Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్రలో మానవులు ఉత్పత్తి శక్తులుగా, ఆర్థిక కార్యకలాపాలలో వారివారి స్థానాలు, పాత్రలు అలా కొనసాగడానికి ఎన్నో వ్యవస్థీకృత సంస్థలు పని చేస్తూ ఉన్నాయి. ఆర్థిక పునాదులపై, వర్గ వైరుధ్యాలతో పరిణామం చెందుతున్న వ్యవస్థలు చరిత్ర గమనంలో ఎలా మారుతూ వచ్చాయో మనకు తెలుసు. ఆదిమ సమాజ పతనంతో ప్రారంభమైన ఒక మనిషిని మరో మనిషి దోచుకునే అమానుష సామాజిక వ్యవస్థ నేటికీ కొనసాగుతున్నది. నాగరితగా చెప్పుకునే వర్గ సమాజం, దాని పునాదైన ఉత్పత్తి సాధనాల వ్యక్తిగత యాజమాన్యం భిన్న చారిత్రక దశలలో భిన్న చారిత్రక రూపాలు ధరించాయి. అది బానిస సమాజం, భూస్వామిక సమా జం, పెట్టుబడిదారీ సమాజం ఏ రూపమైనా సారం శ్రా మికుని శ్రమ శక్తిని, శ్రమ ఉత్పాదితాన్ని దోచుకోడమే. ఈ వ్యవస్థలు ఇలా కొనసాగడానికి కొన్ని వ్యవస్తీకృత సం స్థలు దోపిడీకి వెన్నుదన్నుగా ఉంటూ తోడ్పడుతున్నాయి. అవి రాజ్యం, మతం, నీతి, న్యాయం, చట్టాలు, విద్య శిక్ష ణలు. మనదేశంలో అయితే కుల వ్యవస్థ కూడా దోపిడీ వర్గాలకు ఊడిగం చేస్తున్నది. సాంస్కృతిక సంప్రదాయ మూ అసమానతలకు నైతికతను జత చేస్తున్నది. అనేక సందర్భాల్లో ప్రస్థావించుకుంటున్నప్పటికీ ఈ సంస్థలను గూర్చి ప్రత్యేకంగా కొంత ఇప్పుడు చర్చిద్దాం.
వర్గ సమాజపు మొట్టమొదటి రూపం బానిస స మాజం. బానిస ఉత్పత్తి సంబంధాలలో బానిసలకు ఎ లాంటి ఉత్పత్తి సాధనాలూ ఉండవు. ఎలాంటి మానవ హక్కులూ ఉండవు. బానిసలను అమ్మడానికి, కొట్టడాని కి, చంపడానికి సకల హక్కులూ యజమానులకు ఉం టాయి. ఇలాంటి అమానుషమైన మానవ సంబంధాల ను ఆదిమ సమాజం ఎరుగదు. అత్యంత అధమ ప్రవృ త్తులు- నీచమైన దురాశ, పాశవిక భోగ లాలసత్వం, సంపద పట్ల లోభత్వంలో కూడిన వ్యామోహం, సమిష్టి ఆస్తులను స్వార్థంతో దోచుకోవడం నూతన నాగరిక వర్గ సమాజానికి శ్రీకారం చుట్టాయి. హింస, దొంగతనం, మోసం, వంచన మొదలైన లక్షణాలు సంతరించు కున్నా యి. ఇలాంటి అమానుష వ్యవస్థను అమలులోకి తేవడా నికి, నిలిపి ఉంచడానికి బలప్రయోగం అవసరం. బాని సలను అణచి ఉంచడం కోసం ఒక యంత్రాంగం అవస రమైంది. ఆ విధంగానే రాజ్యం పుట్టింది. రాజ్యం ఆవశ్య కతల పునాది అది. భిన్న సామాజిక దశలలో దాని రూ పం ఏదైనప్పటికీ వర్గ పీడనా సాధనంగానే అది ఎప్పు డూ ఉన్నది. అణచివేత సాధనంగానే కొనసాగింది. బాని