Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాను రాను ఎన్నికల్లో తమను ''గెలిపించండి'' అనే నినా దా నికి బదులు ప్రత్యర్థులను ''ఓడిం చండి'' అనే నినాదమే ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు? ఎందుకంటే ఒకసారి అధికా రంలోకి వచ్చిన పార్టీలు వారి ప్రయోజ నాలు, వారి అనుయాయుల ప్రయోజనా లు కాపాడుకోవడానికి చూపే శ్రద్ధ ఎన్ని కలలో ప్రజలకిచ్చిన హామీల అమలులో చూపటంలేదు. కనుక వారికి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టండని అడిగే ధైర్యం లేక ప్రత్యర్థిని ఓడించండనే నెగెటివ్ నినాదంతో పరోక్షంగా అధికారం కావాలని అడుక్కుంటున్నారు.
అయితే ప్రజలు కూడా 'దొందు దొందే' అయినప్పుడు ఏ రా యి అయితేనేం తలపగలగొట్టుకోవడానికి అన్నట్టుగా ఒకసారి వారికి, ఒకసారి వీరికి అధికారం కట్టబెడుతున్నారు. ఇష్టంగా కా దు ప్రత్యామ్నాయం లేక. దురదృష్టవశాత్తు ప్రజాస్వా మ్యంలో ఓ టు శక్తివంతమైనదిగా చెప్పుకున్నా అది వ్యక్తులను మార్చేందుకు ఉపయోగపడుతుందే తప్ప స్థీరీకృతమైన వ్యవస్థ మార్పునకు దో హదపడటం లేదు. ప్రజల ఇష్టానుసారంగా ఎన్నుకోబడుతున్నా యని చెప్పబడుతున్న ప్రభుత్వాలు ప్రజల ఇష్టానుసారం పాలన చేయట్లేదు. పైగా ప్రజలు గొంతెత్తితే, వారి పక్షాన నిలబడి మా ట్లాడితే నిర్భంధం రాబందై ఎదురు చూస్తున్నది. స్వాతంత్య్రం సి ద్ధించి 70 ఏండ్లు గడిచినా దేశంలో సామాన్యుల దుస్థితి మార లేదు. మరి తమ బతుకులు మారుతాయనే కదా ప్రజలు ఎన్ను కున్నది. అయినా ప్రజల బతుకులు మారట్లేదు ఎందుకు? ఎందు కంటే దేశ పాలకులు అవకా శవాదంతో అధికారా న్ని చేజిక్కించుకో డానికి ప్రయత్నిస్తు న్నారే తప్ప ప్రజల జీవి తాలను మెరుగు పరుద్దామని ప్రయత్నిం చట్లేదు. ''ఓడించండి, గెలిపంచం డి'' అ నే నినాదాల మధ్య ప్రజలు ఎవర్ని గెలిపించాలో, ఎవర్ని ఒడించాలో తెలియక వెర్రిముఖా లేసుకుని చూస్తున్నారు. సగటు సామాన్య మానవులు ఎవరో ఒకరి మొఖాన తగలేద్దాం అని ఓటు వేస్తున్నారే తప్ప వారి మనస్సాక్షిగా వేయట్లే దు. కొన్ని మౌలిక ప్రశ్నలు వేసుకొ ని ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో ఎవ రిని గెలిపించాలీ, ఎవరిని ఓడిం చాలి! 70 ఏండ్ల స్వాతంత్ర దేశం లో కేవలం ఒక శాతం ప్రజల వద్ద 70 శాతంపైగా ధనం పేరుకు పోయి, మిగతా 99 శాతం ప్రజల వద్ద కేవలం 30 శాతం ధనం ఎట్లా ఉన్నది. ఇట్లా ధనవంతులు మరింత ధనవంతులుగా మార డానికి సహకరిస్తున్నదెవరు? స్వదేశీ పేరుతో స్వాతం త్య్రం సాధించిన గాంధీజీ వారసులమని చెప్పుకునేవారు విదేశీ సంస్థల కు తలుపులు బార్ల తెరుస్తున్నారు. దేశభక్తి పేరుతో ఊదరగొట్టే కుహన నాయకులు కార్పొరేట్ వ్యక్తులకు, విదేశీ శక్తులకు దేశ సహజ వనరులన్నీ దొచుకునేలా సహకరిస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో కూడా పార్టీలన్ని ఒక్కటే.. రైతులు అప్పుల బాధతో చచ్చాక వర్తించే పరిహారం (ఇన్సురెన్సు) గురించి చెపుతున్నారు కానీ, రైతుల చావును నివా రించే గిట్టుబాటు ధర ఇస్తామనీ, పంట నష్టానికి ప్రభుత్వమే బీమా చేయిస్తుందని, ఏ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పరు గాక చెప్ప రు. బడా బాబులు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినా చోద్యం చూసే పార్టీలు, రైతులకు రూణ మాఫీ చేయ టానికి మాత్రం తటపటాయిస్తాయి. రుణమాఫీ అమలు చేయ టానికి రైతులు రోడ్లమీదకి వచ్చి పోరాటాలు చేయాల్సి వస్తోంది. దేశాభివృద్ధికి మూలమైన విద్యా, వైద్య రంగాలను కా ర్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తూ, ప్రజా రోగ్యాన్ని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కావాలని నిర్వీర్యం చేస్తూ, సామాన్య ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. సంక్షేమం అ ంటే డబ్బులు పంచడమే అని భావిస్తూ, సంక్షే మమంటే ప్రజల బాగోగులు చూడటం ప్రభుత్వ బాధ్యత అనే విషయాన్ని విస్మ రిస్తున్నారు. మన దేశంలో నాయకులకు రాజ కీయ ఉపాధి అవ కాశాలకు ఇబ్బందే లేదు. కానీ 70 శాతం యువత ఉపాధి అవకా శాలు లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టా డుతోంది. ప్రభుత్వ రంగం లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించి యువతకు ఉపాధి చూ పించాల్సింది పోయి, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించడం మూ లాన యువత ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నది. ఇట్లాంటి తరుణంలో ప్రయివేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చే స్తామని ఏ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పదు (వామపక్షాలు మినహా). అభివృద్ధి చెందుతుందని చెప్పు కుంటున్న దేశంలో ఇంకా ఆర్థిక, సామాజిక అసమాన తలు, జాతి, లింగ వివక్ష, విద్వేషాలు కొన సాగుతూనే ఉ న్నాయి. పార్టీలన్నీ వారి ప్రయోజనాల కో సం వీటిని వాడుకుంటున్నాయే తప్ప వాటిని రూపు మాపి సమసమా జాన్ని నిర్మించడానికి ఏ మాత్రం కృషి చేయడం లేదు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో, అభివృద్ధి నినాదంలో బీజేపీ, కాంగ్రెస్ల విధానం ఒక్కటే.. గాజు సీసాలో మురి గిన రంగు నీళ్లు తీసేసి కొత్త రంగు నీళ్లు మార్చినట్టుగా 5 ఏండ్లకొకసారి పాలించే పార్టీల రంగు మారుతుందే తప్ప ప్రజల జీవితాలలో మార్పేమీ కనిపించట్లేదు. గరీబీ హఠావో నుండి సబ్కే సాత్ సబ్కా వికాస్ వరకూ నినా దాలెన్నొచ్చినా పేదరికం తగ్గిందా? పెరిగిందా? నిరుద్యో గం, రైతు సమస్యలు పెరిగాయా తగ్గాయా? ఇవి ఏటికేడు పెరుగుతూనే ఉ న్నాయి. పార్టీలన్నీ ఎన్నికల వేళ అవి ప్రకటించే మ్యా నిఫెస్టోలలో ప్రజల తక్షణ ప్రయోజ నాలను తాత్కాలిక ప్రాదిపదికన తీర్చే హామీలుంటు న్నాయే తప్ప ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిం చే ఉద్దేశంతో దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించేవిగా ఉండట్లేదు. గడిచిన ఐదేండ్ల పాలన కాలంలో ప్రభుత్వ పనితీరు గత ప్రభుత్వాలకంటే మరింత అప్రజాస్వామికంగా సాగింది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా సహజ వనరులను పరిరక్షించాలి అన్నప్పుడు అభివృద్ధి నినాదం కత్తై దూసుకొస్తుంది. వివక్ష విశ్వా సాలను ప్రశ్నిస్తే మతం కొరడా ఝులిపిస్తుంది. హక్కుల అమలు కు గొంతెత్తితే రాజ్యాధికారం బొక్కలో తోస్తుంది. ఇప్పుడు చెప్పం డి ఎవరిని ఓడించాలి మనం. ప్రజా వ్యతిరేక పాలనా విధానాల్ని ఓడించాలి. మనిషికి విలువలేని, చోటులేని అమానవీయ వ్యవస్థను ఓడించాలి. ప్రజాస్వామిక పాలనా విధానాల కోసం పోరాటం చేయాలి. ప్రజాస్వామిక విధానాలను గెలిపించాలి.
- వనపాకల దిలీప్
సెల్: 8464030808