Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మొన్న వరంగల్.. నిన్న చెన్నై.. రేపు ఎక్క డో..? ప్రతీ రోజూ ఎక్కడో ఓ చిన్నారి లైంగికదాడికి గురవుతున్నారన్న భయం తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. లైంగికదాడులతో పాటు బాలల హక్కు లను కాపాడాల్సిన బాధ్యత కలిగిన 'చైల్డ్ వెల్ఫేర్ కమిటీ' (సీడబ్ల్యూసీ)లు కనీసం తమ ఉనికిని కూడా చాటుకోలే కపోతున్నాయి. కాల పరిమితి ముగిసి రెండేండ్లు గడిచి నా ప్రభుత్వం కొత్త కమిటీలనే ఏర్పాటు చేయలేదు. రోజురోజుకు బాలల హక్కులు మృగ్యమవుతున్నాయి. సమాజంలో పెరుగుతున్న నేరప్రవృత్తికి మొదటగా బలవుతున్నదీ.. బంధీలు గా మారుతున్నది.. బాలలే.. వారి రక్షణ కోసం తెస్తున్న చట్టాలు.. వ్యవస్థలు నిర్లక్ష్యంగా పనిచేస్తుండటం.. అమలు చేయడంలో నిరసక్తత బాల్యంపై రాక్షస క్రీడలకు అవకాశం కల్పిస్తోంది. బాలల సరరక్షణ, మద్దతుగా నిలిచేందుకు సెంట్రల్ యాక్ట్ 56 ద్వారా 2000లో కేంద్రప్రభుత్వం జువైనల్ అండ్ జస్టిస్ (జేజే) యాక్ట్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం నేరాలు చేసిన మైనర్లయిన బాలలను నేరస్తులుగా చూడరాదు.. పిలవకూడదు.. దేశవ్యాప్తంగా సంచల నం సృష్టించిన నిర్భయ ఘటన తర్వాత జేజే యాక్ట్కు మరిన్ని సవరణలు చేప ట్టింది. చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)లను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించింది. సమా జంలోబాలలపైన ఏ రకమైన నిర్బంధం విధించినా.. వారి హక్కులకు భంగం కలిగిందని భావించినా సీడబ్ల్యూసీ అవసరమైన చర్యలు చేపట్టవచ్చు.. బాల్య వివాహాలను అడ్డుకున్న సందర్భాల్లో మైనర్ బాలికల సంరక్షణ చర్యలు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న చిన్నారులను, తల్లిదండ్రులు లేని బాలలను సంరక్షించడం, చట్టం బద్ధం కాని దత్తతలను నిరోధించే అధికారంతో పాటు బాలల సంక్షేమ, పౌష్టికాహార పథకాలను పర్యవేక్షించే అవకాశం ఈ కమిటీలు కలిగి ఉన్నాయి. బాల నేరస్తులను, బాల కార్మికులను నివారించేందుకు విద్య, పౌష్టికాహారం వంటివి అందించేందుకు చర్యలు చేపట్టవలసిన బాధ్యత కూడా ఈ కమిటీలపైన ఉంది. జిల్లాకు ఓ మహిళ సభ్యురాలితో కలిపి ఐదుగురు సభ్యులతో సీడబ్ల్యూసీ పనిచేస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఫిబ్రవరి 12న పాత జిల్లాల పరిధిలో పది కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థలు, విభిన్న రంగాల్లో కనీసం ఏడేండ్లకు తగ్గకుండా బాలల హక్కులపైన పనిచేసిన వారిని ఇందులో సభ్యులుగా నియమిస్తారు. జిల్లా కమిటీలు నెలలో ఇరవై సార్లు సమావేశమవ్వాలి. ఉమ్మడి జిల్లాలో బాలల సమస్యలపైన చర్చిస్తూ వాటిని నివారించేందుకు చేపట్టిన చర్యలపై, భవిష్యత్ కార్యచరణపై సభ్యులు నిర్ణయం తీసుకోవాలి. ఒక్కో జిల్లా కమిటీ పేరు మీద వేతనాల కోసం ప్రభుత్వం నెలకు రూ.లక్షన్నర ఖర్చు చేస్తోంది. బాలల హక్కులను కాపాడటంలో, చిన్నారులపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఈ కమిటీలు కనీస కార్యాచరణను కూడా నిర్వర్తించలేని పరిస్థితుల్లో నిస్తేజంగా మిగిలిపోతున్నాయి.
2016లో హైదరాబాద్లో దత్తత విషయంలో అవగాహన లేకుండా కమిటీ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. తాజాగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్లోని ఓ ప్రముఖ న్యాయవాది చట్ట వ్యతిరేకంగా చేసుకున్న దత్తతపై సీడబ్ల్యూసీ సభ్యులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. జేజే యాక్టు ప్రకారం సంబంధం లేని పిల్లలను మూడు రోజుల వరకు తమ స్వాధీనంలో ఉంటే అది నేరం.. ఈ కేసు మెదక్ సీడబ్ల్యూసీకి చేరి నెల రోజులు దాటినా ఆ బాలికను సభ్యులు తమ సంరక్షణలోకి తీసుకోలేదు. ఇలాంటి చిన్నారులపై లైంగికదాడులు జరగడానికి, బాల కార్మికులుగా మార్చడానికి అవకాశాలెక్కువ. రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్న మైనర్ బాలుడి(16)పై స్వయంగా సీడబ్ల్యూసీ సభ్యుడే లైంగిక వేధింపులకు పాల్పడటంతో గత నెల 28న పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా స్థాయిలో పనిచేయాల్సిన బాలల సంక్షేమ కమిటీలు, బాలల న్యాయబోర్డులు కూడా ఇన్చార్జి బోర్డులతో నెట్టుకొస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల కమిషనర్ నియామకం కూడా ఈ ప్రభుత్వం చేపట్టనేలేదు. రాష్ట్రంలో బాలల హక్కుల రక్షణ కోసం ఇప్పటికైనా ప్రభుత్వం అవసరమైన కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరముంది.
- వంగాల రమేష్
సెల్ : 9490099115