స సమాజంలో రాజ్యం నిరంకుశత్వం, ప్రభు వర్గ నియ తృత్వం, ప్రజాస్వామ్యం వంటి రూపాలేవైనా అది బానిస యజమానుల పాలన సుస్థిరం చేయడం అనే కర్తవ్యాన్నే నిర్వహించింది. ఇప్పటి పెట్టుబడిదారీ వ్యవస్థలోని బూ ర్జువా ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిర్వర్తించే పాత్ర కూడా అదే. సాధారణంగా రాజ్యం అనేది ప్రజలందరి కోసం, వారి సంక్షేమం కోసం పని చేస్తున్న వ్యవస్థగా మనల్ని భ్రవింపజేస్తుంది. కానీ అది అంతిమంగా ఉత్పత్తి సాధ నాల యజమానుల పక్షాన్నే పని చేస్తుంది. మనిషి పుట్ట గానే, ఏ సమాజంలోనైనా ఒక ఆవరణం ఉంటుంది. అది కుటుంబం, రాజ్యం, మతం, విద్య ఇవే మనిషి మనస్తత్వాన్ని, ఒక రకమైన ప్రవర్తనను, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే వ్యవస్థగా క్రియాశీల పాత్రను నిర్వహిస్తుంది. రాజ్యం, చట్టాలు న్యాయం, మతం సంప్రదాయాలు, విద్యా శిక్షణ అన్నీ దోపిడీ వర్గాల నీతిని సమర్థించే సంస్కృతిని పెంపొందిస్తుంది. రాజ్యాంగ యంత్రం, చట్టాలు, న్యాయాలు, పోలీసులు, సైనికు లు ధనిక వర్గాలకు ఏ విధంగా పని చేస్తాయో వేరే చెప్పనక్కర లేదు. దేశంలోని పెట్టుబడిదా రులకు అనుకూలమైన శాస నాలు రూపొందించబడతాయి. మనం చూస్తూనే ఉన్నాం. ప్రజ ల అందరి సొమ్ముతో నిర్మించ బడిన ప్రభుత్వరంగ సంస్థలను అన్నింటినీ ప్రయివేటుపరం చేయడానికి చట్టాలు చేశారు. మన ఆర్థిక మంత్రి స్వయంగా ఈ దేశ సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులని సెలవిచ్చిం ది. ఈ సంపద సృష్టికర్తలకు ఎలాంటి కష్టం రానివ్వనని హామీనిచ్చింది. ఎంత దారుణం! ఎంత అబద్ధం! నిత్యం తమ రెక్కలు ముక్కలు చేసుకుంటూ శ్రమ చేసే శ్రామికులు కదా సంపద సృష్టిక ర్తలు. ఆ రకమైన చైతన్యాన్నీ, జ్ఞానాన్నీ ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ తన సంస్థల ద్వారా అందిస్తుంది. అదే ప్రతిబిం బిస్తున్నది. మంత్రి గారి మాటల్లో లక్ష రూపాయల సామాన్యమైన అప్పుకు సవాలక్ష ష్యూరిటీలు అడిగే బ్యాంకులు వేల కోట్ల రూపాయలు ఏ విధమైన హామీ లేకుండానే ఇచ్చాయి. అవి ఎగ్గొట్టి విదేశాలకు పోవటానికీ అనుమతినిచ్చాయి. మోసాలు, పెద్ద ఎత్తున దోపిడీ చేసే వారికి పహారా కాస్తుంది చట్టం. కనీస కూలీ, రాజ్యాంగ హక్కులు కల్పించాలని పోరాడే వారిని నిర్బంధిస్తుంది. ఇదీ రాజ్యపు లక్షణం.
ఇక మతం. వర్గ రహిత సమాజం నుండి వర్గ సమాజానికి జరిగిన పరివర్తనలో మతం చాలా కీలక పాత్ర పోషించింది. ఆదిమ సమాజంలోని తంత్ర విద్య ప్రకృతి శక్తుల పట్ల అజ్ఞానం నుండి ప్రకృతి శక్తులను వశపరచుకుని శాసించాలన్న కాక్ష నుండి ఉద్భవించినది. కాగా మతం ప్రకృతి శక్తులనే కాదు.. మనిషి స్వయంగా సృష్టించిన ఉత్పత్తిని, సంపదను, సమాజాన్ని మొత్తంగా మానవ జీవితాన్నే మనిషికి అతీతమైనదిగా చేసేస్తుంది. అది చెప్పే దైవికశక్తే అన్నింటినీ శాసించేదని, మనిషి ని మిత్తమాత్రుడని విశ్వసింపజేస్తుంది. అలా అది వర్గ దోపిడీ పీడనలను దైవ నిర్ణయంగా చలామణి చేస్తుంది. వాటికి పీడిత ప్రజల ఆమోదాన్ని సంపాదించుకోవడా నికి కృషి చేస్తుంది. మనిషి మతాన్ని సృష్టిస్తాడు తప్ప మతం మనిషిని సృష్టించదు. మనిషి తనను తాను పోగొ ట్టుకున్నప్పుడు అతనిలో కలిగే స్వీయ స్పృహ, స్వీయ గౌరవమే మతం. మనిషి అంటే మానవ ప్రపంచం, రాజ్యం, సమాజం. ఈ రాజ్యం, సమాజం సృష్టించే మతం బంధీకృత చైతన్యం అసత్యాన్ని సత్యంగా చూపించే అద్భుత కల్పన మతం. కనుక మతంపై పోరాటం అంటే వాస్తవం లో ఏ ప్రపంచం ఆ ఆధ్యాత్మిక దుర్గంధాన్ని అవశ్యకమైందిగా ఆమోది స్తున్నదో ఆ ప్రపంచంపై చేసే పరోక్ష పోరాటమే. అణిగి పడి ఉన్న జీవుల నిట్టూర్పులే మతం. హృదయంలేని ప్రపంచం లో హృదయమే మతం. ఆత్మలేని పరిస్థితుల లో ఆత్మ మతం ప్రజలకు మత్తుమందులా పనిచేస్తుంది. ప్రజలకు నిజమైన సుఖాన్ని అందివ్వాలంటే కల్పితమైన సుఖాన్నిచ్చే మతాన్ని రద్దు చేయాలంటాడు మార్క్స్.
మతం దేవుడు, స్వర్గం, నరకం మొదలైన విషయాల చుట్టూ మను షుల్ని తిప్పుతుంది. మను షుల వాస్తవిక దు:ఖానికి, కష్టాలకు, బాధలకు దేవుడు కారణంగా అతని ఆజ్ఞ కారణంగా చూపెడు తుంది. పూర్వజన్మ కర్మ ఫలితమని, కష్టాలను దేవుడే తీర్చాలని మభ్యపె డుతుంది. దీనివ ల్ల అసలు దు:ఖ కారకు లు, దోపిడీదారులు బతికిపో తారు. బాధితుల దు:ఖితు ల విముక్తి దేవుడి చేతిలోనే ఉంటుందని మతం బోధిస్తుంది. కానీ అసలు విముక్తి వారి చేతిలోనే సాధ్యమని మార్క్సిజం ఎరుకపరుస్తుంది.
మనషులు తమ ఊహల్లో సృష్టించుకున్న కొన్ని భావనల నుండి దేవుండ్లు మానవాతీతమైన సర్వశక్తి మంతమైన వారిగా కనిపిస్తారు. వాళ్లు తమలో తాము సంబంధాలు పెట్టుకుంటారు. మనుషులలోనూ సంబం ధాలు పెట్టుకుంటారు. మనుషులు సృష్టిస్తున్న సరుకు లూ ఇలాంటివే. సృష్టించబడిన వెంటనే సరుకులు కొన్ని అతీంద్రీయ శక్తులు సంతరించుకుం టాయి. వీటి పట్ల ఆరాధనాభావం పెరుగుతుంది. దీన్నే మార్క్స్ ఫెటిషిజం అన్నారు. మతానికి సంబంధించి మానవాతీత శక్తులున్న వస్తువులకు (విగ్రహాలు వగైరా) ఫెటిష్ అంటారు. మన ఆవిష్కరణలు, అభివృద్ధి అంతా జడ వస్తువులకు మేధో శక్తులు ఉన్నట్టు భ్రమింపజేస్తున్నాయి. ఫలితంగా మనిషి జీవితం జడ పదార్థంగా మారిపోతున్నది. శ్రమవల్ల తయారైన సరుకుకు మాంత్రిక దైవిక శక్తులు సంతరి స్తాయి. అంటే మృత శ్రమ, సజీవ శ్రమపై ఆధిపత్యం చెలాయిస్తుంది. అంటే కార్మికుణ్ణి తనకు దాసున్ని చేసుకుంటుంది. అలాగే మానవుడు సృష్టించిన దేవుడికి, మతానికి మానవుడే దాసుడవుతాడు. ఇదీ మతం ద్వారా మనిషిని పరాధీనున్ని చేయడమంటే. భారతదేశంలో నెలకొని ఉన్న కుల వ్యవస్థ ఇక్కడి శ్రామికులను శ్రమల ఆధారంగా విభజించడమేగాక నీచ, హీనమైన వారిగా విభజన చేసింది. ఒక కులంలో పుట్టినవాడు అదే పనికి కట్టుబడి జీవితం కొనసాగించాలి. దుర్భరమైన దోపిడీకి కులపరంగా కూడా గురికావడం, అణచివేతకు ఒక సాధనంగా కులం ఉపయోగపడటాన్ని మనం చూస్తున్నాం. దోపిడీదారులకు అదనంగా సమకూరిన చట్రమిది. దోపిడీ వ్యవస్థ మరింత పకడ్బంధీగా కొనసాగించేందుకు ఈ కుల వ్యవస్థ ఉపయోగపడింది.
