Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్టుబడిదారుడు కేవలం సరుకులు ఉత్పత్తి చేసేవా డుగానే ఉండడు. సరుకులను తయా రు చేయటానికి కష్టపడే శ్రామికుల నూ, ఉత్పత్తి అయిన సరుకులను వినియోగించుకోవాల్సిన (కొనుక్కునే) మనుషులనూ తయారు చేస్తాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.
పెట్టుబడిదారీ వ్యవస్థలో నిరంతరం పునరుత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అంటే సరుకులు తయారయ్యే స్థలంలో ఉత్పత్తి మొదలై, మొదటి దఫా సరుకులు తయారయ్యాక, తిరిగి అదే సరుకులను మళ్లీ ఉత్పత్తి చేయడం మొదలవుతుంది. ఇది రెండోసారికే ఆగిపోదు. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటారు. దీనినే పునరుత్పత్తి అంటారు. ఒకసారి సరుకు ఉత్పత్తి అయిన తర్వాత ముడి సరుకు అయిపోతుంది. కార్మికులకు ఇచ్చిన వేతనాల అస్థిర పెట్టుబడి అయిపోతుంది. వెంటనే పునరుత్పత్తి జరగాలంటే పెట్టుబడి కావాలి. దీనిని ఉత్పత్తి చేసిన సరుకులను అమ్మడం ద్వారా సొమ్ము చేసుకుంటాడు. అంటే సంపాదిస్తాడు. కాబట్టి పునరుత్పత్తికి సరుకులను సొ మ్ము చేసుకోవడం అత్యవసరం. ఈ పునరుత్పత్తి క్రమంలో మూడు దశలుంటాయి. ఒకటి ఉత్పత్తి సాధనాలను, శ్రమశక్తిని కొనటం, రెండు ఉత్పత్తి చేయడం, మూడవది తయారైన వస్తువులను సొమ్ము చేసుకోవటం. ఇవి నిరంతరం సాగుతూనే ఉంటాయి. మొదటి దశలో డబ్బు సరుకుగా మారుతుంది. రెండవ దశలో అదనపు విలువ చేరుతుంది. మూడవ దశలో సరుకు డబ్బుగా మారుతుంది. ఇలా పెట్టుబడి నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది.
అయితే మొదటిసారి ఉత్పత్తి అయిన సరుకు ద్వారా అదనపు విలువ సృష్టించబడినప్పుడు, ఆ సరుకుల అమ్మకం తర్వాత లాభంగా పెట్టుబడిదారునికి వస్తుంది. ఈ వచ్చిన లాభాన్ని తిరిగి పెట్టుబడిలో చేరుస్తాడు. పెట్టుబడిదారుడు వ్యక్తిగతంగానే ఉత్పత్తి రంగంలో ఉన్నప్పటికీ, ఇలాంటి పెట్టు బడిదారులు ఎంతోమంది విస్తృతమైన ఉత్పత్తి చేస్తుంటారు. వీళ్లందరూ ఉత్పత్తి చేస్తున్న సరుకులన్నీ సమాజంలో అమ్ము డవుతూ ఉండాలి. ఆ సరుకులు సొమ్ము చేసుకోబడాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులు సమాజం లో ఉన్నాయా? ఉంటాయా? పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆద్య ంతమూ వక్రములు, మార్పులు ఉంటాయంటాడు మార్క్స్. ఈ సరుకులు సొమ్ము చేసుకోబడటం సవ్యంగా జరుగక అనేక అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని ఉత్పత్తి క్రమంలోని వైరుధ్యమే దానికి కారణం. అదేమంటే ఉత్పత్తి సామాజిక స్వభావం కలిగి ఉంటుంది కానీ దాని ఫలాలు మాత్రం పెట్టుబడిదారు స్వంతానికి పోతుంటాయి. ఈ వైరు ధ్యాన్ని పెట్టుబడిదారీ పునరుత్పత్తి క్రమం బహిరంగపరుస్తుంది.
