Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉరికంబాన్నే ముద్దాడిన విప్లవ యువకిషోరాలు భగత్సింగ్, రాజ్గుర్, సుఖదేవ్లు. ఆ వీరుల త్యాగానికి నేటికి 89 ఏండ్లు. బ్రిటిష్ నల్ల చట్టలాను వ్యతిరేకిస్తూ 1929 ఏప్రిల్ 8న ఢల్లీీ సెంట్రల్ పార్లమెంట్ హాల్లో బాంబులు విసిరి కరపత్రాలు పంచి తమ నిరసన వ్యక్తం చేసిన ఈ విప్లవవీరులను అరెస్ట్ చేసిన బ్రిటీష్ ప్రభుత్వం... జైలు జీవితంలోనూ వారి విప్లవ కృషికి భయపడి అంతర్జాతీయ జైలు నిబంధనలకు విరుద్ధంగా 1931 మార్చి 23న సాయకాలం 7.30 గంటలకు ఉరితీసింది. తరువాత వారి భౌతిక కాయాల్ని ముక్కలు, ముక్కలుగా నరికారు. గోనె సంచిలో మూటకట్టి లాహౌర్ జైలు వెనుక గోడలను బద్దలుకొట్టి తీసుకెళ్లి సట్లజ్ నది ఒడ్డున తగలబెట్టారు.
ఇంతటి ప్రాణత్యాగాన్ని దేశం కోసం చిరునవ్వుతో స్వాగతించిన అమరవీరులు కోరుకున్న సమాజం మాత్రం ఇప్పటికి నెరవేరలేదు. దేశభక్తికి నేటి పాలకులు కొత్త అర్థాలను తీస్తున్నారు. మతంపేర రాజ్యంగాన్ని మార్చివేయలానే కుట్రలు చేస్తున్నారు. ''దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు'' అన్న గురజాడ మాటలు తిరగేసి ''దేశమంటే మతమేనోరు మనుషులు కాదోరు'' అంటున్నారు. భిన్న మతాలు గల లౌకిక దేశాన్ని ''ఒకే దేశం - ఒకే మతం''గా చేయాలాని కుట్ర పన్నుతున్నారు. ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో ఆంక్షలు విధిస్తూ వారిదే దేశభక్తి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ముస్లింలు ఈ దేశ ప్రజలు కాదంటూ వారిని ఈ దేశంలో రెండో తరగతి పౌరులను చేసి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్రలో భాగంగా సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్లను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక్క ప్రాణత్యాగం కూడా చేయకుండా బ్రిటిష్కు లొంగిపొయిన వారు నేడు మేమే నిజమైన దేశభక్తులమని అరాచకాలు సృష్టిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భగత్సింగ్ కులం, మతం పట్ల ప్రకటించిన స్పష్టమైన అభిప్రాయాలను తెలుసుకోవాలి. మతం వ్యక్తిగత విషయం అనీ, అందులోకి రాజకీయాలాను తీసుకురాకూడదనీ చెప్పాడు. తనకు తాను నాస్తికుడినని ప్రకటించు కున్నాడు. కాని నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాముడి పేరుతో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో దేశాన్ని నడిపిస్తూ హిందూ, ముస్లిం ఘర్షణలను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో భగత్ సింగ్ భావనలను మనం పరీశిలిస్తే నాడు ప్రజా భద్రతా చట్టం పేరుతో బిల్లు తీసుకొచ్చిన బ్రిటిష్ వారిపై బాంబులు విసిరిన తరువాత తను ఇచ్చిన ''ఇంక్విలాబ్ జిందాబాద్'' అనే నినాదాం ఎంత విస్తరించిదో, ఆ స్ఫూర్తితో నేడు దేశంలో అదే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువత ఇస్తున్న ''ఆజాది'' నినాదం దేశంలో అంతలా విస్తరించింది. బీజేపీ నుంచి ఆజాది కావాలంటున్న వారిపై బీజేపీ మంత్రులు, నాయకులు రెచ్చగొట్టె ప్రకటనలతో దాడులకు ప్రేరేపిస్తున్నారు.అసలు భారతదేశం అంటేనే అనేక వందల సంవత్సరాలుగా విభిన్న జాతులు, మతాల వారు కలసి జీవిస్తున్న దేశం. జాతి, మత, హింసల వల్ల వచ్చిన వారిని శరణార్థులగా అక్కున చేర్చుకున్న దేశం. ఇలాంటి దేశంలో వేర్పాటువాద భావాలను నాటుతున్నారు. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత మహసభలో స్వామి వివేకనంద మాట్లాడుతూ ''సమస్త మత, సమస్త దేశాల నుంచి పరపీడుతులైన వచ్చిన శరణార్థులకు శరాణుమైన దేశం నా దేశం'' అన్నాడు. ''రోమన్ నిరంకుశ్వాతనికి బలై, భారత దేశానికి వచ్చిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని తెల్పడానికి గర్విస్తున్నాను'' అని చికాగోలో వివేకానంద ప్రకటించాడు.
