Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాసనసభ సమావేశాలు చూస్తుంటే టీఆర్ఎస్ జనరల్ బాడీలాగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్కు తగిన సంఖ్యా బలం లేకపోవడం, ప్రతిపక్షమైనప్పటికీ ఎంఐఎం ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో సభలో ప్రశ్నించేవారే కరువయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఆసాంతం ఏకపక్షంగానే జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను ఆ పార్టీ సభ్యులు పొగడ్తలతో ముంచెత్తడం తప్ప.. ప్రజా సమస్యలను ఏకరువు పెట్టిన దాఖలాలు లేవు. అధ్యక్షా.. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించి చివరికి దాకా సీఎంను పొగడటమే తప్ప వారి వారి నియోజకవర్గాల్లో నెలకొన్న కీలక సమస్యలపై నోరు విప్పడం లేదు. ఎంతసేపు మా సీఎం, మా ప్రభుత్వం.. అంటూ గొప్పలు చెప్పుకోవడానికే అసెంబ్లీ సమావేశాలు నడుపుతున్నట్టు కనిపిస్తున్నది. ఒక పక్క రాష్ట్ర ప్రజానీకం ప్రాణాంతక వ్యాధులతో విలవిలలాడుతున్నా ఎమ్మెల్యేలు మిన్నకుండా ఉండటం మంచి పద్ధతి కాదు. కేసీఆర్ను పొగడటానికి తెలంగాణ భవన్ను ఉపయోగించుకుంటే మంచిది. విలువైన సమయం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసుకుంటూ అసెంబ్లీలో సీఎం గురించే మాట్లాడాలని ఎవరు తర్ఫీదిచ్చారో..
- టి సంజరుకుమార్