సహజంగా పెట్టుబడిదారుడు తాను ఉత్పత్తి చేస్తున్న స రుకులను కార్మికులు (ప్రజలు) కొనుగోలు చేయాలని కోరు కుంటాడు. అందుకోసం వాళ్లని ఒక ఉత్తమమైన, వివేకవం తమైన వినియోగదారులుగా ఎదిగేలా చేయడం అవసరమ నుకుంటాడు. పెట్టుబడిదారులు తమ సరుకులను తొంద రగా, ఎక్కువగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. బయట పోటీ ఉంటుంది. దీన్నెలా తట్టుకోవాలి? జనానికి (జనం అంటే అశేష మందిగా ఉన్న కార్మికులే) సరుకులు చౌకగా, నాణ్యంగా అందించాలి. అందుకోసం శ్రమశక్తి ఖరీదును తగ్గిస్తాడు. అన గా వేతనాలు తగ్గిస్తాడు. పని గం టలు పెంచుతాడు. పోటీని ఎదు ర్కొనేందుకు వాళ్లు చేసే పని ఇది. ఇక కార్మికులకు నిత్యావసరమైన సరుకులు కాక అనేక రకాల సరు కులు కుప్పలు తెప్పలుగా ఉత్పత్తి చేస్తారు. ఒక పద్ధతీ క్రమం లేకుం డా ఉత్పత్తి చేస్తారు. పెట్టుబడిదా రుడు నూతన సరుకుల ఉత్పత్తి కోసం చేసే కల్పనల అభివృద్ధిని (కొ త్త రకం సరుకుల సృష్టి) వినియోగి ంచుకునే స్థాయికి కార్మికులు తమ సంస్కృతిని పెంచుకోలేరు. కాబట్టి వినియోగదారీ సంస్కృతిని పెంచడానికి అతను వేయని వేషం ఉండదు. అందుకోసమని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రపంచంలో సరుకుల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. రేడియోలు, టీవీలు, సినిమాలు, పత్రికలు ఇవన్నింటి ద్వారా రోజూ కొన్ని వందల రకాల కొత్త సరుకులను వాడమని ప్రేరేపిస్తుంటా రు. మన భారతరత్న, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ఎనర్జీని ఇచ్చిన 'బూస్ట్'ను తాగాలని ఏ కార్మికుని కొడుకుకైనా ఉంటుంది. మహేష్బాబులా థమ్స్అప్ తాగి, అతనిలా హీరో కావాలని కోరుకోకుండా ఎవరైనా ఉంటారా! లక్స్ వాడటం వల్ల అందంగా తయారైన ఐశ్వర్యరారులా ఉండా లని కార్మికుని కూతురు కోరుకోదా! కానీ విషాదమేమంటే శ్రామికుల ఆదాయాలు రోజురోజుకు పడిపోతుంటాయి. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలోకి నెట్టబడతారు. అయితే వాటిని అందుకోవాలనే ఒత్తిడిలో శ్రామికులు తాము రోజూ చేసే పనికి, కాలానికి మరింత అదనంగా పని చేసి ఆదాయం పెంచుకోవాలనే ప్రయత్నంలో తమ ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు. ఈ వినియోగదారీ సంస్కృతి ప్రభావం మధ్య తరగతిపై మరింత ఎక్కువ ఉంటుంది.
ఇక ఈ పునరుత్పత్తి విషయం చర్చిస్తున్నప్పుడు తప్పక చర్చించవలసిన విషయం ఏమంటే సరుకుల పునరుత్పత్తి క్రమంలో పెట్టుబడిదారుడు ఉత్పత్తి సంబంధాలను కూడా పునరుత్పత్తి చేస్తాడు. అంటే శ్రమశక్తి నిత్యం సరుకుగా ఉండే పరిస్థితినీ, కార్మికులకు ఉత్పత్తి సాధనాలు పరాయిగా ఉండే స్థితిని, ఉత్పత్తి విషయా లను పెట్టుబడిదారుడే నిర్ణయించే పరిస్థితినీ పునరుత్పత్తిలోనూ కొనసాగేలా చేస్తాడు.
కార్మికులు, కా ర్మికులుగానే, పెట్టు బడిదారులు పెట్టుబ డిదారులుగానే వాళ్ల మ ధ్య సంబంధాలు పునరు త్పత్తి అవుతూ ఉండటానికి పెట్టుబడిదారులు ఏర్పాట్లు చేస్తారు. జీతాలు జీతాలుగానే, అదనపు విలువ దానిలానే, వడ్డీ వడ్డీలానే, లాభం లాభంలానే, రాజ్యం దోపిడీ రాజ్యంగానే, కోర్టులూ, న్యాయం, జైళ్లు, చట్టాలు, శిక్షలు అన్నీ వారి దోపిడీ కోసం యథావిధిగా కొనసాగుతుండాలి.
పెట్టుబడి, తన పునరుత్పత్తి కోసం కార్మికున్ని నిత్యం పనిలోకి తీసుకొస్తుంది. కార్మికులు నిత్యం పనిలోకి రావడం కోసం పెట్టుబడి వారిని ఎప్పటికీ బికారులుగా ఉంచుతుం ది. కార్మికుల జీతాలు, వారిని ఎప్పుడూ పేదరికంలోనే తిప్పు తుంటాయి. అందుకే టౌన్సెండ్ అనే మతాధికారి ''ఆకలే శ్రమించడానికి సహజ ప్రేరకశక్తి పేదలు మూర్ఖులుగా ఉండటమే ప్రకృతి సూత్రంగా కనపడుతోంది. ఎందుకంటే పేదలు అలా ఉంటేనే వారిలో కొందరు హీనస్థాయి పనులు చేయడానికి సంఘంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎక్కువ మృదువైన వారు (పెట్టుబడిదారులు) ఈ చాకిరీకి దూరంగా ఉండి, వారు తమకిష్టమైన వ్యాపకాలలో ఉంటే మానవులకు ఆనందం అభివృద్ధి చెందుతుంది'' అని అంటాడు. ఇలాంటి సూక్తులను ఈ వ్యవస్థ ఉన్నతంగా ప్రచారంలో పెడుతుంది.
