Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూలాగే పేపర్ చదువుతుండగా దష్టి ఒక వార్తమీదకి పోయింది. ఆత్మలు వెంటాడుతున్నాయని, ఒక తల్లి తన ఐదుగురి పిల్లలతోపాటు బావిలో దూకిందన్నది ఆ వార్త సారాంశం. ఈ సంఘటనలో తల్లి తోపాటు నలుగురు పిల్లలూ చనిపోయారు. అది చదివిన వెంటనే ఆ తల్లి అమాయకత్వానికి జాలిపడాలో, లేక లేని ఆత్మలు ఉన్నాయని చెప్పి వారిని మానసికంగా బలహీనులను చేసిన మత ప్రచారకులను నిందించాలో నాకర్థం కాలేదు. సరిగ్గా ఇలాగే కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది సభ్యులు, మోక్షం కోసం బలవన్మరణానికి పాల్పడిన సంఘటనను ఇది గుర్తుకు తెచ్చింది.
పై సంఘటన జరగడానికి సరిగ్గా 4రోజుల ముందు సైన్సు సభలలో పాల్గొనడానికి మేము హైదరాబాద్ బయల్దేరాము. దారిలో అనేక సామాజిక అంశాలు, మూఢనమ్మకాలపై చర్చించుకుంటూ, ప్రయాణం సాగించాం. మా చర్చ దెయ్యాలపైకి వెళ్లింది. మాతోపాటు ఉన్న విజయ అనే ఉపాధ్యాయురాలు వాళ్ల స్కూల్లో ఎదురైన ఒక అనుభవాన్ని మాతో ఇలా చెప్పడం ప్రారంభించింది.
''అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి. చాలా చురుకైన విద్యార్థిని. ఏం జరిగిందో తెలియదు కాని గత కొన్ని రోజులుగా పాఠశాలకు రావడం మానేసింది. ఎందుకని ఆరాతీస్తే, మాకు తెలిసిన కారణంతో ఆశ్చర్యానికి గురయ్యాం. ఆ అమ్మాయి ఇలా చెప్పింది. 'మేడం పాఠశాలకు వచ్చే దారిలో ఒక పెద్ద చింతచెట్టు ఉంది. నేనెప్పుడు అటువైపునుంచి వచ్చినా, ఆ చెట్టుపైన ఏదో శక్తి వింత శబ్దాలు చేస్తూ, భయపెడుతోంది. నాకు పరిచయమున్న ఒకామె ఈ మధ్యే చనిపోయింది. ఆమే దెయ్యమై నన్నిలా భయపెడుతున్నది. నన్నెప్పుడేం చేస్తుందోనని భయపడి, పాఠశాలకి రావడం మానేశా'' అని చెప్పేసరికి నిర్ఘాంతపోవడం మావంతైంది. ఆ విషయం చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అప్పుడేం చెప్పినా అర్థం చేసుకోలేదని గ్రహించి, ఆ అమ్మాయితో ''రేపు పాఠశాలకు రా నాన్న, అంతా అక్కడ మాట్లాడుకుందాం'' అని చెప్పి వచ్చాము. మా మీద ఉన్న గౌరవంతో ఆ అమ్మాయి మరుసటి రోజు పాఠశాలకి వచ్చింది. ఇన్ని రోజులు రానందుకు పచ్చత్తాప పడుతూనే 'ఆ దెయ్యమంటే నాకు భయం మేడం, అందుకే రాలేదు' అని చెప్పింది. మేము దగ్గరికి తీసుకుని ''అలాంటివేం ఉండవు నాన్న, నువ్వు ఊరికే భయపడుతున్నావు'' అని చెప్పగా ఆ అమ్మాయి మమ్మల్ని వారించి ''నిజంగా అక్కడ ఉంది మేడం, వింత వింత శబ్దాలు చేస్తుంది'' అని చెప్పింది. ''ఈరోజు రాత్రికి నీతోపాటు మేము ఉంటాము, అందరం కలిసి దెయ్యాన్ని చూద్దాము'' అన్నాను. 'అందరికెలా కనిపిస్తుంది' అని అమాయకంగా ప్రశ్నించింది. ''నువ్వేగా ఉందని చెప్పింది, ఉంటే అందరికి కనిపించాలి కదా! అందుకే మేము కూడా చూస్తాం'' అన్నాను. వెంటనే అమ్మాయి ఆలోచనల్లో మునిగిపోయింది. నేను కలుగజేసుకుంటూ ''అదంతా వట్టి భ్రమ, నీ చుట్టూ వారుకూడా నీలాగే భయపడటం వలన నీ భయం రెట్టింపయ్యింది, అంతే'' అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి ''చనిపోయిన తర్వాత దెయ్యాలవుతారంటా కదా మేడం'' అని ప్రశ్నించింది. వెంటనే నేను, అలా అయితే ఊరిలో మనుషులకన్నా దెయ్యాలసంఖ్యనే ఎక్కువుం డాలే అని అనగానే తోటివారంతా అవునని నవ్వారు. వెంటనే ఇంకో ప్రశ్న. ''మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? అని. నేను ''ఏమి అవ్వము, మట్టిలో కలిసిపోతాము అంటూనే, చచ్చిపోవడమంటే శ్వాస ఆగిపోతూ శరీర వ్యవస్థలన్నీ ఒక్కసారిగా పనిచేయడం మానేస్తాయి. అది నేనైనా, నువ్వైనా. మట్టిలో కలిసిపోవడంతోనే మన కథ సమాప్తం అవుతుంది అంతే. అయిపోయిన నోటు పుస్తకాన్ని రాయడానికి ఎలా వీలుండదో మన శరీరం కూడా అంతే. కానీ అయిపోయిన నోటు పుస్తకంలోని అంశాలను మనం ఎలా బేరీజు వేసుకుంటామో విచిత్రంగా మట్టిలో కలిసిన మన శరీరాలు కూడా మనం జీవించిన కాలానికి సంబంధించిన కొన్ని ఆధారాలను భవిష్యత్ తరాల వారికి అందిస్తూ వారు కూడా మరింత శాస్త్రీయంగా జీవించడానికి ఉపయోగపడుతాయి. మన అస్థిపంజరం శాస్త్రవేత్తలకు ఉపయోగం. ఇక భయపడటం దేనికి?'' అన్నాను. వెంటనే ఆ అమ్మాయి ముఖంలో వెలుగు చూశాను.
భయపడటం మాని, ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తూ చక్కగా చదువుతున్న ది. ఈ సంవత్సరం తను 10వ తరగతి'' అని ముగించింది. ఇదంతా విన్నాక నాకు సంతోషం అనిపించింది. ఆ ఉపాధ్యాయులు పట్టించుకోకుంటే అమ్మాయి భవిష్యత్ ఏమయ్యేది? నిజంగా ఇలా ప్రజలను భయపెడుతూ, భ్రమల్లో ఉంచే అంశాలను ఓపికగా విశ్లేషిస్తూ భయాలను పోగొట్టేవారు సమాజంలో పెరగాలి. కాని దురదష్టవశాత్తు మంత్రాలు, మహిమలు మొదలైన అతీంద్రియ శక్తులను ప్రచారం చేసే వారే సమాజంలో ఎక్కువవున్నారు. నేటి సమాజానికి అదే మహా విషాదం అని గుర్తించలేకపోతున్నారు.
ఇక మతప్రచారకుల సంగతి సరేసరి. నిత్యం దెయ్యాలు, భూతాలు, అతీంద్రియశక్తులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పిరికితనం బాగా నూరి పోస్తుంటారు. వీటిని నమ్మినవారు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. కనీస సైన్సు పరిజ్ఞానం ఉన్నవారెవరైనా స్పందించి అవి కల్పితమని, కొంతమంది స్వార్థం కోసమే వాటిని ప్రచారం చేస్తారని చెబితే, వారిని మతంపై దాడిచేసే వారిగా చిత్రీకరిస్తారు. అవసరమైతే విదేశీ సంస్థలకు అమ్ముడుపోయారని ప్రచారం చేస్తూ, వికతానందం పొందుతారు. ఎన్ని లోపాలున్నా మార్చడానికి వీలు లేని, మత అస్తిత్వాలను కాపాడుకోవటమే వారి తాప త్రయం. నిర్ణాయక పాత్రలో ఉండటం మూలాన రాజకీయ నాయకులూ వీరినే సమర్ధిస్తారు. అవి ప్రజలు నమ్మకపోతే తమ రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వారికి బాగా తెలుసు. అందుకే నిజాలు చెప్పేవారిని మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారు. వారెంతకీ లొంగరని తెలిస్తే, నమ్మకాలపై దాడి చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తారు. దీన్ని విన్న చాలామంది కనీస ఆలోచన చేయకుండా తమ అజ్ఞానావేశాల్ని ప్రదర్శిస్తారు. అయినప్పటికీ ప్రజల కోసం ఇవేవి లెక్కచేయక, సమాజాన్ని విజ్ఞాన పథంలో పెట్టడానికి సమాజం కోసం ఆలోచించేవారు ఎప్పుడూ శక్తివంచన లేకుండా జనాలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తుంటారు. మనం చెయ్యాల్సిందల్లా అలాంటి కార్యక్రమా లకు చేయూతనివ్వడమే. మనం తెలుసుకున్న విజ్ఞాన విషయాలను స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు పంచుకోవాలి. తద్వారా అజ్ఞానాన్ని పోగొట్టడానికి కషి చేయాలి. అప్పుడే సమాజంలో అనేక రూపాల్లో ఉన్న భ్రమలు తొలగిపోతాయి. ఆలోచించే సమాజం ఏర్పడుతుంది.
- రవికుమార్ సంగనమోని
సెల్ : 7893903740