుంటాడనే విషయాన్ని మరువకూడదు. తల్లిదండ్రి తర్వాత ప్రము ఖమైన స్థానం ఉపాధ్యాయునిదే. ఉత్తమ పౌరులుగా ఎదగడానికి విద్యాలయాల పాత్ర ప్రముఖమైనది. తనకు యుక్త వయసు వచ్చేంతవరకు ఎక్కువగా గడిపేది విద్యాలయాలలోనే. ఉపాధ్యాయుని మాట పిల్లవాడికి వేదవాక్కు. పిల్లలను జాతీయ భావాలు పెంపొందిం చేవిధంగా రూపుదిద్దు కునేది విద్యాలయాలలోనే. ఉత్తమ పౌరులుగా ఎదగ డంలో ఉపాధ్యాయుల కృషి అమోఘమైనది. మూడు కాళ్ల ముదుసలి మామిడి చెట్టు నాటితేనే ఈ రోజు ఆ చెట్టుకు కాసిన మామిడి పండ్లు తినగలుగుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకో వాల్సిన అవసరం ఉంది. ఆనాటి స్వాతంత్య్ర సమర యోధుల కషి వల్లనే నేడు ఈ స్థాయిలో ఉన్నామనే విషయాన్ని మరువకూడదు. చరిత్రను మరువకూడదు. చరిత్రను తెలుసుకున్నవారే చరిత్రను సష్టిస్తారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించాలంటే దెశభక్తి భావనలు నాటాలి. భారతదేశానికి ప్రపంచ పటంలో సుస్థిర స్థానం ఉండాలంటే ఉత్తమ పౌరులుగా ఎదగడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.
- డా.అట్ల శ్రీనివాస్రెడ్డి
సెల్ : 9703935321