Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుస ఎన్నికల నేపథ్యంలో సర్కారు సెలవుల్లో ఉంది. పాలనను పక్కనపెట్టి ఎన్నికలపైనే దృష్టి పెట్టింది. అన్నింటా తామే ఉండాలన్న ఉద్దేశంతో గత ఆరు నెలలుగా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. మళ్లీ ఐదేండ్ల వరకు ఎన్నికలు లేకపోయినా ఎంతసేపూ ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే దృష్టి పెట్టిందే తప్ప ప్రజలు పడుతున్న కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని ఎన్నికల్లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్న ఆలోచన తప్ప ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విద్యను కూడా ప్రయివేటు పరం చేయాలన్న ఆలోచనతో ఇంటర్మీడియట్కు చెందిన 22మంది విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనపై ఫలితాలు వెలువడిన వారం రోజులకు గాని సర్కారు కండ్లు తెరవకపోవడం శోచనీయం. మళ్లీ ఐదేండ్ల వరకు తమను ఎవరూ ఏమీ చేయలేరు అన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. కానీ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇంటర్బోర్డు ముందు ప్రజలూ విద్యార్థి సంఘాల ఉద్యమాలే నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి. సర్కారు దృష్టి సారించాలి.
-టి సంజరుకుమార్