Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కారు రాజా కారు... రండి బాబూ...రండి.. అరె బంపర్ ఆఫర్..' అనే పోస్టు సోషల్ మీడియాలో ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. 'లడ్డూ కావాలా నాయనా..?' అనే డైలాగు కాస్త అటూ ఇటూ మార్పుచెంది 'భూమి కావాలా?' నాయనా..!? అని మార్మోగిపోతున్నది. జగన్, బీజేపీ పార్టీ తీరును, కేసీఆర్ వైఖరిని విమర్శిస్తూ పోస్టులు పుంఖానుఫుంఖాలు పుట్టుకొస్తున్నాయి. 'సీఎం కావాలంటే స్వామీజీని కలవండి... కేసుల నుంచి బయట పడాలంటే బీజేపీని కలవండి. రూపాయికే ఎకరం భూమి కావాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవండి'అనే పోస్టు తెగ వైరల్ అవుతున్నది. 'అరె ఏండ్ల తరబడి చదివినా ఉద్యోగ నోటిఫికేషన్ రాకపాయే...సాగు చేసుకుని బతుకుదామంటే భూమి లేదాయే. సర్కారోల్లు ఇస్తమన్న మూడెకరాల భూమి ఇవ్వకపాయే. తూ దీనమ్మ జీవితం. గిట్ట ప్రభుత్వాన్ని కోరితే ఏదీ ఇస్తలేదు. ఇగ స్వాములోరి అవుతారమైనా ఎత్తుతం ర బై. రూపాయకెకరం భూమి వస్తది. రాజలెక్క బతుకొచ్చు' అన్న పోస్టును నిరుద్యోగులు తెగ ప్రచారం చేస్తున్నారు. అరె రూపాయికి ఎకరం భూమినా? రెండు రూపాయల కోసం స్వాములోరు ఎంత కష్టపడాలో ఏమో? బ్యాంకులు గంత పెద్ద లోను ఇస్తయో లేదో? రాష్ట్ర ప్రభుత్వం గింత కఠిన నిర్ణయమా? స్వామిలోరికి ఎంత ఇబ్బంది' అనే వ్యంగ్య పోస్టూ విస్తృతంగా ప్రచారమవుతున్నది. -ఎ.ప్రశాంత్