Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధి పేర జరిగే విధ్వంసానికి మానవత్వం కూడా ఉండదు. దాదాపు 70ఏండ్ల నుండి వివిధ ప్రాజెక్టుల కింద ఇప్పటికే 2.5 కోట్ల ఆదివాసులు నిర్వాసితులైనట్టు చరిత్ర చెబుతోంది. ఆదివాసీల అస్థిత్వాన్ని అంతం చేసేందుకు వారి సహజ వనరులను దోచుకునేందుకు చరిత్రలో చాలా కుట్రలు జరిగాయి. 1850 నుండి 1947 వరకు ఆదివాసీ ప్రాంతాల్లో సహజ వనరులు దోపిడీకి, బ్రిటీష్ వలసవాద ప్రభుత్వం అనేక చట్టాలతో ఆదివాసీల జీవన విధ్వంసానికి పాల్పడింది. జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీలు 72 ప్రధాన తిరుగుబాట్లు చేశారు. చరిత్రకెక్కిన తొలి ఆదివాసీ స్వతంత్ర ఉద్యమం ఉత్తర ఒరిస్సా, దక్షిణ జార్ఖాండ్ ప్రాంతాల్లో జరిగిన గోండు ఉద్యమం. 1769 నుండి 1857 తొలి స్వాతంత్య్ర ఉద్యమం కంటే ముందే 1855లోనే సంతల్ ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1938 నుండి 1941 సంవత్సరంలో తె లంగాణలో కొమరంభీం, గోండు ఉద్యమాలు బ్రిటీష్ వారి ఆర్థిక దోపిడీకి, విధ్వంసపు అభివృద్ధికి వ్యతిరేకంగా జరిగాయి. ఇలా వారి హక్కుల కోసం దాదాపు 250ఏండ్లుగా పెట్టుబడిదారీ, వల స, సామ్రాజ్యవాద దోపిడీపై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. స్వంతంత్య్రం వచ్చింది, వలస పాల న పోయింది. కాని ఆదివాసీలు నిరాశ్రాయులవడం మాత్రం మరింత పెరిగింది. సహజ వనరు లను బహుళజాతి కంపెనీలకు అప్పగించడానికి ''అభివృద్ధి నమూనా'' అనే పేరు పెడితే.. ఆ పె ట్టుబడిదారుల అభివృద్ధికి 1947 నుండి 2014 వరకు వివిధ ఆధునిక ప్రాజెక్టులు, డ్యాంలు, కా రిడార్లు, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 6 కోట్ల మంది నిర్వాసితులైతే వారిలో 2.5 కోట్ల మంది ఆదివాసీలే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఖమ్మం, వరంగల్, ఆ దిలాబాద్, శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పూ గోదావరి, పశ్చిమ గోదావరి, నల్ల మల అటవీ ప్రాంతంలో ఉన్న దాదాపు కోటి మందికిపైగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాల ప్రజలు ఈ అటవీ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారికి కూడా క్రమానుగుణంగా అస్థిత్వ ముప్పు ఏర్పడబోతుంది. భారత అణు ఇంధన శాఖ 2008 నుండి నల్లమల అటవీ ప్రాంతంలోని నిధినిక్షేపాలపై తన అన్వేషణ మొదలు పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి హ యాంలో దక్షిణాఫ్రికా దేశానికి చెందిన బహుళజాతి సంస్థ అయిన డీబీర్స్ ద్వారా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో గల 5 జిల్లాల సరిహద్దులను కలుపుకొని ఉన్న నల్లమల ప్రాంతంలో హెలిక్యాప్టర్కు పెద్ద రింగు లాంటి రాగి చక్రాన్ని తగిలించుకొని నల్లమల అడవిని మొత్తం అణువణువు జల్లెడ పట్టి ఇక్కడ యురేనియం, అభ్రకం, బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించిన కేంద్ర ప్రభు త్వ అధికారులు కార్తికేయ, శ్రీవాస్తవ్ బృందం అమ్రాబాద్ మండల పరిధిలోని తిర్మలాపూర్ (బికె) గ్రామంలో రైతులకు సాగునీరు అందించడం కోసం