Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనివర్సిటీలు సాధరణంగా దేశ, రాష్ట్ర , ప్రపంచ, రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై పరిశీలన, పరిశోధన చేస్తాయి. అవి జాతీయ, అంతర్జాతీయ వేదికలకు ఒక్కోసారి ప్రమాణికంగా కూడా ఉంటాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు, యూనివర్సిటీలపై కక్షపూరిత వివక్షతను కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగానే మొన్న విడుదల చేసిన 1000 ఓబీసీ పెలోషిప్స్ల్లోను ఓయూకి అన్యాయం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో గొప్ప పేరొంది శతజయంతి జరుపుకున్న ఉస్మానియా యూనివర్సిటీకి కేవలం 7పెలోషిప్స్ కేటాయించారు. ఇటు వికలాంగుల పీహెచ్డీ విద్యార్థులకు కూడా 8 కేటాయించి చేతులు దులుపుకున్నారు. 18 స్టేట్ యూనివర్సిటీలు, 5 సెంట్రల్ యూనివర్సిటీలు గల తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా 28 ఫెలోషిప్స్, 24 స్టేట్ యూనివర్సిటీలు, 2 సెంట్రల్ యూనివర్సిటీలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 16 మాత్రమే కేటాయించారు. అంటే, రెండు తెలుగు రాష్ట్రాలకు 44 ఫెలోషిప్స్ మాత్రమే ఇచ్చారు. నేటికి ఆరేండ్లు ముగుస్తున్న ఇంకా ఆర్జీఎన్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు.
గతంలో ప్రతి సంవత్సరం రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా ఆర్జీఎన్ఎఫ్ (రాజీవ్గాంధీ నేషనల్ ఫెలోషిప్)ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేది. దీనికి నిధులను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ, గిరిజన వ్యవహారాల శాఖ, మానవ వనరుల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఆర్డీ) సమకూర్చి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ద్వారా విద్యార్థులకు అందించేవి. బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014-15 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ ఆర్జీఎన్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కొత్తగా ఎన్ఎఫ్ఎస్సీ (నేషనల్ ఫెలోషిప్స్ ఫర్ ఎస్సీ) ఎన్ఎఫ్ఎస్టీ ( నేషనల్ ఫెలోషిప్స్ ఫర్ ఎస్టీ), ఎన్ఎఫ్ఓబీసీ (నేషనల్ ఫెలోషిప్స్ ఫర్ ఓబీసీ) పేరుతో ఫెలోషిప్స్ ఏర్పాటు చేసి విభజించినది. ఈ నోటిఫికేషన్ కూడా గత మూడేండ్ల నుండి విడుదల చెయ్యలేదు. కొత్తగా ఆర్జీఎన్ఎఫ్కి ఎస్సీ విద్యార్థులకు నెట్/సెట్ నిబంధన తప్పనిసరి అంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలోని 28 విభాగాలలో సుమారు మూడువేల మంది విద్యార్థులు పీహెచ్డీ చేస్తుండగా అందులో అధికంగా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం యూనివర్సీటీ టెస్ట్ ద్వారా పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులే ఉన్నారు. వీళ్లందరికీ ఫెలోషిప్స్ ఇచ్చే బాధ్యత నుంచే తప్పుకునే ప్రయత్నాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరంగా చేస్తున్నాయి. గతంలో నాన్నెట్ ఫెలోషిప్స్ పేర పీహెచ్ డీ విద్యార్థులకు ప్రతి నెల రూ.8వేలు, పీజీ విద్యార్థులకు ప్రతినెల రూ.3వేలు ఇచ్చేవి. ఇప్పుడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనేక విద్యా కమిషన్లు విద్యార్థుల పరిశోధన నిమిత్తం అవసరమయ్యే ఆర్థికాన్ని ఫెలోషిప్ పేర సమకూర్చాలని చెప్పాయి. అప్పుడే నాణ్యమైన రీసెర్చ్ సాధ్యమంటూ పేర్కొన్నాయి. కానీ నేడు ఆ ప్రతిపాదనలు విద్యార్థుల అవసరాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రెండు అద్భుతమైన అవకాశాలు ఓయూ కోల్పోవలసి వచ్చింది. దేశంలో పది ప్రఖ్యాత యూనివర్సిటీలను సెలెక్ట్ చేసిన (ఐఓఈ) ఇన్సిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ మన రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీని కూడా సెలక్ట్ చేసింది. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రొఫెసర్ల కొరత రీసెర్చ్ అవసరాల టెక్నికల్ ల్యాబ్లు, సౌకర్యాల లేమిని గుర్తించి ఐఓఈ రిజక్ట్ చేసింది. కానీ ఎంపికై ఉంటే దేశ స్థాయిలో గొప్ప పేరుతోపాటే రీసెర్చ్ పేర యూనివర్సిటీకి వేయి కోట్ల రూపాయలు మంజూరయ్యేవి. మరొకటి 102వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఓయూలో నిర్వహించేందుకు మొదటి అవకాశం వచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలను నిర్వహిం చలేమన్నందున అది కూడా వెనక్కి వెళ్లవలసి వచ్చింది. అదే ఓయూలో నిర్వహించి ఉంటే జాతీయ స్థాయిలో యూనివర్సిటీ ఖ్యాతి పెరిగేది. యూనివర్సిటీకి రూ.600కోట్ల ఫండ్ వచ్చేది. అదికూడా చేజారాల్సిన దుస్థితి ప్రభుత్వం వలన ఏర్పడింది. యూ నివర్సిటీ విదార్థులకు ఇవ్వాల్సిన ఫెలోషిప్స్ను అనవసర నిబంధనల పేర తగ్గిస్తూ నాన్నెట్ పెలోషిప్స్ రద్దు చేస్తుంటే నాణ్యమైన రీసెర్చ్ ఆశించడం సాధ్యమా! సైన్స్ విద్యార్థుల పరిశోధనకు అవసరమయ్యే ఆధునిక ల్యాబ్లు, కెమికల్స్ కల్పించకుండా పరిశోధన చెయ్యాలంటే సాధ్యంకాక విద్యార్థులు రీసెర్చ్ నుండి క్రమంగా దూరమవుతున్న పరిస్థితి నేడు నెలకొని వుంది.
ఒక దశాబ్ద కాలంగా యూనివర్సిటీ ఒడిలోకి ఉత్పత్తి కులాల పిల్లలు, శ్రామికుల పిల్లలు వస్తున్నారు. ఇది గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలనే ఫెలోషిప్స్ సంఖ్యను తగ్గిస్తున్నా యి. వీలైతే రద్దు చేస్తున్నాయి. అది ప్రశ్నిస్తారన్న, నిలదీస్తారన్న భయంతో ఓయూకు కేంద్ర మం త్రి కిషన్రెడ్డి రాక సందర్భంగా ముందస్తు అరెస్టులు, హాస్టల్ నిర్బంధాలు చేశారు. ఈ విషయం లోతుగా ఆలోచించాల్సిన అవసరం వుంది. వేల ఏండ్లుగా అవమానాలు, ఆకలిదాడులు, ఎదుర్కొ ని విద్యకు దూరంగా వున్న ఉత్పత్తి కులాల పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు ఆలోచిస్తే, పరిశీలిస్తే, పరిశోధన చేస్తే పాలక ప్రభుత్వాల దోపిడీ కూలడం ఖాయం. ఆధిపత్యకులాల ఆధి పత్యం నశించడం తథ్యం. అసమానతలపై పోరాటాలు పెరుగుతాయి. కాబట్టే తెలుకోవాల్సిన అవసరం, బాధ్యతలున్న విద్యార్థులు యూనివర్సిటీ ఒడిలోకి అడుగుపెట్టగానే యూనివర్సిటీలల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా, టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆధునిక సాంకేతిక కోర్సులను ల్యాబ్లను ప్రవేశపెట్టకుండా, నాన్నెట్ ఫెలోషిప్లను రద్దు చేస్తూ దేశ, రా ష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ ఖ్యాతిని నీరుకారుస్తున్నాయి. ఫెలోషిప్స్ ఇవ్వకుండా రీసెర్చ్కు దూర ంగా పేద, మధ్యతరగతి, గ్రామీణ విద్యార్థులను నెడుతున్నారు. ఈ కుట్రను అర్థం చేసుకొని ఉద్యమించాల్సిన అవసరం, పోరాటాలు విస్తృత పరిచి ఢిల్లీలో గర్జించాల్సిన బాధ్యత మనందరిపై వుంది. అప్పుడే మన న్యాయమైన హక్కైన ఫెలోషిప్స్ను సాధించగలం. నాణ్యమైన రీసెర్చ్ చెయ్య గలం. వేల ఏండ్ల అసమానతలను, దోపిడీ, కుల వివక్షతలను ప్రశ్నించగలం. రూపుమాపగలం.
- గడ్డం శ్యామ్
సెల్ : 9908415381