Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తూ దేశంలో ఉన్న అన్నీ రంగాలను కుదేలు చేస్తున్న కోవిడ్-19 మహమ్మారి విద్యా వ్యవస్థ మీద చెప్పలేనంతగా ప్రభావం చూపుతున్నది. దీని కారణంగా 2020-2021 విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమ వుతుందో, ఏ విధమైన నిబంధనలు పాటించాలో, ఏ విధానంలో విద్యా బోధన కొనసాగించాలో అనే దానిపై స్పష్టత లేకుండా ఉంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా విద్యార్థుల ప్రాణాలను కాపాడుకుంటూ వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ విద్యాబోధనకు రూపకల్పన చేయవలసిన ఆవశ్యకత మన ముందున్న సవాలు.
ఆన్లైన్ విద్యా విధానం: ఈ విధానం ద్వారా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులను సెల్ఫోన్లతో ఎట్టి పరిస్థితులలోనూ తరగతి గదిలోకి అనుమతించని నిబంధలను విధించడం జగరింది. కానీ నేటి విపత్కర పరిస్థితులలో ఉమ్మడి విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 మహమ్మారి విజంభిస్తున్న తరుణంలో ఆన్లైన్ విధానం ద్వారా 2020-2021 విద్యాసంవత్సరంలో పాఠ్యంశాలను బోధించటానికి మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఎంత మేరకు విషయ పరిజ్ఞానం అందించగల్గుతామనేది ఒక సవాలు. ఈ విధానం ద్వారా విద్యార్థులు ఎంత వరకు పాఠ్యంశాల పట్ల పట్టు సాధింస్తారనేది ఒక ప్రశ్న. ఎంత మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్-టాప్, ఐ-పాడ్స్ అందుబాటులో ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి.
తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతాయుతంగా ఉండటం అవసరం. విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందిచడం కష్ట తరమవుతుంది. గ్రామీణ వాతావరణంలో విద్యార్థులకు ఇంటర్నెట్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. విద్యార్థులలో ఫిజికల్ ఫిట్నెస్ లోపించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో విద్యార్థుల యొక్క ప్రతిభను అంచనా వేయడం కష్టం. ఉపాద్యాయు నికి, విద్యార్థులకు, మద్య బోధనా సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా గ్రూప్ డిస్కషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలకు దూరమయ్యే అవకాశం ఉంటుంది.
సిలబస్: 2020-2021 విద్యా సంవత్సరానికి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఉన్నటువంటి సిలబస్లో కొంత తగ్గించవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఒక విద్యార్ధి తరగతి గదిలో నేర్చుకున్నంత పరిపుష్టిగా ఆన్లైన్ విధానం ద్వారా అంతగా నేర్చుకోనలేడు. ఆన్లైన్ విధానంలో 20-25శాతం సిలబస్ను మాత్రమే పూర్తి చేయటానికి ఆవకాశం ఉంటుంది. మిగతా సిలబస్ను క్లాస్ రూంలోనే చెప్పవలసిన ఆవశ్యకత ఉంటుంది. పని దినాలు నిర్దిష్ఠంగా చెప్పలేము కాబట్టి గతం వరకు 2019-2020 విద్యా సంవత్సరం వరకు 220 పని దినాల వరకు ఉన్నటు వంటివి ఈ విద్యా సంవత్సరం ఏ విధంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.
మానసిక వ్యక్తిత్వ వికాసం: కోవిడ్-19 మహమ్మారి విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తున్న తరుణంలో ఆన్లైన్ తరగతులు అనేవి విద్యార్థులకు కొంత ఊరట కల్గిస్తున్నప్పటికీ స్నేహపూరిత, ఆహ్లాదకరమైన వాతావరణానికి దూరమై మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థుల మానసిక వికాసాన్ని పెంపొందించటానికి క్లాస్రూమ్లలో ణవba్వర, ూవశ్రీట ువaషష్ట్రఱఅస్త్ర జశ్రీaరర, వివిధ రకాలైన ఖఅఱ్ ్వర్, Qబaత్ీవతీశ్రీy, నaశ్రీట ్వaతీశ్రీy, ూతీవ-ఖీఱఅaశ్రీ వ్ష. పరీక్షలను అధ్యాపకుల సమక్షంలో నిర్వహించి ఫలితాల రూపంలో అంచనా వేయబడేది. కానీ ఆన్లైన్ తరగతులు విద్యార్థుల ూవశ్రీట జశీఅళసవఅషవను ఏ విధంగా డెవలప్ చేస్తాయో తగు ప్రణాళిక రాపొందించవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనై తన చుట్టూ ఒక పరిదిని ఏర్పరచుకొని నా విషయ పరిజ్ఞానం ఇంతే, నాకు తెలివితేటలు తక్కువ, నాకు ఈ సబ్జెక్టు చాలాహార్డ్ అనే భావనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాగా విషయ పరిజ్ఞానం కల్గిన విద్యార్ధికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం వల్ల చదువును నిర్లక్ష్యం చేయవచ్చు.
విద్యార్థుల ఆరోగ్యం: ఆన్లైన్ తరగతులు ద్వారా విద్యార్థులు తమ కంప్యూటర్ గాని, స్మార్ట్ ఫోన్, ల్యాప్-టాప్, ఐ-పాడ్స్ గాని చాలా దగ్గరగా పెట్టుకొని వింటూ అధ్యాపకులను అనుకరిస్తు ఉండటం అవసరం. ఈ సమయంలో విద్యార్థులకు కంటి సంబందిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకే ప్రదేశంలో కూర్చొని ఒక సబ్జెక్టు తర్వాత మరొక సబ్జెక్టు వినడం వల్ల స్తూలకాయ సమస్యలు, జీర్ణ సంబదిత సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. క్లాస్రూమ్ విద్యా బోధన ూష్ట్రశీత్ీ దీతీవaస, ూబఅషష్ట్ర దీతీవaస మొదలైన స్వల్ప కాలిక విరామాలను ఇస్తూ ఒత్తిడిలేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగేది. కానీ ఇప్పుడు ఏ విధంగా టైమ్ టేబుల్ ని తయారు చేయాలి అనేది కూడా ఆలోచించి విద్యార్థులకు తగినట్టుగా ప్రణాళిక రచించి, టైమ్ టేబుల్ని తయారు చేయాలి. తరగతి గదిలో అధ్యాపకుని నియంత్రణలో ఉండి తదనుగుణమైన ఉదాహారణాలను విద్యార్థులు అధ్యాపకునితో చేర్చించే అవకాశం ఉండేది కానీ ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్లలో పాఠ్యంశాలను వల్ల వేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల సమస్యల ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు అందరూ ఏక కాలంలో అధ్యాపకుడు అడిగే ప్రశ్నకు సమాదానాలు ఇవ్వలేకపోవచ్చు.
గౌరీ సతీష్
సెల్: 9989021453