పెట్టుబడి పునరుత్పత్తి కోసం కార్మికుడు ఎల్లప్పుడూ శ్రమశక్తిని అమ్ముకునే వేతన శ్రామికుడిగానే కొనసాగటం, ఉత్పత్తిలో కావలసిన మేధోశ్రమలు చేసేవా రు, మేధో శ్రామికులు గానే, వీటిని అజమా యిషీ చేసి ఫలితాల ను భోంచేసే యజ మానులు యజ మానులుగానే కొన సాగేట్టు, ఉత్పత్తి సం బంధాలను ఈరకం గానే పునరుత్పత్తి చేస్తుంది ఈ వ్యవస్థ. కార్మికులు కేవలం పెట్టుబడిదారుడికి పని మనుషులుగా ఉంటారు. అతను ఏది చేయమంటే అది చేయాలి. ఉత్పత్తికి సంబంధించిన అన్ని విషయాలలోనూ కార్మికుని యొక్క నిర్ణయాధికారం ఏమీ ఉండదు. అంటే ఎలాంటి సరుకులు ఉత్పత్తి చేయాలి? అవి ఏ విధంగా ఉండాలి? ఇవన్నీ పెట్టుబడిదారుడే నిర్ణయిస్తాడు. అందరు పెట్టుబడిదా రుల దగ్గరా ఇలాగే జరుగుతుంది. మొత్తం సమాజంలో ఉత్పత్తి అంతా ఇలాగే ఉంటుంది. అంటే సమాజంలో ఎలాంటి ఉత్పత్తులుండాలీ, ప్రజలు వేటిని వినియోగించాలీ, సమాజం ఏ పద్ధతులలో నడుచుకోవాలీ మొదలైన విష యాలన్నీ నిర్ణయించేది పెట్టుబడిదారీ వర్గమే. పై విషయాల నిర్ణయంలో అశేష ప్రజానీకంగా ఉన్న కార్మికవర్గానికి ఎలాంటి హక్కు, అవకాశాలు లేవని అర్థం.
ఈ వ్యవస్థలో ఉన్నతమైన మేధో శ్రమ చేసే వారు కూ డా అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ఉపాధ్యాయులు మొదలైనవారు కూడా పెట్టుబడిదారుని నిర్ణయాలను అమ లుపరిచే వారిగానే ఉంటాడు. పెట్టుబడిదారులు తయారు చేసే ఆహార పదార్థాలే అందరూ తినాలి. అతను తయారు చేసే బట్టలే కట్టుకోవాలి. వాళ్లు తయారుచేసే పత్రికలే చద వాలి. వారు తీసే సినిమాలే చూడాలి. వారి ఛానళ్లనే చూడా లి. పెట్టుబడిదారుడే, కార్మికవర్గం ఎలాంటి ఉత్పత్తులు వా డాలో, ఎలాంటి సంస్కృతిని అలవర్చుకోవాలో నిర్ణయిస్తాడు.
పెట్టుబడిదారునికి ఏ రకమైన విద్యావిధానం ప్రయోజ నకరంగా ఉంటుందో ఆ రకమైన చదువులే మనం చదువు కోవాలి. భాషా, సాహిత్యాలు, సంస్కృతి, చరిత్ర అధ్యయనం, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన మొదలైన కోర్సులకు బదులు ఎంబీఏ, ఎంసీఏలు, బిజినెస్ మేనేజ్మెంట్లు, మార్కె టింగ్ మాస్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ప్రొడక్ట్ రిప్రజెంటేటీవ్స్, ప్రొడక్ట్ సెల్లర్స్, అడ్వర్టయిజ్మెంట్ కోర్సులు, యాడ్ క్రియేట ర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్, చార్టర్ ఎకౌం ట్స్ మొదలైన వ్యాపార సంబంధ విద్యనే కొనసాగుతున్నది. ఇవన్నీ పెట్టుబడిదారునికి ఉపయోగార్థమే. ఇందులో ఒక్కటి కూడా సామాన్యుల జీవితాలను బాగు చేసేది, రైతును ఆదుకునేది లేదు. ఆఖరికి రాజకీయాలను, నాయకులను, ఎన్నికలను తను ఎలా ప్రమోట్ చేస్తా డో అదే అనుసరించే స్థితికి ప్రజలను నెట్టేస్తాడు. దీని సారమేమంటే, పెట్టుబడిదారీ వర్గమే, తమ జీవిత విధానాన్ని తాము నిర్ణయించుకుంటూ కార్మికుల జీవిత విధానాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఈ వ్యవస్థలో వైరుధ్యం వల్ల శ్రామికులు నూతన ఉత్పత్తి సంబంధాలను ఏర్పర్చుకుం టారనేది చరిత్ర చెప్పిన సత్యం.
- ఆనందాచారి