Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షల్ మీడియాను ఎవరు ఎలా వాడుకుంటున్నారో తెలీదు కానీ...తాగుబోతులు మాత్రం పిచ్చపిచ్చగా కసి తీర్చేసుకుంటున్నారు. డ్రంకన్డ్రైవ్లో పట్టుబడిన తాగుబోతుల చేష్టలు సిల్లీగా ఉన్నా...వాళ్లడిగే ప్రశ్నలు మాత్రం సోంచాయింపచేస్తున్నరు. ఇన్నాళ్లు తాగుబోతులకు డిమాండ్లు ఉన్నా... సంఘాలు లేవు. సర్కారోళ్ళకు పైసలు కావల్సొచ్చినప్పుడల్లా మందు రేట్లు పెంచేస్తున్నా... తలొంచుకుని తాగేయడం తప్ప..ఓ ధర్నా లేదు... డిమాండ్ లేదు... అరెస్టులు లేవు. వాళ్ల గోసను ఏ మీడియా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్డ్రైవ్లో పట్టుబడితే పోలీసుల్ని బండబూతులు తిడుతూ సెల్ఫోన్లలో వీడియోలు రికార్డు చేసుకుంటున్నారు. మధ్యమధ్యలో చట్టాలనూ, సెక్షన్లనూ ప్రస్తావిస్తున్నారు. 'మందు అమ్మితే తప్పులేదు కానీ... దాన్ని తాగితే తప్పయిందా' అని నిలదీస్తున్నారు. 'మేం మా కష్టంతో మందేస్తున్నాం... మీలెక్క లంచాలు తిని తాగట్లే' అని పోలీసుల్ని రఫ్ ఆడేస్తున్నారు. పనిలో పనిగా వాట్సప్లో తాగుబోతుల గ్రూపులు ఏర్పాటు చేసుకొని... వాళ్ల డిమాండ్లనూ షేర్ చేసుకుంటున్నారు. 'వైన్స్లో మందు అమ్మేది సర్కారే... ఆ పక్కనే పర్మిట్ రూమ్ పెట్టేదీ సర్కారే... ఆడ తాగి రోడ్డు మీదికొస్తే..అట్టెట్టా అరెస్టు చేస్తారు' అంటూ పోలీసుల ముందు చిందులేస్తున్నారు. ముందు వైన్స్ బంద్ చేపీండ్రి అని డిమాండ్ చేస్తున్నారు. ఆ తిట్లు భరించలేక... వాళ్ల 'లా' పాయింట్లకు జవాబుల్లేక, సర్కారుకు ఆదాయాన్ని పెంచలేక, నవ్వలేక... ఏడ్వలేక ఖాకీలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు... డ్యూటీలు ముగియగానే వాళ్ళలో ఎక్కువమంది అవే పర్మిట్ రూముల్లో కనిపిస్తుండటం మరీ కొసమెరుపు!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి