Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల్లో సైనికులు, రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ప్రచారంలో వాడుకోరాదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడంతో బీజేపీ, దాని వంధుమాగదిల నోళ్లల్లో పచ్చివెలక్కాయ పడినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్తో ఎన్నికల్లో లబ్దిపొందాలనే కుయుక్తితో బీజేపీ ఆడిన జగన్నాటకానికి సుప్రీం ఫుల్స్టాప్ పెట్టింది. అయోధ్య అంశాన్నీ రాజకీయం చేసి, ప్రజలను విభజించి మళ్లీ అధికారంలోకి రావాలనే కోరికకు చిల్లుపడేలా చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు ప్రజాస్వామ్యవాదుల నుంచి, వామపక్ష పార్టీల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మతం, దేశ రక్షణ పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవనాన్ని ఛిద్రం చేస్తున్న నేపథ్యంలో సుప్రీం రూలింగ్ ఆహ్వానించదగిన పరిణామమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.
- బి.బసవపున్నయ్య