Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ సమయంలో అలవాటుగా మారిన భౌతికదూరం కనుమరుగైంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో బలవంతంగా భౌతికదూరం అమలయ్యేలా చర్యలు తీసుకున్న సర్కారు ఆ తర్వాత సడలింపులు ఇచ్చింది. దీంతో రోడ్లపైకి వస్తున్న ప్రజల్లో భౌతికదూరం కనుమరుగవుతోంది. గతవారం రోజులుగా ప్రతి రోజు వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సమయంలో భౌతికదూరం లేకపోతే కేసులు సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో చర్యలు తీసుకున్నారు. అయితే రానురాను ఆ సమన్వయం లేకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే ఆస్పత్రుల్లో కరోనా రోగులు, అనుమానితుల సంఖ్య పెరిగిపోతుండడంతో, ఇతర జబ్బులున్న రోగులకు వైద్య సిబ్బంది సరైన సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. మరోవైపు ఉన్న సిబ్బందిలోనూ పలువురు కోవిడ్-19 బారిన పడుతున్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ప్రభుత్వశాఖల పరంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుంటుందో చూడాలి.
- కొత్తూరు ప్రియకుమార్