Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పౌరసత్వ చట్టం 1955లో సవరణలకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 డిసెంబర్ 9న లోక్సభలో ఆమోదం పొంది పౌరసత్వ సవరణ చట్టం - 2019గా మారిపోయింది. ఈ బిల్లు ప్రతిపాదిన దశలో నుంచే ఈశాన్య రాష్ట్రాలలో, ప్రత్యేకించి అస్సాంలో వ్యక్తమవుతూ వచ్చిన వ్యతిరేకత, లోక్సభ ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్త ఆందోళనలకు దారితీసింది. ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం పట్ల దేశం అట్టుడికిపోతున్నది. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే నినాదంతో కోట్లాది మంది ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిరసనకారులందరూ ఈ చట్టాన్ని అస్సాంలో అమలైన జాతీయ పౌరుల పట్టిక (నేషనల్ రిజష్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్ఆర్సీ)తో 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాకా నమోదు కానున్న జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ - ఎన్పీఆర్)తో కలిపి చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు ఒకవైపు ఎంత ప్రతికూలత వచ్చినా ఈ చట్టాన్ని అమలు చేసి తీరుతామని బీరాలు పలుకుతున్నారు. మరోవైపు ఈ చట్టానికీ, ఎన్ఆర్సీకీ సంబధం లేదనీ, దేశవ్యాప్త ఎన్ఆర్సీ అనే మాట తాము అనలేదనీ పచ్చి అబద్ధాలాడుతూనే ఎన్ఆర్సీని ముందుకు తెస్తున్నారు. న్యాయమైన ప్రజాందోళనల మీదికి పోలీసు బలగాలనూ, పారా మిలిటిరీ బలగాలను ఉసిగొల్పుతున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఆందోళనలో కనీసం డజన్ల మంది మరణించారు. విపరీతమైన హింసాకాండ చెలరేగింది. పౌరసత్వం చట్టం 1955 ప్రకారం పౌరసత్వం ఐదు మార్గాల్లో మాత్రమే వస్తుంది. 1. దేశంలో పుట్టినందు వల్ల 2. పొరుగు దేశంలో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు భారతీయ పౌరులైనందు వల్ల. 3. విదేశాల నుండి వచ్చినప్పటికీ నిర్ణీత ఆంక్షలకు లోబడి భారత ప్రభుత్వం నమోదు చేసినందు వల్ల. 4. అటువంటి నమోదుతో పన్నెండేండ్లపాటు స్ధిర నివాసం, సహజీకరణ చేయ డం వల్ల. 5.భారత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని తనలో కలుపుకున్నందు వల్ల (ఉదా హరణకు సిక్కిం). ఈ పౌరసత్వచట్టానికి 1986లో, 1992లో, 2003లో, 2005 లో చేసిన సవరణల క్రమం రెండు షెడ్యూళ్లనే పూర్తిగా తొలగించారు. అనేక సెక్షన్లలో మార్పులూ, చేర్పులూ చేశారు. ఈ క్రమంలో జరిగిన కొత్త సవరణగా పౌరసత్వ సవరణ చట్టం -2019ను ప్రస్తుత పార్లమెంటు ఆమెదించింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయమేమంటే ''రాజ్యాంగ అధికారణలలోను, 1955 చట్టంలోను, ఆ తర్వాత జరిగిన ఐదు సవరణల్లోనూ లేని విధంగా మొట్టమొదటి సారిగా 2019 చట్ట సవరణల్లో పౌరసత్వం ఇవ్వడానికి, లేదా నిరాకరించడానికి ప్రతిపాదికగా మతాన్ని చేర్చారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం ఇప్పుడు ప్రవేశపెట్టడానికి ఎన్ని కారణాలు చెప్పినప్పటికీ, అసలు బీజాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు, భారతీయ జనతాపార్టీ ఆలోచనల్లోనే ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ప్రణాళికలోనే ''ప్రపంచంలో ఎక్కడై నా వివక్షను ఎదుర్కొంటున్న హిందువులందరికీ భారతదేశం సహజమైన ఆశ్ర యం అవుతుంది. వారు శరణార్ధులుగా భారతదేశం రావడానికి సదా ఆహ్వానం ఉంటుంది'' అని రాశారు. దానికి కొనసాగింపుగానే ఫారినర్స్ ఆర్డర్ 1948లో, 2015లో సెప్టెంబర్ 7న చేర్చిన కొత్త నిబంధనలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుండి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన, క్రైస్తవ మతస్తులకు ప్రత్యేక మినహా యింపు గురించి ప్రస్తావించారు. అలాగే పాస్పోర్ట్ (ఎంట్రీ ఇన్టు ఇండియా) రూల్స్ 1950లో 2015 సెప్టెంబర్ 7న చేర్చిన కొత్త ఉప నిబంధనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, చైన, పార్సీ, క్రైస్తవ మతస్తులకు ప్రత్యేక మినహాయింపులు చేర్చారు. ఈ రెండు కొత్త మినహాయింపులకూ 2016 జూలై 18న మరో సవరణ చేస్తూ అఫ్ఘనిస్తాన్ పేరు కూడా చేర్చారు. 2014 ఎన్నికల ప్రణాళిక వాగ్దానం, ఫారినర్స్ ఆర్డర్లో చేర్పు, పాస్ పోర్ట్ (ఎంట్రీ ఇన్టు ఇండియా)లో చేర్పు అనే ఈ మూడు అంశాలనూ కలగలిపి నేరుగా పౌరసత్వ చట్టంలోకి ప్రవేశించడమే పౌరసత్వ సవరణ చట్టం - 2019 ఉద్దేశ్యం.
