Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరోసారి దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు కార్యక్రమాలు పూర్తి చేశా రు. ప్రతియేటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, జనవరి 26న గణతంత్ర వేడుకలు జరుపుకోవడం ఏడు దశాబ్దాలుగా ఆనవాయితీగా మా రింది. ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజలే ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అన్ని దేశాల రాజ్యాంగాలకన్నా మన రాజ్యాంగం మహత్తరమైనదని పాలకులు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈవిధంగా 71వ రిపబ్లిక్ డే వేదిక మీద దేశ రాజధానిలో ప్రధానమంత్రి, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసి ఇదీ.... మన ఘనకీర్తి అని గొప్పలు చెప్పడానికి సంసిద్ధులయ్యారు. అయితే.... ఈ డెబ్భై ఏండ్ల స్వతంత్ర భారతంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా? అని ప్రశ్నించుకోవలసి ఉంది. 130 కోట్ల జనాభాలో కేవలం ఒ క శాతం మంది చేతుల్లో డెబ్భై శాతం సంపద కేంద్రీకృతమై ఉంది. 30 కోట్ల మంది ప్రజలకు నేటికీ సరైన కూడు, సేద తీరడానికి గూడు, ఒంటినిండా కప్పుకోవడానికి గుడ్డ లేని దు స్థితి కొనసాగుతూనే ఉంది. ఈ కోణంలో మనది వర్ధిల్లుతున్న దరిద్ర భారతం అని పేర్కొనవచ్చు. గ్లోబ ల్ వెల్త్ రిపోర్ట్ -2019 ప్రకారం భారత్లో సంపద అసమానతలు 83.2 శాతం ఉన్నాయని వెల్లడి కావ డంతో నేటి రిపబ్లిక్ డే వేడుకలను చూసి నవ్వాలా... ఏడవాలా అన్న పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో బలమైన మావన వనరుల సంపద ఉంది. సహజవనరులు పుష్కళంగా ఉన్నాయి. సహజ వనరులను సద్వినియోగం చేసుకుని మానవ వనరులకు పని కల్పించడంలో పాలకులు ఏయేటికాయేడు విఫల మవుతూనే ఉన్నారు. పేరుకు ప్రజాస్వామ్యమే అయినప్పటికీ ఇందులో ధనస్వామ్యానిదే అడుగడుగునా పై చేయిగా మారింది. ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఒక్కొక్క అభ్యర్థి సరాసరిన యాభై కోట్లనుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాడని అప్పట్లో మీడియా కోడై కూసింది. నేటి భారత పార్లమెంట్ స భ్యులలో ఎనభై శాతం మంది ఆగర్భ శ్రీమంతులు, కోటీశ్వరులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇందులో నేరచరితుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ఇప్పటి వరకు 103 రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికీ అనేక సవరణలు పాలకుల స్వప్రయోజనాలతో ముడిపడినవే. పేదరిక నిర్మూలన కోసం కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. అయితే.... ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా కులాల, వర్గాలలో వం శపారంపర్యంగా కొన్ని ధనిక కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయే తప్ప నిరుపేదలకు ఆ ఫలాలు అందడం లేదు. కొంతమంది అల్పసంఖ్యాక వర్గాలను సంతృప్తి పరచడానికి మెజార్టీ వర్గీయుల హక్కుల ను కాలరాస్తుండడం కూడా ఆనవాయితీగా మారింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారతదేశంలో కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు అనుక్షణం విద్వేషాలకు గురిచేస్తుండడం చాలా బాధాకరం. మొత్తం దేశాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతం, అభివృద్ధి చెందని ప్రాంతం, వెనుకబడిన ప్రాంతంగా విభజించి మొత్తం కులాలను పక్కనబెట్టి పేదలు, ధనికులు అని రెెండు వర్గాలుగా... మాత్రమే తీసుకొచ్చే విధంగా మన పాలకులు ఆలోచించడం లేదు. నేటి చట్టాలు కొంతమందికి చుట్టా లుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన, సామాజిక, కుల రహిత, మత రహిత వ్యవస్థతో కూడిన భారతదేశం ఆవిర్భవించడమనేది దాదాపు కలగానే మారిపోయింది.
- తిప్పినేని రామదాసప్ప
సెల్ : 99898 18212