ఇక విద్యాశిక్షణలు.. ఏ వ్యవస్థలో మనం జీవిస్తున్నామో ఆ వ్యవస్థ కొనసాగటానికి అవసరమైన విద్యనే అందిస్తాయి. విద్యలో అన్నీ పెట్టుబడిదారీ వ్యవ స్థకు అవసరమైన అంశాలే పొందుపర్చబడి ఉంటాయి. అసలు శిక్షణా క్రమమే ఆధిపత్య ఆధీన పద్ధతిలో కొనసాగుతుంది. ఉపాధ్యాయుడు ఆధిపత్యం కలిగి వి ద్యార్థి అతని ఆజ్ఞలను శిరసావహించడం కనపడుతు ంది. ఈ విద్య కూడా అమ్మడం, కొనడంపై ఆధారప డుతుంది. కొనుక్కోగలిగిన విద్య తిరిగి అమ్మబడుతుంది. పెట్టుబడి నీతికి కట్టుబడే విద్యా వ్యవస్థ సమాజాన్ని నిర్మిస్తుంది. ఇక నీతి నైతికతలు, కట్టుబాట్లు సంప్రదా యాలు, సాహిత్యం, కళలు ఈ దోపిడీ వ్యవస్థ నిరాటం కంగా కొనసాగటానికి ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇవన్నీ ఒక రక్షణ కవచంగా వ్యవస్థకు పని చేస్తాయి. రాజులను దైవాంశ సంబూతులుగా కొలిచారు. దేవుని చేత రాజంటే దేవుడే అనే భావన కలిపించిన వ్యవస్థ రాజును యోధుడుగా చిత్రించింది. ఆ తర్వాత ప్రజల సేవకుడు నాయకుడని ప్రజాస్వామ్య వ్యవస్థలో నూతన భావనను తీసుకు వచ్చింది. ధర్మాలు బోధించిన వ్యవస్థే తనకు మాలిన ధర్మం లేదని బోధించింది. మంచితనా నికి చెడుతనానికి, నీతి అవినీతికి ఉన్న అర్థాలు రోజురోజుకూ మారుతున్నాయి. పని చేసేవాడు, కష్టపడి బతికే వాడు హీనంగా చూడబడుతున్నాడు. హాయిగా దర్జాగా ఏ పనీ చేయకుండా బతికేవాడు కీర్తించబడు తున్నాడు. ఒకప్పుడు నిరాడంబరంగా జీవించిన వాళ్లను గొప్ప వాళ్లుగా కీర్తించే సమాజం ఇప్పుడు ఎంత ఎక్కువ ఆడంబరంగా బతికితే అంతగొప్ప వాళ్లుగా చూస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ తన సరుకులను వినియోగిం చుకునే వారినే ఘనులుగా చాటుతుంది.
మారుతున్న ఉత్పత్తి విధానాన్ని బట్టి సమాజంలో సంస్థల స్వభావాలూ మారతాయి. ''మానవ భావాల చరిత్ర రుజువు చేస్తున్నదేమిటి? భౌతిక వస్తూత్పత్తి ఏ మేరకు మారుతుందో ఆ మేరకు భౌదిక ఉత్పత్తుల స్వభా వంలో కూడా మార్పు వస్తుందని. ప్రతి యుగంలోనూ ప్రజలను పాలించే భావాలు ఆనాటి పాలకవర్గ భావాలే'' అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ చెప్పినట్టుగా పాలక వర్గం ఈ సమస్థ సామాజిక సంస్థల ద్వారా దోపిడీని భావజాల రంగంలో బలపరిచే ప్రయత్నం చేస్తుందని మనం గ్రహించాలి. ఇందుకు భిన్నమైన ఆలోచనలను చైతన్యయుతంగా అలవర్చుకోవలసి ఉంది.
- ఆనందాచారి
సెల్ : 9948787660