Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వంలో అగ్నిని కురిపించి, వసంతాన్ని పూయించగల కలమతడు. ఆధునిక కవిత్వంలోని కవితాశక్తికి నిదర్శనంగా నిలిచిన ఇమేజరీ అతని సొంతం. సౌందర్యాన్ని చూసి పులకించడం, సమాజంలోని అసమానతలకు ఆక్రోశించడం అతని నైజం. ఎడబాటు ఎదలను సుతిమెత్తగా కోసే విరహ పవనమతని కవనం. జీవితానుభవాల లోతుల్లోంచి దోసెడు కవిత్వాన్ని తోడుకొని తెచ్చి, హదయాంతరాళాల నుండి తన్నుకొచ్చే భావప్రకంపనలకు కవితాతావి అద్ది అక్షరసుమాలు పూయించగల తాత్త్విక బందావనమాలి డా.బి.బాలకష్ణ...
మీ కుటుంబ నేపథ్యం
నేను పుట్టి పెరిగింది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని మాణికేశ్వరీనగర్ (హిమాయత్ అలీబాగ్)లో. నాన్న బొల్లి పోచయ్య, అమ్మ మల్లమ్మ. పదోతరగతి ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ హై స్కూల్లో చదివా, డా.బి.ఆర్.అంబేడ్కర్ జూనియర్ కాలేజీ నుండి బైపీసీతో ఇంటర్, ఆ తర్వాత వివేకానంద ప్రభుత్వ కళాశాలలో బి.కాం, ఎం.ఏ.తెలుగు, పిహెచ్.డి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి పూర్తి చేసాను. మేము మొత్తం ఆరుగురు సంతానం. ఇద్దరు అక్కలు కష్ణవేణి, జయలక్ష్మీ, ముగ్గురు చెల్లెండ్లు అరుంధతి, శ్రీలత, శ్రీవిద్య. నాన్న ఓ.యు.లో మెస్సులో మేట్గా పనిచేసేవాడు. గంపెడు సంతానాన్ని ఒక్కడే కష్టపడి సాదిండు. ఆయన చనిపోయేనాటికి ఆయన సంపాదించుకున్నది 'నీతిగల్లోడూ' అనే పేరు మాత్రమే. ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర తెలుగుశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను. నా ప్రాణసము 'కస్తూరి' గహిణి, నా నెత్తురుకందులు వజ్రాంశ్, స్వరాక్షరి బడిపిల్లలు.
మీ రచనలపై ఎవరి ప్రభావం ఉంది? మీకు ఇష్టమైన కవి?
శ్రీశ్రీ, కష్ణశాస్త్రుల ప్రభావంతో కవిత్వం మొదలుపెట్టాను. ఆ తర్వాత సి.నా.రె., దాశరథిలాంటి ఎందరెందరో మహాత్ముల రచనలను చదుకోవడం వల్ల తొలినాళ్ళలో వారి ప్రభావానికి కొంత లోనయ్యాను. ఎదుగుతున్న దశలో సమకాలీనంగా వస్తున్న కవిత్వాన్ని చదువుతు న్నప్పుడు కవిత్వగమనాన్ని తెలుసుకున్నాను. సంప్రదాయ కవిత్వాన్ని శిరోధార్యంగా భావించి రాసిన వారు, వచన కవిత్వాన్ని అతిసరళీకతం చేసిన వారు ఇలా సాంప్రదాయాధునిక, అత్యాధునిక కవుల్ని చదివాను. ఎవర్ని చదివినా, వారిలో కవిత్వం కనిపించినప్పుడల్లా ఎద ఉప్పొంగిపోయేది. వాళ్ళలా, వీళ్ళలా రాయాలని అనుకునేవాణ్ణి కానీ తనకంటూ ఒక శైలీ సష్టించుకోలేని 'కవి' కాలానికి నిలబడలేడని గ్రహించి నాకంటూ ఒక ప్రత్యేక శైలీని ఎర్పరుచుకు న్నాను. నాకు ఇష్టమైన కవి ముమ్మాటికీ శ్రీశ్రీయే, ఆయనకన్నా బాగా రాసే కవులివాళ ఉండొచ్చు కానీ నాకు మాత్రం తనంటే ఆరాధ్యభావన. అట్లాని ఇతరుల పట్ల అనిష్టతేమీ లేదు. కవిత్వాన్ని జీవింపజేసే ప్రతి కవీ ఇష్టమే.
ఇప్పటి వరకూ ఎన్ని కవితా సంపుటాలను ప్రచురించారు?
ఇప్పటి వరకూ ప్రచురింప బడినవి అయిదు పుస్తకాలు.
2005లో 'అగ్నివసంతం'తో కవిత్వంలో అడుగుపెట్టాను అప్పుడు నేను పి.జి. ఫైనల్లో ఉన్నాను. అది నన్ను కవిగా ఎస్టాబ్లిష్ చేసింది. తొలికతే కానీ తొలకరి కతి కాదని విమర్శకుల మెప్పు పొందిన రచనది. 2006లో 'భావచిత్రాలు'(నానీలు) గోపీసార్ నానీల ప్రేరణతో రాసినవి. ఎందరో ప్రముఖు కవుల పరిచయభాగ్యం కలిగించిన పుస్తకమది. 2009లో వచ్చిన 'విరహసమీరాలు' అసంఖ్యాకమైన అభిమానుల్ని సంపాదించిపెట్టిన పొత్తమిది. సుమారు తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత 2019లో వచ్చిన 'కలలగూడు' కవితాప్రియుల ఎదగూళ్ళలో ప్రేమకలలల్లిన కావ్యం. ఈ ఏడు 2020లో ప్రచురితమైన 'మట్టినైపుట్టాల నుంది' సాహితీలోకంలో నా స్థానాన్ని, స్థాయిని సుస్థిరపరచి బాధ్యతను పెంచిన కతి.
మీ కొత్త పుస్తకం మట్టినై పుట్టాలనుంది విమర్శకుల చేత విలక్షణ తాత్త్విక కావ్యంగా ప్రశంసించబడు తోంది. దాని గురించి చెప్పండి.
భారతీయ తాత్త్విక దక్పథం మహౌన్నతమైనది. ఎందరో మహాత్ములు ఈ నేలలో ప్రభవించి తమ జీవితాలను ధారపోసి దర్శించిన సకలచరాచర సష్టి రహస్యాన్ని, పాంచభౌతికాధారమైన దేహ స్థితిగతుల్ని, ప్రాణకోటికి జవసత్వాలనిచ్చే ప్రకతిశక్తుల్ని, ఎవరికీ అంతుచిక్కని ఆత్మస్వరూపాన్ని, అనంతశక్తిచైతన్యాన్ని విశాల భావనతో మానవ శ్రేయస్సు కోసం విశ్వవ్యాపితం చేసారు. మానవ పరిణామ వికాసం ఆకలితో మొదలై ఆకలి దగ్గరే తిరుగుతుంది. మానవతా పరిణామ వికాస క్రమం అంతర్దష్టితో మొదలై ఆత్మసాక్షా త్కారంతో మహర్దశను అందుకుంటుంది. మట్టినై పుట్టాలనుందిలో ఈ విధమైన దర్శనముంటుంది. అన్నింటికంటే ఎక్కువగా మట్టి, మనిషి చుట్టూ ఈ కావ్యం తిరుగుతుంది. సమస్త జీవన పురోగతి, మానవ ప్రగతి మట్టిలోనే పుట్టింది, ఈ మట్టిలోనే పురోగమిస్తుంది కూడా. మట్టి అనంత చైతన్యతేజోరాశిని తనలో పొదుగుకొని మనిషి ఎదుగుదలకు కారణమౌతుంది. సర్వ స్వతంత్ర జీవినని, అనంత విశ్వం తన హద్దుల్లో ఉందని గర్వించే మనిషిని మేరల్లో ఉంచేది మట్టే. మట్టే మనిషిని శాసిస్తుంది, మట్టే మనిషిగా శ్వాసిస్తుంది, మట్టే మనిషై భాసిస్తుంది. ఊరకలెత్తే ఉప్పెనైన మనిషిని తన అమతహస్తాలతో నిమిరి, నిదానింపజేసి మహామనీషిగా ప్రజ్వలింపజెసే మహౌన్నత మంత్రధ్వానం కూడా మట్టే.మానవ పరిణమ వికాసాన్ని, దానికి ఊతమైన ప్రకతి శక్తులను, ఏ ఎల్లలు లేని దశ్యాదశ్యప్రప్రపంచాన్ని తాత్త్విక సందేశాకతిగా మలిచే ప్రయత్నమే మట్టినై పుట్టాలనుంది.
