Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుదీర్ఘకాలం పీడితజన నేతగా పనిచేసి, ఎన్నో ఆటుపోట్లలో రాటుదేలి, కమ్యూనిస్టు నేతగా 31, జనవరి 2020న నెలరాలిన ఎర్ర మందారం ఏదులపురం వినరు కుమార్ సదా చిరస్మరనీయుడు. నాటి వరంగల్ జిల్లా నేటి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కంటాయపాలెం గ్రామంలో 67 ఏండ్ల క్రితం జన్మి ంచిన తెలంగాణ పోరుబిడ్డ వినరుకుమార్. తెలంగాణలో దొరల దోపిడీ దౌర్జన్యా లకు, నిజాం,రజాకారు సైన్యాల అకృత్యాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కో సం సాగిన సాయుధ రైతాంగ పోరాటప్రభావం బలంగా కొనసాగుతున్న కాలంలో కామ్రేడ్ వినరుకుమార్ జన్మించారు. ఆ కాలం ఆయన జీవనగమనాన్ని ప్రజాపో రాటాలవైపు మళ్లించడంలో కీలక భూమిక పోషించిందనడంలో అతిశయోక్తిలేదు..
పువ్వు పుట్టగానే పరిమళాలు వెదజల్లినట్టుగా, వినరు బాల్యదశలోనే ఉద్యమ భావాలను రంగరించుకొని, పాఠశాలలో పొరుపాఠాలు నేర్చుకున్నాడు. హైస్కూల్, ఇంటర్ విద్యను కంటాయపాలెం, తొర్రూరులో పూర్తిచేసుకుని ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో తన సమీపబంధువుల ఇంట్లో ఉంటూ 1970లో డిగ్రీ కాలేజీలో చేరి చదువుతూ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. డిగ్రీపూర్తిచేసుకొని డి వైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉద్యమ అవసరాలరీత్య ఇల్లందుకు 1979లో వచ్చాడు. ఇల్లందు డివిజన్లో వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడంలో, నిలబెట్టడంలో వినరుకుమార్ పాత్ర కీలకమైనది. ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న సింగరేణి కార్మికులను ఐక్యం చేసి బలమైన వామపక్ష కార్మిక ఉద్య మాన్ని నిర్మించాడు. అనేక సందర్భాల్లో రాజ్యనిర్బంధాన్ని, శత్రు నిర్బంధాన్నీ, అణిచి వేతను అధిగమించి ప్రజలకు అండగా నిలబడ్డాడు. రాజకీయాలకు అతీతంగా ఇల్లందు ప్రజల మన్ననలను పొంది 1987లో మొట్టమొదటి ఇల్లందు మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యాడు, నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించాడు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ చేకూరి కాశయ్య, మధిర శాసనసభ్యులు బోడెపుడి వెంకటేశ్వరరావుల సహకారంతో రూ.50లక్షలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి కోటిలింగాల మంచినీటి పథకాన్ని పూర్తిచే సి ఇల్లందు ప్రజలకు తాగునీరందించాడు. అనేకమంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకొని డిగ్రీ చదువుకోసం దూరప్రాంతాలకు వెళ్లలేక చదువు మధ్యలోనే వదిలే స్తున్నారు. డిగ్రీ కళాశాల ఇల్లందుకు అవసరమని ముందుగా కార్పస్ నిధిని తయా రుచేసి స్వచ్ఛందంగా ప్రజల సహకారంతో ఇల్లందు ప్రజలకు డిగ్రీ కళాశాలను అం దించాడు. ఇప్పటికి ఇల్లందు పట్టణంలో ఆనాడు నిర్మించిన కల్వర్టులు నేటికి ఉన్నా యి. నీతి, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు ఆదర్శవంతమైన పరిపాలన అందిం చాడు. వినరుకుమార్ వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. మచ్చ లేని మనిషి, తన పదవిని, రాజకీయాలను ప్రజల జీవితాల్లో వెలుగులకోసం త్యాగం చేసాడు. అవినీతి, బంధుప్రీతి నిలువెల్లా స్వార్థంతో నిండిన వ్యవస్థకు తన ఆచరణాత్మక నిజాయితీతో మెరుగులద్దాడు. నిరంతరం తను కొలిమిలా మండుతూ ఈ దేశ పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం అమర త్వం పొందిన ఏదులపురం వినరు కుమార్ నిజంగా ధన్యజీవి.
sugunaraomekala@gmail.com