Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకపక్క దిగులుపడుతుంటే.. గెలిచిన ఎమ్మెల్యేలంతా జంపు జిలానీలవుతున్నారు. దీంతో ఆ పార్టీ దుకాణం దాదాపు ఖాళీ అవుతున్నది. అయితే మిగిలినటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైంది. ఆయా నియోజకవర్గాల్లో తమ మీద ఓడిపోయిన వారే.. పెత్తనం చేస్తుంటే.. ఏం చేయాలో వారికి పాలుపోవటంలేదు. ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా చలామణీ అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వీరు మాత్రం నామ్కేవాస్తేగా మారిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల ద్వారా వెళితేనే.. తమ పనులు అవుతాయని ప్రజలు భావించటమే ఇందుకు కారణం, ఈ క్రమంలో పెన్షన్, రైతు బంధు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు... ఇలా దరఖాస్తులన్నీ ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థుల నుంచే అధికారులకు చేరుతున్నాయి. దీంతో తలలు పట్టుకోవటం వారిపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వంతవుతున్నది...
- బివిఎస్ పద్మరాజు.