మీలోని తాత్త్విక దష్టికి కారణం?
మా నాన్నకు రాత్రిపూట పడుకునే ముందు భజనకీర్తనలు, శతక పద్యాలు పాడే అలవాటుండేది. ఎవరైనా చనిపోయినప్పుడు, దినాలప్పుడు ఆయన విధిగా వెళ్ళి భజనపాటలు పాడి వచ్చేవాడు. జీవి చావుపుట్టుకలు, ఆత్మ పరమాత్మలు, కాలం దాని మహత్తు గురించిన విషయాలుండేవందులో. అప్పుడపుడూ అటుగా నా ఆలోచనలు సాగేవి. ఆ క్రమంలో మార్మిక, తాత్త్వికపరమైన విషయాలను కొంత అధ్యయనం చేసాను. ఇంటర్, డిగ్రీ రోజుల్లో సీతాఫల్ మండీ శాఖా గ్రంథాలయం, ఆర్య సమాజ వైదిక గ్రంథాలయాల్లో కనిపించిన పుస్తకమల్లా చదివేవాణ్ణి అలా నాకు తాత్త్విక చింతన పట్ల కొంత అవగాహన కలిగింది. నా తొలి పుస్తకం అగ్నివసంతంలో కూడా కొన్ని కవితల్లో ఆ ఛాయలుంటాయి.
మీ రచనలను కేవలం కవిత్వానికే పరిమితం చేశారా? మరో ప్రక్రియలో ఏమైనా రచనలు చేశారా?
మొదటి నుండి నేను కవిత్వమే మాత్రమే రాసేవాడిని. ఎం.ఏ. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలను తెలుసుకోవడం వల్ల వ్యాసం, సమీక్ష రాయడం అలవర్చుకున్నాను. 2005 నుండే వివిధ పత్రికలలో సాహిత్యవ్యాసాలు, సమీక్షలు రాస్తుండేవాడిని. అనేక సాహిత్య సదస్సులలో పరిశోధనా పత్ర సమర్పణలు చేసాను. కొన్ని కథలను కూడా రాసాను అందులో ఒకటి 2005లో 'ఆంధ్రప్రదేశ్' మాస పత్రికలో అచ్చయింది. మరొకటి 2008లో 'ఆంధ్రభూమి' సచిత్రవార పత్రికలో అచ్చయింది. మిగతావి పత్రికలకు పంపలేదు, ఎందుకో ఆ దిశగా నా పయనం సాగలేదు. కవిత్వంలో కషి చేసినంతగా మిగతా ప్రక్రియలపైన శ్రద్ధ చూపలేకపోయాను.
మీ పరిశోధనాంశం తెలుగులో లఘుకవితారూపాలు - నానీలు కదా, ఒక్కపూస్తకంతోనే ఆపేశారు?
అవును నా పిహెచ్.డి. పరిశోధనాంశం నానీలపైనే. అయితే నేను పరిశోధనలో చేరక మునుపే నానీలు రాసాను. నా రెండవ పుస్తకం భావచిత్రాలు నానీలే. 2006లో ఒకప్పటి సీఫెల్(ఇఫ్లూ)లోని రష్యన్ ప్రోఫెసర్ వినరు తోతావర్ గారు మా ఆచార్యులు ఎన్.గోపీ గారి నానీలను రష్యన్ భాషలోకి అనువదించడానికి పూనుకున్నారు. ఆయన మాతభాష మరాఠైనా ఆయనకు తెలుగు అర్థమౌతుంది, మాట్లాడగలరు. అనువాదంలో ఏవైనా సందేహాలుంటే సాయపడమని గోపీగారు ఆదేశించారు. ఇఫ్లూ మా ఇంటికి దగ్గరే కావడం వల్ల వినరు తోతావర్ గారిని రోజూ సాయంత్రం కలిసేవాడిని. ఆ సందర్భంలో గోపీగారి నానీలను పదేపదే చదవడం తటస్థించింది. నానీల నిర్మాణం శైలీ, ప్రక్రియా పరమైన వైవిధ్యం, చిన్ని పద్యాలలో అనంతమైన కవితాశక్తిని అవి ఇముడ్చుకున్న విధానం నన్నాకర్షించాయి. ఆ విధంగా 9రోజుల వ్యవధిలోనే నానీలను రాసాను. ఆ తర్వాత రాసే ప్రయత్నం చేశాను కానీ ముందుకు సాగలేదు.
