Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చీపురు చెప్పేస్తుంది, విరిగిన మట్టిగాజులని
చూసి,నలిగి పోయిన మల్లెలమాలలను చూసి,
ఎన్ని ప్రణయ పరిమళపు జల్లులు
కురిసాయోనని,ఎన్ని మోజులు తీరయోనని,
గుప్పెడు మల్లెలు ప్రణయ యుద్ధంలో
నీకోసం చనిపోవడానికి సిద్ధం అవుతాయి.
ఆ రసకదనంలో నీ విజయదరహాసం కోసం
ప్రాణాలొడ్డి పోరాడతాయి.
బారెడుజడలో దూరిన మూరెడు మల్లెలు,
చేసే అల్లరి గుండెల్లో గుబులవుతుంది.
హద్దులు మీరిన ఆవేశాలన్నీ చల్లారిన
తరువాత, తెల్లటి చీరకొంగులో
సెద తీరుతుంది.
మన్మధుడు సైన్యంలో మల్లెలదే
ముందు వరుసలో ముఖ్యపాత్ర,
ఆ తరువాతే గులాబీలు, జాజులు,
విర జాజులు ఇతరత్రా.
ప్రకతి సష్టించే మాయలో పిసరంత
పువ్వుకు అంత శక్తి ఎవ్వడిస్తాడో.
గోరంత తెల్లదనానికి కూసింత
పరిమళపు అత్తరు చల్లి,రసరమ్య
యుద్ధానికి సిద్ధం ఎవరు చేస్తాడో.
మదనుడు రాజేసిన ఈ వహ్నిలో
తనువుల మధ్య అసువులు బాసిన
త్యాగధనులు ఈ బొండు మల్లెలు.
- ఉషారం
9553875577