మొట్టమొదట ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైంది. భారతదేశంలో ప్రవేశపె ట్టబడే, ఆమోదం పొందే, అమలులోకి వచ్చే ఏ చట్టమైనా రాజ్యాంగబద్ధమైనదిగా, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేదిగా ఉండాలి. కానీ ఈ చట్టం ఎన్నో అంశాలలో రాజ్యాంగ వ్యతిరేకమైనది. రాజ్యాంగ ప్రవేశికను మాత్రమే గాక కనీసం నాలుగు రాజ్యాంగ అధికరణాలను కూడా ఈ కొత్త చట్టం ఉల్లంఘిస్తున్నది. రాజ్యాంగంలో అధికరణం 14 ''చట్టం ఎదుట పౌరులందరి మధ్య సమానత్వం'' ఉంటుందని చె బుతుండగా, అధికరణం 15 ''రాజ్యం ఏ వ్యక్తి పట్ల మత ప్రాతిపదికన వివక్ష చూ పబోదని'', అధికరణం 16 ''అవకాశాలలో పౌరులందరి మధ్య సమానత్వం'' పాటి స్తామని, మత ప్రతిపాదికన అవకాశాలు నిరాకరించరాదని చెబుతుండగా, అధిక రణం 25 ఏ వ్యక్తికైనా పాటించే ''వ్యక్తిగత మత స్వేచ్ఛకు'' హామీ ఇస్తుండగా కొత్త చట్టం ఈ అధికరణాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నది. ఈ చట్టం ప్రత్యేకంగా ఆరు మ తాలను ప్రస్తావించి వారికి మాత్రమే అక్రమ చొరబాటుదారులుగా గుర్తింపు నుం చి మినహాయింపు నిస్తున్నదంటే, పౌరులుగా గుర్తించడానికి కొన్ని మతాల వారికి మాత్రమే నివాస కాలపు పరిమితిని తగ్గిస్తున్నదంటే అది ఖచ్చితంగా వివక్షా పూరి తమే. ఆ జాబితాలో రాయని మతాలపట్ల అనుచిత ప్రాధాన్యతను చూపడమే. ని జానికి ఇప్పుడు ఒక చట్టంలో మొదలైన ఈ వైఖరిని ఇప్పుడే ప్రతిఘటించి, ఉప సంహరించేలా ఆందోళన జరపకపోతే ఇప్పుడు ఒక చట్టానికి మతాన్ని ప్రతిపాదిక చేసిన వారు రేపు అనేక ఇతర అంశాలకు మతాన్ని ప్రతిపాదిక చేసే ప్రమాద ముంది.
విదేశాల నుండి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మత ప్రతిపాదికన అమలు చేయడం అనేది చట్టబద్ధమై నిర్ధారణ అయిపోతే, దానికి కొనసాగింపుగా స్వదేశంలో ఉన్నవారికి కూడా మత ప్రతిపాదికన మినహాయింపులు ప్రత్యేక సౌక ర్యాలు ఇవ్వడానికి దారి తీస్తుంది. ఇప్పటికీ తరతరాలుగా నిరాదరణకు గురైన స మూహాలకు, ప్రాంతాలకు మాత్రమే అటువంటి మినహాయింపులు, ప్రత్యేక సౌక ర్యాలు ఇవ్వడానికి రాజ్యాంగం అవకాశం ఇస్తుంది. ఆ ప్రతిపాదికను మార్చి అధికా రంలో ఉన్న ప్రభుత్వం ఇష్టారాజ్యంగా, వారి భావజాలానికి అనుగుణంగా మిన హాయింపులు, ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడం ప్రారంభిస్తే కొనసాగుతున్న ఆధిపత్య సంస్కృతిలో భవిష్యత్తులో కందిరీగల తుట్టె కదలడానికి అవకాశం వస్తుంది.
జాతీయ పౌర పట్టిక మీద అనుమానాలు, గందరగోళం అలా ఉండగానే, భారత ప్రభుత్వం జానాభా పట్టికను తయారు చేయబోతున్నామని మరొక ప్రకటన చేసింది. దీని తయారీకి 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తారని అంటున్నారు. అసలు ఈ జాతీయ జనాభా పట్టిక అనే ఆలోచన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2000లో మొదటి సారి వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన కార్గిల్ సమీక్షా కమిటీ దేశ వ్యాప్తంగా పౌరులను, పౌరులు కాని వారిని తప్పని సరిగా నమోదు చేసి పట్టిక తయారు చేయాలని సిఫారుసు చేసింది. ఈ సిఫారసును వాజ్పేయి ప్రభుత్వం 2001లో ఆమోదించి 2003లో జాతీయ జనాభా పట్టిక రూపొందించింది. ముంబైౖ దాడుల తర్వాత ఈ ప్రయాత్నాన్ని భద్రతా చర్యలతో జతచేసి దాదాపు 66 లక్షల మందికి నివాస ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు. 2010లో తయారైన జాతీయ పట్టికను 2015లో పరిష్కరించి తాజా పరిచారు. గత ఆరు నెలలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న సాధారణ నివాసులకు సంబంధించిన 15 అంశాల వివరాలు సేకరించి ఈ జాతీయ జనాభా పట్టిక తయారవుతుంది. అంటే ఎన్ఆర్సీ తయారు చేయడానికి మొదటి మెట్టు ఎన్పీఆర్. ఆ విధంగా ప్రజలను చీలదీయడానికి, ప్రజల్లో ఒక సమూహాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఒక సాధనంగా ఈ పట్టిక సంఫ్ు పరివార్ పాలకులకు ఉపయోగపడుతుంది. దాన్ని పౌరసత్వ సవరణ చట్టం అంటారా, జాతీయ పౌరుల పట్టిక అంటారా, జాతీయ జనాభా పట్టిక అంటారా అనేది సాధారణ బారతీయులకు అనవసరం. దాని వల్ల ఎవరి మీద ఏ ప్రభావం పడుతుందనేదే ముఖ్యం. మొట్ట మొదట అర్థం చేసుకోవాల్సింది అవి మూడూ వేరు వేరు కావు అని. వాస్తవాచరణలో ఒక దాని ప్రభావం మరొక దాని మీద పడక తప్పదు. దేశంలో ప్రతి మనిషీ తనకు ఈ దేశ పౌరసత్వం ఉందని తనను తాను రుజువు చేసుకోవాల్సి వస్తుంది.
ఇంత నిరాశమయ వాతావరణంలో కూడా సంఫ్ుపరివార్ దుర్మార్గానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసన, ప్రతిఘటన ఒక ఆశా సూచిక. ఈ ప్రదర్శనలను సమీకరించి, సంఘటితం చేసి, శాస్త్రీయ మార్గంలో లక్ష్యం దాకా నడిపించగల వామపక్ష, లౌకిక శక్తులు లేకపోతే ఇంత అద్భుతమైన ప్రజా వికాసమూ చప్పున చల్లారి పోగలదని లక్షలాది మంది పాల్గొన్న అరబ్ స్ప్రింగ్ ఉద్యమాలు మన కండ్ల ముందే చూపాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనను వ్యక్తం చేయడమూ, సంఘటిత పరచడమూ, విద్వేష రాజకీయాల సంఫ్ు పరివార్ వ్యూహాలను అడ్డుకోవడమూ, ఈ దేశపు బహుళత్వ సహజీవన సంస్కృతిని ఎత్తి పట్టడం ఇవాళ ప్రగతిశీల వ్యక్తులందరి కనీస కర్తవ్యం.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్ : 9676407140