కవిత్వంపై మీ అభిప్రాయం
నేను బేసిగ్గా కవిత్వ లాలసుణ్ణి. నా దష్టిలో కవిత్వం అనిర్వచనీయ అమతాస్వాదనం. దాన్ని స్వయంగా చవి చూడాల్సిందే. గాలివాటుకు గమనాన్ని మార్చుకునే పతంగం నా మనసు. అది ఏ విధంగా స్పందిస్తే నేను ఆ విధంగా కవితలల్లాను. నాలో సంఘటనాశ్రయ కవిత్వం తక్కువ. యాంత్రిక స్పందనల వల్ల కవిత్వానికి ఒనగూరేది ఏమీ ఉండదని నా అభిప్రాయం. ప్రక్రియ ఏదైనా సరే, అది రాసింది ఎవరైనా సరే, అది కేవలం ఒక వాక్యమైనా గానీ అందులో కవిత్వముంటే చాలు నాకు ఆమోదమే. కవిత్వం ఎద అలుగును తన్నుకొని పారితేనే అందం, బలవంతంగా తూము తెరిస్తే ఏం ప్రయోజనం.
పురస్కారాలు ఏమైనా అందుకున్నారా? వాటి వివరాలు
డిగ్రీ ఫైనల్లో ఉండగా 2002 ఉగాది సందర్భంగా జంట నగరాల కవనవేదిక వారు నిర్వహించిన కవితా పోటీలలో మొదటిసారిగా బహుమతినందుకున్నాను. అప్పుడే ఆచార్య ఎన్.గోపీగారిని, ఆచార్య నాయని కష్ణకుమారి గారిని కలుసుకున్నాను. 2014లో 'భావ చిత్రాలు' కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి నామినేట్(ప్రపోజ్) అయ్యింది. 2014 డిసెంబర్ 29నాడు పత్రికలో ప్రచురితమైన మరో ఆకాశం కవిత చూసిన వెంటనే గోరటి వెంకన్న ఫోన్ చేసి మెచ్చుకోవడం, తనే స్వయంగా నా కవితను చదివి విన్పించడం నా వరకూ నాకు ఇదే గొప్ప పురస్కారంగా భావిస్తాను.
మీ విద్యార్థులు కూడా కవిత్వం రాస్తున్నారు కదా, మీరు వారికిచ్చే సందేశం?
విద్యార్థులు దాదాపుగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు బడిలో ఉండంగనే తెలుగు పట్ల, కవిత్వం పట్ల ఆసక్తి కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తెలుగు బోధకులకు ముందుగా నా అభినందనలు. మా పిల్లలు చదివేది సాంకేతిక విద్య అయినప్పటికి చక్కని కథలు, నవలలు, కవిత్వం రాసేవాళ్ళున్నారు. అయితే ఇప్పటికి వారి ఆలోచనా పరిధి చిన్నది. వారు గనక సాహిత్యరంగంలో ప్రవేశించాలనుకుంటే ఆ పరిధిని విస్తత పరచుకునే దిశగా వారు ప్రాచీనాధునిక సాహిత్యాలను, వాదాలను, ఉద్యమాలను, ధోరణులను, కొంత అధ్యయనం చేసి భాషాపర్ఞినాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తే రానున్న కాలంలో మంచి రచయితలుగా రాణిస్తారు.
మీ కవిత్వప్రస్థానం
నేను కవులను తయారుచేసే కర్మాగారాల్లోంచో, పోయెట్రీ సిలబసులు బోధించే బడుల్లోంచో, తమది తప్ప ఇతరులది కవిత్వమే కాదనే తత్త్వాన్ని ప్రొజెక్టు చేసే మతలబుల కవనమతాల్లోంచో నేను రాలేదు. నేను కవిత్వానికి తప్ప ఏ సిద్ధాంతాలకు కట్టుబడలేదు. నేను స్వేచ్ఛగా ఎదిగినవాణ్ణి, చిన్ననాటి నుండి కవిత్వాన్ని ఆస్వాదించడం తప్ప మరొకటి తెలియనివాణ్ణి. నాకు తెలియకుండానే నన్ను కవిత్వం వైపు మళ్ళించిన శక్తి మా నాన్నే. నాన్నది వెనకటికాలపు చదువు. చదివింది నాలుగో తరగతే అయినా దేవులపల్లి, శ్రీశ్రీ, సినారె, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర మొదలైన కవులను ఇష్టపడేవాడు. శ్రీశ్రీ అంటే వల్లమాలిన అభిమానం. ఆయన స్వయంగా పాటలు పాడేవాడు.ఆయన పాడుతూ పాడుతూ మధ్యలో సినీగేయాలను విశ్లేషించేవాడు. అమ్మ నాకు బాల్యం నుండే రామాయణ, మహాభారత, భాగవత గాథలను గోరుముద్దలను తినిపిస్తూ వినిపిస్తుండేది. 1993 నుండే మా జయక్క(చిన్నక్క)తో కలసి సినిమా పాటలకు పెరడికట్టేవాళ్ళం. ఆ అలవాటే నన్ను కవిత్వం వైపు మళ్ళించింది. 1995 నుండి ఏవేవో కవితలల్లి చిత్తుకాగితాలలో రాసుకొని దాచుకునేవాణ్ణి కానీ మొహమాటం వల్ల ఎవరికీ చూపించేవాణ్ణి కాదు. చిత్తుకాగితాలలో రాసి దాచుకున్న మా చినమామ చిట్టబోయిన వివేక్ సలహా మేరకు కవితలన్నింటిని డేట్ వైసుగా రికార్డు చేసాను. స్కూల్ రోజుల్లోంచే తురక పోరలతో సోపతుండేది. వాళ్ళు శేరోశాయరీ చెప్తుండే వారు. ఇంటర్, డిగ్రీ రోజుల్లో మమ్మాల ప్రవీణ్, కన్నం విజరు అనే బాల్యస్నేహితులతో కలసి శాయరీలను, రుబాయీలను, గజళ్ళను విపరీతంగా ఆస్వాదించేవాణ్ణి. ఆ ఉర్దూ కవితా గుబాళింపులకు గులాం నయ్యేవాణ్ణి. అప్పటికీ మీర్, గాలీబ్, ఖయ్యాం లంటే ఎవరో కూడా నాకు తెలియదు. కానీ వారి కవిత్వం నన్ను ఉల్లాసపరిచేది. అప్పుడే వర్డ్స్ వర్త్, షెల్లీ, బైరన్, కీట్స్ల గురించి కొంత తెలుసుకోగలి గాను. నా రొమాంటిక్ పోయేట్రీలో జీవముండడానికి ఈ అధ్యయనమే కారణమని భావిస్తాను. డిగ్రీలో మిత్రులు నన్ను 'కీట్స్' అని పిలిచేవారు. మా తెలుగు మాస్టర్ శ్రీ నోరి రాజేశ్వరరావు గారు ఏరా 'కష్ణ కవీ' అని అప్యాయంగా పిలిచేవారు. డిగ్రీలో ఉన్నప్పుడే మహాప్రస్థానాన్ని అధ్యయనపూర్వకంగా చదవడం జరిగింది. అది నా కవితను స్వతంత్రంగా నిర్మించుకో వడానికి తోడ్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో పి.జి. చదవడం పూర్వజన్మ సుకతమే. మా ఆచార్యులంతా విద్యార్థులను సొంతబిడ్డల్లా చూసేవారు. వారి ప్రోద్బలం, ప్రోత్సాహాలతోనే నేను ఎం.ఏ. ఫైనల్లో ఉండగానే తొలి కవితా సంపుటిని ఆవిష్కరించుకోగలిగాను. నేనివ్వాళ ఈ విధంగా మీ నిలబడగలిగానంటే అది కేవలం మా ఉస్మానియా తెలుగుశాఖ పుణ్యమే. ఏమీ తెలియనితనంతో ఉన్న నాకు ఈ అస్తిత్వానిచ్చింది మా ఆచార్యులే, వారి ఋణం తీరనిది. ఆ సమయంలో గంజి శశిధర్, బూర్ల చంద్రశేఖర్, జి.శ్రీలత మొదలైన మిత్రులు తోడుగా నిలిచారు.
- బి.మహేశ్
పరిశోధక విద్యార్థి,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి