Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గాంధీజీ లాంటి వ్యక్తి ఈ భూమిపై రక్త మాంసాలతో నడిచాడంటే భవిష్యత్తు తరాలవారు నమ్మరేమో!'' అంటూ ప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ వ్యాఖ్యానించాడు. నేడు గాంధీజీ బొమ్మ కరెన్సీ కాగితాలకే పరిమి తం కావడం చూస్తుంటే ఆ వ్యాఖ్యలు నిజమేనని అనిపించక మానదు. గాం ధీజీని ''అర్ధనగ ఫకీరు'' అని ఇంగ్లాం డు మాజీ ప్రధాని విస్టన్ చర్చిల్ పరి హసించినా కృం గిపోలేదు. ఆయనను జాతి మొత్తం ''మహాత్మా'' అని పిలిచినా పొంగిపోలేదు. గాంధీజీ జీవితం తెరిచిన పుస్తకం. తన బలాలతోపాటు, బలహీనతలను కూడా తన ఆత్మకథలో వి వరించిన ఘనత గాంధీజీకే దక్కింది. అహింస, సత్యాగ్రహా లనే భావనలు గాంధీజీతోనే ప్రారంభంకాకపోయినా, వాటికి అత్యం త ప్రాచుర్యం కల్పించిన వ్యక్తులలో గాంధీజీ అగ్రగ ణ్యుడు. గాం ధీజీ మనదేశంలో ఉన్నత సామాజిక వర్గంలో జన్మించినా, దక్షిణా ఫ్రికాలో వివక్షతను ఎదుర్కొన్నారు. ఫలితంగా అక్కడ నల్లజాతీ యుల హక్కులకోసం ఆయన పోరాడి విజయం సాధించారు. గాంధీజీ మన దేశానికి వచ్చాక దేశవ్యాప్తంగా పర్యటించి ఇక్కడ సామాజిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువా తనే 1917లో చంపారన్ ఉద్యమం వంటి వాటిని చేపట్టి కొన్ని స్థానిక సమస్యలపై పోరాడి సత్ఫలితాలను సాధించారు. జలియ న్ వాలాబాగ్ దురంతాలకు నిరసనగా, రౌలత్ చట్టానికి వ్యతిరే కంగా గాంధీజీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రార ంభించారు. ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిం చింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మనదేశంలో పెద్దఎత్తున జరి గిన మొట్టమొదటి ఉద్యమం ఇదే. అయితే చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక ఘటనతో అప్పటి వరకు శాంతియుతంగా సాగుతు న్న ఉద్యమం మరో రూపంలోకి మారుతుందేమోనన్న సందే హంతో గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆపారు. గాంధీజీ అహింసా వాది, హింసను ఆయన ఏ రూపంలోనూ స్వాగతించలేదు. ఒక వేళ ఉద్యమం హింసారూపం దాలిస్తే కొన్ని వర్గాల వారు ఉద్య మానికి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన భావించారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం దీర్ఘకాలం కొనసాగాలంటే ఆర్ధిక వనరులు, వ్యక్తిగత సమయం కూడా ముఖ్యమని గాంధీజీ భావించారు.
''గ్రామాలే దేశానికి వెన్నుముక'' అని గాంధీజీ నమ్మారు. భారీ పరిశ్రమలు కాకుండా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గాంధీజీ స్వాగతించారు. ఆయన దేశ స్వాతం త్య్రానికి ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వగా, స్వాతంత్య్రంతో పాటు బహుజనుల హక్కులు కూడా చాలా ముఖ్యమని అం బేద్కర్ నొక్కిచెప్పారు. గాంధీజీతో భగత్సింగ్, అంబేద్కర్, సుభాస్ చంద్రబోస్ లాంటి వారు సిద్ధాంత రీత్యా విబే ధించారు తప్ప, వ్యక్తిగత వైషమ్యంతో కాదనేది గమనిం చాలి. గాంధీజీ పేరును 5సార్లు నోబుల్ శాంతి పురస్కా రానికి పరిశీలించి తిరస్కరించినా ఆయనేమి బాధపడలేదు. అన్ని రంగాలలో అసహనం వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ స్ఫూర్తి ఎంతో అవసరం. గాంధీజీ కలలుగన్న లౌకిక భారతానికి పొంచిఉన్న ప్రమాదాన్ని నివారించడమే గాంధీజీకి నిజమైన నివాళి కాగలదు.
- యం.రాంప్రదీప్
సెల్ : 9492712836