Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తినే పప్పు నుండి ఉప్పు వరకు, రాసుకునే పౌడర్ నుండి రుద్దుకునే పేస్ట్ వరకు అంతా కలుషితమయమే! భారత్లో విక్రయిస్తున్న ఉప్పులో 'సైనేడ్' ఉందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'పొటాషియం ఫెర్రో సైనేడ్'ని అన్ని బ్రాండ్ల అయోడైజ్డ్ ఉప్పులో ప్రమాణాలకు మించి రసాయనాన్ని కలుపుతున్నట్టు అమెరికన్ వెస్ట్ అనలిటికల్ లాబోరెటరీస్ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల క్యాన్సర్తోపాటు కిడ్నీ వ్యాధులొస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగని ఆశించే ఫంగస్లో అఫ్లోటాక్సిన్ అనే విష పదార్థం ఉన్నట్టు వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఆఫ్రికాలో పిల్లలకు ఎక్కువగా మొక్కజొన్ననే ఆహారంగా ఇస్తారు. అఫ్లోటాక్సిన్ కల్సి ఉన్న మొక్కజొన్నలను పిల్లలు తినడం వలన వారి ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. పెద్దలలో లివర్ క్యాన్సర్ వస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన నెసిల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఆహార పదార్థాలలో కూడా అనుమతికి మించి సీసం కలుస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆహార పదార్థాలు కూడా పిల్లల ఆరోగ్యం పట్ల శాపంగా మారుతున్నాయి. మనం రోజు వారీగా తీసుకునే ఆకుకూరలు, కూరగాయలనే మోతాదుకు మించిన రసాయనిక ఎరువులతో పండిస్తు న్నారు. వాటిని పరిశుభ్రంగా కడిగి వండుకోకపోతే తీవ్రమైన అనారోగ్య ప రిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 'ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్' అధ్యయనం ప్రకారం మనం అలంకరణకు వినియోగించే టాల్కమ్ పౌడర్లో ఆస్బెస్టాస్ ఎక్కువైతే క్యాన్సర్ వచ్చే అవకాశం వస్తుందని తెలిపారు. ఈ విషయంపై మరికొంత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసే పౌడర్ని వాడటం వలన ఓవేరియన్ క్యాన్సర్ వచ్చినట్టు ప లువురు మహిళలు కోర్టుకెక్కారు. టూత్ పేస్టులలో ఫ్లోరైడ్ ఎక్కువైతే దం తాలకు ఇబ్బంది కలుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్ పేస్టులలో గైలిటాల్ ఉంటే మంచిదని వారు తెలుపుతున్నారు. తల స్నానా నికి ఉపయోగించే షాంపులలో బురుజు (ఫామ్) రావడానికి కోకమైడ్ డీఈఏ కలుపుతున్నారనీ, ఇటువంటి వాటిని వాడటం వల్ల కండ్లకు ప్రమాదమని కాలిఫోర్నియాకి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంపులకు బదులు కంకుడుకాయలతో తల స్నానం చేయడం మంచిది. పెద్దపెద్ద నగరాల్లో హోటల్స్లో విక్రయించే ఆహార పదార్థాలలో జరిగే కల్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని హోటల్స్లో కుక్క మాంసా న్ని వడ్డిస్తున్నట్టు పలు తనఖీలలో వెల్లడైంది. ఇక బాధలోనో, ఆనందంలో నో మద్యం తాగే మందు బాబులకు కూడా బ్రిటన్లో ఫ్లైమౌత్ యూనివర్సి టీ శాస్త్రవేత్తలు చేదు వార్తని వినిపిస్తున్నారు. వారి పరిశోధన ప్రకారం బీరు సీసాల్లో ముఖ్యంగా ఆకు పచ్చ రంగు సీసాల్లో భారీ స్థాయిలో క్రోమియం, కాడ్మియం పాళ్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలియజేశారు. మద్యం వల్ల వచ్చే నష్టాల గురించి అందరికీ తెలిసిందే. హోటల్స్లో తయారు చేసిన ఆహార పదార్థాలను ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లలో తీసుకెళ్తుంటారు. ఇటువంటి ఆహార పదార్థాలను తినడం వలన జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుది. కాయలను మాగ పెట్టడానికి కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారు. వాటిని తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. చట్టాలెన్ని ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఆహార కల్తీ మాఫియా రోజురోజుకు పెరిగిపోతుంది. దీనిపై ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలి. లేకుంటే విష రసాయనాల విషపు కౌగిలిలో మానవాళి నలిగిపోతుంది.
- యం.రాంప్రదీప్
సెల్ : 9492712836