భగత్సింగ్ కూడా భారత్ భిన్న జాతుల సమాహారం అని, సోవియట్ తరహలోనే భారత్ కూడా జాతుల యూనియన్గా ఏర్పడాలని కోరుకున్నాడు. ''1895లో నాటి భారత కాంగ్రెస్ ఆమోదించిన స్వరాజ్య తీర్మానంలో కూడా భారత్లో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయుడని ప్రతిపాదించింది.'' 1928లో భగత్సింగ్ స్థాపించిన నవజవాన్ భారత సభలో కార్యదర్శి హౌదాలో అతని సహచరుడు రాంప్రసాద్ బిస్మిల్ ఇదే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ''భారత్లో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడే''నని ప్రకటించారు. ఈనాడు బీజేపీ ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వస్తున్న వారికి మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పిస్తూ చట్టం చేసింది. దీంతో దేశంలో విద్యార్ధులు, యువత, ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భగత్సింగ్ ''మతతత్వం వలసపాలన కంటే ప్రమాదం'' అని వ్యాఖ్యానించాడు. కానీ భగత్సింగ్ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ ఈనాడు సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తీసుకు వచ్చింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్న వారందరిని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తోంది. ఆలీఘర్ విశ్వవిద్యాలయం, జామియా మిలియా విద్యార్థులపై పోలీసుల దాడులు, జేఎన్యూ విద్యార్థుల పోరాటంపై రౌడీమూకల దాడులు, బీహర్లో కన్నయ కుమార్పై దాడులు, రాజధానిలో కారు చీకట్లో కాంతి రేఖలాగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ''షాహీన్ బాగ్పై'' దాడి, ఈశాన్య ఢిల్లీలో మత ఘర్షణలతో దేశంలో అలజడి సృష్టిస్తున్నారు.
ఈ విద్వేషాలకు నిరసనగా దేశంలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. కేవలం 12 ఏండ్లకే స్వాతంత్ర ఉద్యమంలోకి దూకి, 23ఏండ్లకే ఉరికంబంపై ప్రాణత్యాగం చేసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతోంది. ఆర్ఎస్ఎస్ కొంతకాలం భగత్సింగ్ను కూడా తమ నాయకుడిగా, తమను భగత్సింగ్ వారసులుగా చెప్పుకుంటూ ప్రజలను వంచించే ప్రయత్నం చేసింది. కానీ తమకు వ్యతిరేకంగా ఆయన ఆ రోజుల్లోనే రాసిన రచనలు బయటకు రావటంతో వెనక్కితగ్గారు. నేడు ఆ భగత్సింగ్ స్ఫూర్తే ఈ దేశానికి రక్ష. ఆ వెలుగులో యువత తీసుకోవాలి దీక్ష..
టి. నాగరాజు
సెల్:9490098292