Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫీలింగ్స్ శరీరాలకు సంబంధించినవి కావు. ఇది పురుష శరీరం, అది స్త్రీ శరీరం లేదా అటు ఇటు కాని మూడో శరీరమని తేల్చడానికి మనిషికి ఎలాంటి హక్కు లేదు. మనిషి ఆకతుల ఆధారంగా శరీరాన్ని విభజించడం ఏంటి? మనసుకు సంబంధించిన భావాలను కొలిచి నువ్వు ఫలానా జాతి, వర్గానికి చెంది న మనిషివని చెప్పడానికి వీలు లేదు. మనిషి అంటే మనిషే, అందులో ఎలాంటి విభజనలు ఉండకూడదు. కొందరి అవసరాలకో, స్వార్థ ప్రయోజనాలకో మనిషిని జాతులుగా విభజించారు. అవే స్త్రీ, పురుషుడు. మనుషుల్లో ఈ రెండు జాతులే ఉన్నాయనుకొని వాటినే అంగీకరించడం ఏంటి? అధిక సంఖ్యలో ఎవరుంటే వారి దే పెత్తనం సాగడం ఏమిటి? ఉదాహరణకు పురుషుడికి ఉన్న ప్రకతి సహజ దేహ దారుఢ్యంతో స్త్రీని తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అలా కుదరదు. స్త్రీలు తమ హక్కులకై పోరాడుతున్నారు. నేటి స్త్రీ విద్యావంతురాలు, చైతన్యవంతురాలు, ధైర్యవంతురాలు. అలాగే హిజ్రాలు కూడా తమ హక్కులై పోరాడుతున్నారు. హిజ్రా అనగానే చులకన, కోపం, అసహ్యం లాంటివి కలుగుతాయి. కానీ వారిని మన పూర్వికులు ఎంతో ప్రేమాభిమానాలతో చూసేవారు. వారికి తగిన గౌరవం ఇచ్చేవారు. అందువల్ల హిజ్రాలకు బిక్షాటన, వ్యభిచారం చేయాల్సిన దుస్థితి తప్పనిసరి కాలేదు. హిజ్రా అనేది ఇప్పుడు మొదలైంది కాదు. వీరి గురించి అటు పురాణాల్లో ఇటు చరిత్రలో కూడా ఉన్నది. మన దేశ చరిత్ర పూర్వం నుండీ హిజ్రాలు, లింగమార్పిడి దారుల ఉనికిని నమోదు చేస్తూనే వచ్చింది. మరి వీరు ఎప్పటి నుండి వివక్షకు గురౌతూ వచ్చారంటే వందేండ్ల క్రితం బ్రిటిష్ పాలకులు వీరిని నేరస్థుల ముఠాగా ముద్ర వేయడంతో యావత్ సమాజం వీరిని అపార్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఫలితంగా భారతీయ హిజ్రాలు నేటికీ యాచకుల్లాగే మిగిలిపోయారు. హిజ్రాలు వందేండ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. లైంగికంగా దోపిడీ చేయబడుతున్నారు. కుటుంబాలు త్యజించి నప్పటికీ హిజ్రా కమ్యూనిటీలోని ఇతర లింగమార్పిడి దారులతో వీరు జీవిస్తున్నారు. ఒక లింగమార్పిడి దారుకు సమాజంలో జీవితం కొనసాగించడం నిజంగానే నరకప్రాయం అవుతోంది. సమాజం వీరిని దూరంగా పెట్టింది. కనీసం వారు మన ఇంటి పక్కన ఉన్నా తట్టుకోలేని వారూ ఉన్నారు. ఇలా అనేక కారణాల చేత హిజ్రాలు సమూహాలుగా సమాజానికి దూరంగా జీవించేలా చేశారు. సామాజిక ఆదరణ లేకపోవడంతో అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. మొదట ఇంటి పెద్దను ఎన్నుకొని ఆమెను దీదీగా వ్యవహరిస్తారు. డబ్బు సంపాదన అడుక్కోవడం, బలవంతపు వసూళ్ల రీతిలో ఉంటుంది. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక ఈ మార్గాన్ని ఆశ్రయించవలసి వస్తోందని వారి వాదన. మరికొందరు వ్యభిచారం చేస్తూ వారి పొట్ట నింపుకుంటారు. మన రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం దేశ పౌరులందరితో పాటు హిజ్రాలకు కూడా గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కును కల్పించింది. ప్రత్యేకించి 14, 15 ఆర్టికల్స్ మతం, జాతి, సెక్స్, జన్మస్థలం ప్రాతిపదికన వివక్షత చూపడాన్ని నిషేధించాయి. ఈ రకమైన చట్టాలు స్త్రీ పురుషులకు మాత్రమే సంబంధించినవి కాదు. అవి భారత పౌరుల, వ్యక్తుల గురించి ప్రస్తావిస్తున్నాయి. లింగమార్పిడి దారులు కూడా భారత పౌరులే. ఈ చట్టాలు హిజ్రాలు, లింగమార్పిడి దారులతో సహా సమస్త వ్యక్తుల హక్కులను కాపాడుతున్నాయి కానీ అవన్నీ పుస్తకాలకు పరిమితం కావడమే వారి ఈ దుస్థితికి కారణ మవుతోంది. సాహిత్యంలో కూడా హిజ్రాల పాత్ర చాలా తక్కువ. అక్కడక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు కాని మన తెలుగు సాహిత్యంలో లేరు. వారి మీద పుస్తకాలు కూడా ఎక్కువగా కనపడవు. హిజ్రాలు ఎందురైనప్పుడు వారిని చిత్కారంతో, అవహేళనతో చూస్తాం. కానీ అది వారు భరించలేరని, వారి మనసు ముక్కలు అవుతుందని ఊహించలేం. కూడా తమ మనిషిగా గుర్తింపు కావాలని కోరు కుంటారని గ్రహంచలేం. ఎక్కడో ఒక్క చోటైన మానవత్వం ఉన్న మనిషి లేక పోతాడా, వారు మమ్మల్ని గుర్తించక పోతారా అని వారి ఆశ. ఆకులు రాలిన చెట్టు వసంతానికై ఎదురు చూసినట్లు ఒక మెత్తని స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తుంటారు. హిజ్రాలపై లైంగిక దాడులు జారుతున్నాయి. వాటిని నిలువరించాలి. సాటి మనిషిగా వారిని గౌరవించాలి. ఈ దేశ పౌరులుగా వారికి అన్ని హక్కు లూ ఉంటాయని గుర్తిం చాలి.
- పద్మావతి దేవి
padmavathyd610@gmail.com