ఉచితంగా బోర్లు వేస్తున్నామని నమ్మించి దాదాపు 21 బోరు బావులను 1000 ఫీట్ల లోతు మేరకు వేసి ప్రతి 15 ఫీట్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న నల్లమలలోని వివిధ ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలంతా కలిసి 2012లో బోరు బండ్లను ధ్వంసం చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు పదర గ్రామానికి (ప్రస్తుత నూతన మండల కేం ద్రం) ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో అణు ఇంధన శాఖ అధికారులు వారికి రక్షణగా పోలీసు ల బందోబస్తుతో వస్తున్నారని తెలిసిన ప్రజా సంఘాల నాయకులు ప్రజలను చైతన్యపరిచి ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిని నల్లమల పొలిమే ర దాటేదాక తరిమికొట్టారు. ఇక్కడి ప్రజల ప్రతిఘటనను తెలుసుకున్న డీబీర్స్ కంపెనీ లీజును 2013లో రద్దు చేసుకున్నది. అనాదిగా ఉద్యమాలతో అలిసిపోయిన నల్లమల ప్రజలకు తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తో ఇక ఏ కష్టాలూ దరిచేరవని అనుకున్నారు. కానీ నల్లమల ప్రజలను, తెలంగాణ ఊటీగా తీర్చి దిద్ది అభివృద్ధి చేస్తామన్న పాలకుల అంతర్ మర్మం ఇక్కడి ప్రజలకు తెలియరాలేదు. వారి మాట ల్లోని మర్మం నల్లమలను ఊటీ కాదు లూటీ చేయడమేనని ఇప్పుడు బోధపడుతున్నది. వణ్యప్రాణి సంరక్షణ బోర్డు నల్లమల ప్రాంతంలోని 83 చ.కి.మీ. మేర యురే నియం తవ్వకాల కోసం సర్వే చేయడానికి అనుమతులు ఇస్తున్నట్టు 10 నవంబర్ 2016 నాడు ప్రధాన పత్రికలలో కథనం వెలువడింది. వణ్యప్రాణి సంరక్షణ బోర్డు మెంబర్లుగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల రాజు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లమల ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే అనుమతులపై సంతకాలు చేశారు. ఇలా అలజ డికి గురిచేసే వార్త వెలువ డటంతో అక్కడి ప్రజలు ప్రజా ఉద్యమాలతో రోడ్లపైకి వచ్చి పోరాటా లు చేశారు. ఇక లాభం లేదనే ఉద్దేశంతో రాజకీయంగా ఓట్లు దండుకోవడంలో ఇబ్బంది కలుగు తుందని అప్పటి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నతో ఇది కేవలం తాత్కాలిక సర్వేనని ప్రకటన ఇప్పించారు. 2019 ఎన్నికల్లో తిరిగి దేశంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. ఏదో చేస్తారనుకున్న ఇద్దరూ మేకవన్నె పులులై నల్లమలను తవ్వి పొక్కిలి చేయడానికి పూనుకు న్నారు. ఈ దేశ అభివృద్ధి, ప్రయోజనాల కోసం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇస్తున్నామని 2019 మే 22న పర్యావరణ, అటవీశాఖ బోర్డులు సంయుక్త ంగా నిర్ణయం తీసుకున్నాయి. నల్లమల అభయారణ్యంలోని 83 చ.కి.మీ. మేర దాదాపు 4000 బోర్లు (ఒక్కొక్కటి 7 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల లోతు) వేసి 20 వేల టన్నుల యురేనియం నిక్షే పాలతోపాటు ఖనిజసంపదను వెలికితీయడానికి యూసీఐఎల్, ఏఎండీ, పాలకులు కుట్ర పన్నారు.