Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారంతోపాటు ఎన్నికల రోజు సామాజిక స్పృహ కలిగిన వారు, మేధావులు, విద్యావంతులు కూడా ఒ క ఛాలెంజ్ని విసురుతూ బాధ్యతలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. 'నేను నా ఓటు హ క్కును వినియోగించుకున్నాను. మరి మీరు.. !?'... ఇది దాని సారాంశం. రాజకీయంగా, సిద్ధాంతాల పరంగా విబేధాలు ఉండవచ్చు.. ఒకరికి నచ్చిన పా ర్టీకే వేయాలనే నిబంధనేమీ లేదు. ఆయినా వారి ఉద్ధేశం మాత్రం ఓటు వేయడమే.. ఇ ది మన హక్కు.. మన బాధ్యత అని గుర్తు చేయడమే. ఇది చాలా అభినందనీయమైన ఉత్సాహం.. ఈ ఓటు హక్కు నిజానికి అం దరికీ ఒకేసారి రాలేదు.. బ్రిటీష్ కాలంలో కేవలం భూస్వాములకు (భూస్వామ్య స్త్రీల కు కూడా) మాత్రమే ఉండేది. భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఎలాంటి ధన, కుల, ఇతర బేధాలు లేకుండా స్త్రీ, పురుషులిద్దరికీ ఓటు హక్కును కల్పించారు. ఇది రాజ్యాంగం అందించిన సమాన స్ఫూర్తి సిద్ధాంతం.. ఐదేండ్లకోసారి ప్రభుత్వాలను ఏలే ప్రతిని ధులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఉపయోగపడుతుంది. ప్రపంచంలో పెద్ద ఆర్థిక దేశమైన అమెరికాలో రీకాల్ వ్యవస్థ ఉంది. వారికి నచ్చని ప్రజాప్రతినిధులను రాజీనామా చేయి ంచే అధికారం అక్కడి ప్రజలకు ఉంది. మనదేశంలో రీకాల్ వ్యవస్థ రావాలనే డిమాండ్ అనేక ఏండ్లుగా కొనసాగుతోంది. నిజానికి మన దేశంలో గెలిచిన తర్వాత పార్టీలు మారే వారికి కొదవ లేదు. వ్యక్తిగత లేదా పార్టీ అభిమానంతో ఓట్లు వేసే వారికీ కొదవ లేదు. ఎన్నికైన తర్వాత మళ్లీ ఐదేండ్ల వరకూ కనబడని ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామాల్లో మౌలిక సౌకర్యా లు కావాలని కాళ్ల చెప్పులరిగేలా తిరిగే సాధారణ ఓటర్లూ సర్వ సాధారణం. ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని కోరు కుంటున్నవారు అంతే బాధ్యతగా అమలు చేయాలని ఇదే స్థా యిలో కోరుకుంటున్నారా? అన్నది ప్రశ్న.. రాజ్యాంగంలో సా ర్వభౌమాధికారాన్ని స్వయం ప్రకటితంగా పేర్కొన్నారు. మన దేశం స్వతంత్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. సా ర్వభౌమత్వం అంటే.. మన దేశం ఇతర దేశాల పాలనలో లేద ని, స్వయం ప్రకటిత స్వేచ్ఛ కలిగిఉందని.. కానీ రిలయ న్స్ అధినేతలు, జిందానీ, అదానీ వారసులు మన పార్లమెంట్ ను, చట్టాలను శాసిస్తున్న స్థితి బహిరంగ రహస్యం.. అమెరి కా అధ్యక్షుల చేత పొగడబడటమే గొప్పగా మన ప్రధాన మ ంత్రి, ఆయన అభిమానులు భావిస్తు న్నారు. 90వ దశకంలో నే ' సిరిగల్లా భార తదేశం తమ్ముడా.. తా కట్టు పెట్టబడ్డది తమ్ముడా' అంటూ రచ యితలు ఈ దేశా న్ని మేల్కొలిపేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మన తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రస్తుత గణా ంకాల ప్రకారం భారతదేశంలో పుట్టే ప్రతి చిన్నారి రూ.లక్ష అప్పుతో జన్మిస్తున్నాడు. మన దేశంలో తిండి, విద్య, ఆవాసం, జీవి ంచే స్వేచ్ఛ అందరికీ సమానంగా ఇచ్చిన ట్టు రాజ్యాంగం చెబుతోంది. వాటిని కల్పించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైన ఉంచింది. ఆకలి చావులు, రైతుల ఆత్మ హత్యలకు ఈ పాలకులను బాధ్యులను చేస్తూ ఇదే స్థాయిలో ప్రశ్నించే భారతీయ ఓటర్లను చూడలేకపోవడం విషాదక రం.. రాజ్యాంగం ప్రకారం కులం, మతం, రంగు, భాష కార ణాలు చూపి వివక్షత పాటించడం నేరం.. భారతదేశంలో ఎ క్కడో ఒక చోట ఈ వైరుధ్యాల కారణంగా మనుషులు వివక్ష కు, హత్యలకు గురవుతున్నారు. మహిళలు, చిన్నారులు లైం గికదాడుల్లో బాధితులుగా మారుతున్నారు. చనిపోతున్నారు. ఈ అఘాయిత్యాలను ప్రశ్నించేందుకు ఈ సామాజిక స్పృహ ఎందుకు కనిపించడం లేదు? సుసంపన్న భారత దేశ సార్వభౌమత్వానికి కృషి చేస్తామని ప్రతి రోజూ ప్రతిజ్ఞ చేసిన భారతీయ మేధావులు, విద్యావంతులు ఇదే ఉత్సాహాన్ని భార త రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడంతోపాటు ఉల్లం ఘనలనూ ప్రశ్నించాలి.
- వంగాల రమేష్