Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటర్బోర్డు వ్యవహారంలో టీఆర్ఎస్ సర్కారు దిమ్మ తిరిగి కండ్లు బైర్లు కమ్మినంత పనైంది. బబ్లింగ్ చేయడంలో చోటుచేసుకున్న పొరపాట్లు సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా పుణ్యమేనని త్రిసభ్య కమిటీ చెప్పినా, చెప్పకపోయినా నగసత్యమదేనన్నది ఇప్పటికే తేలిపోయింది. అయితే కేసీఆర్ సమీక్షించి, చర్యలు ఆదేశించినా కొత్తగా ఒరిగిందేమీ లేదని అంటున్నవారూ లేకపోలేదు. ఫలితాల్లో తప్పిదాల మూలంగా ఇరవైరెండు మంది విద్యార్థులు విలువైన ప్రాణాలను పోగొట్టుకున్న తరుణంలో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఫెయిలైన విద్యార్థులకు దయతో ఇచ్చిన ఉచితంగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫ్యాకేజీ పట్ల తల్లిదండ్రుల్లో నిరసన వెల్లువెత్తుతున్నది. ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తే, చిన్నారుల ప్రాణాలు కొన్నయినా దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు మాత్రం దున్నపోతుమీద వాన కురిసిన చందంగా ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది.
- బి.బసవపున్నయ్య