ఎంతో ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలు చేపడితే అది వెదజల్లే విషపూరితమైన రేడియేషన్ గాలి వలన అనర్ధాలు జరిగి సర్వం నాశనం అవుతుంది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి, అణుబాంబులు తయారు చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధ్వంసపు రేడియేషన్ విడు దలైతే దాని చుట్టూ దాదాపు 100 కి.మీ. మేర వాతావరణం పూర్తిగా కలుషితమై ప్రజలు, జం తువులు, పక్షులు అనేక రకాల రోగాల బారిన పడతారు. ఈ యురేనియం వెలికితీసిన జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ, మణిపూర్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి ప్రాంతాలలో విష పూరితమైన రేడియేషన్ కారణంగా చర్మవ్యాధులు, రకరకాల క్యాన్సర్, మగవారికి నపుంసకత్వం, ఆడవారికి గర్భశ్రావం, పుట్టబోయే పిల్లలకు వికృత ఆకారాలు, వికలత్వాలతో పుట్టడం వంటి సంఘటనలు మనకండ్ల ముందటి సత్యాలు. నల్లమల అటవీ ప్రాంతం 5వ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు కట్టాలన్నా అనాదిగా జీవించే ఆదివాసీల అనుమతి తప్పనిసరి. అలా కాకుండా వారి అనుమతి లేకుండా యురేనియం కోసం అన్వేషణ, తవ్వకాలు భారత రాజ్యాంగ ధిక్కారానికి సూచన. ఈ దేశ రాజ్యాంగం ఆదివాసులకు ఎన్నో విధాలైన హక్కు లను, రక్షణలను కల్పించింది. ఐక్యరాజ్య సమితి ఆదివాసుల హక్కుల ప్రకటనలో పేర్కొన్న స్వీ య నిర్ణయాధికారంలో భాగంగా వారి వ్యవహార విషయాల్లో స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన హక్కు ఉంది. ఆదివాసీ హక్కులకు భంగం కలిగించే విధానాలు తీసుకొచ్చేముందు ప్రభు త్వం ఆదివాసులతో సం ప్రదింపులు జరిపి వారి అభిప్రాయం తీసుకోవాలి. ఆర్టికల్ 19లో ఇటు వంటి అంశాలకు లోబడి ఉంటానని భారత ప్రభుత్వం ప్రకటించింది. భూముల పరాయీకర ణను నిరోధించేం దుకు 1/70 చట్టం, అటవీ సంరక్షణ చట్టం (1980), పర్యావరణ చట్టం (1986), షెడ్యూట్ ప్రాంతాల పంచాయతీ రాజ్ చట్టం (పెసా 1996), అటవీ హక్కుల గుర్తింపు చట్టం (2006) వంటి పలు చట్టాలను రూపొందించింది. వీటి ద్వారా గ్రామసభలకు అత్యున్నత అధికారాలు కల్పించారు. మరి మన ప్రభుత్వాలూ ఏ గ్రామసభ అనుమతులతో, ఏ ఆదివాసీ ప్ర జల తీర్మానా లతో మైనింగ్ చేసేందుకు ఉపక్రమిస్తున్నట్టు? ఈ దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పు డు ఈ దేశ జనాభా 41 కో ట్లు. నేడు 130 కోట్లు దాటింది. దేశంలోని ప్రతి జాతి తన సంతతిని పెంచుకొని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే, ఆదివాసీ చెంచులు మాత్రం అంతరిం చిపోయే జా తులలో ముందు వరుసలో ఉన్నారు. అది కేవలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక అరుదైన జాతి. ఇప్పుడు వారి జనాభా 11 వేలకు పడిపోయింది. జీవనంలో, ప్రకృతి ఎదుగు దలలో, పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్యంలో ఎంతో మానవీయత చాటిన మనుషులు వాళ్లు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవే వారి జీవనాధారంగా చేసుకొని ప్రకృతితో సహజీవనం చేస్తూ బతికే యుద్ధవీరులు వాళ్లు. వారు ఉంటేనే నల్లమల ప్రకృతికి, అడవికి అందం. అందుకనే యురేనియం మా కడుపులు నింపదు, అడవి తల్లే మాకు అన్ని విధాల ఆదుకుంటున్నదని ఆది వాసీలు గళమెత్తుతుండ్రు.
- గంటల మోహన్