Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో అనేక మంది యువతీ యువకులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో రకరకాల ఉత్పత్తులను సేవలను అందించేందుకు పరిశ్రమలు, సంస్థలు స్థాపించాలని కలలు కంటుంటారు. కానీ వారిలో చాలా మందికి ఆర్ధిక, సాంకేతిక సహకారాలతో పాటు, అలాగే సమాజం, ప్రభుత్వాల సహకారం కూడా దొరకకపోవడంతో వారి ఆలోచనలు, ఆశయాలు, ప్రతిభాపాఠవాలు అన్నీ మరుగునపడిపోతుంటాయి. అలాంటి అవరోధాలను అధిగమించి కొందరు విజేతలుగా నిలుస్తారు. చిన్న వయసులోనే వారి ఆలోచనలకు సజనాత్మకతను జోడించి ఎన్నో ఆవిష్కరణలు చేస్తారు..వారిలో కొందరి పరిచయమే ఈ వారం జోష్..
కింగ్ సిద్ధార్థ్
ప్రపంచంలోని 25 మంది యువ పారిశ్రామిక వేత్తలలో జాబితాలో స్థానం పెందిన వ్యక్తి కింగ్ సిద్ధార్థ్. పాఠశాలలో ఉన్నప్పుడే తన సజనాత్మకు పదునుపెట్టే చురుకైన ఉత్సాహం సిద్ధార్థ్ లో ఉండేది. అప్పుడే అతడు ఫ్రెండ్జ్ అనే ఆన్లైన్ మ్యాగజైన్ను ప్రారంభిం చాడు. తరువాతి సంవత్సరాల్లో చలనచిత్ర నిర్మాణంతో పాటు వెబ్సైట్ల గురించి విభిన్నమైన జ్ఞానాన్ని సంపాదించడంలో కూడా ఆసక్తిని పెంచుకున్నాడు. సిద్ధార్థ్ ప్రయాణం సాధారణ ఆకాంక్షలు గల యువతను బాగా అనుకరిస్తుంది. అతని పేరుకు హెడ్అవుట్, ఇన్స్టామోజో వంటి ఇతర వెంచర్లతో, కింగ్ సిద్ధార్థ్ ఖచ్చితంగా భారతదేశంలోని అగ్ర యువ పారిశ్రామికవేత్తలలో ఒకరు.
శ్రావణ్, సంజయ్ కుమారన్
భారతదేశంలో అతి పిన్న వయస్కులైన మొబైల్ అప్లికేషన్ ప్రోగ్రామర్లు
ఈ అన్నదమ్ములు. వాళ్లే దేశంలోని యువ పారిశ్రామికవేత్తలలో ఒకరైన శ్రావణ్, సంజయ్ కుమారన్లు. మొబైల్ అఫ్లికేషన్స్ డెవలపర్ గో డైమెన్షన్స్ వ్యవస్థాపకులు, కుమారన్ సోదరులు ఆండ్రాయిడ్, IOS ప్లాట్ఫారమ్ల కోసం అఫ్లికేషన్స్ను డెవలఫ్ చేయడం వారి 12, 10 సంవత్సరాల వయస్సులో ప్రారంభించారు. కన్స్యూ మర్ టెక్నాలజీ జాబితాలో, శ్రావణ్, సంజయ్ కుమారన్ ఇద్దరూ 2011లో ప్రారంభించిన వారి వెంచర్తో డిజిటల్ ప్రపంచానికి సరళమైన సాంకేతిక పరిష్కారాలను అభివద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా, కుమారన్ సోదరులు ఇప్పటికే 10కి పైగా అటువంటి అఫికేషన్స్ను డెవలఫ్ చేశారు.
రితేష్ అగర్వాల్
భారతదేశ జాబితాలో ప్రతి యువ పారిశ్రామికవేత్తలలో అగ్రస్థానంలో నిలిచే వ్యక్తి oyo వ్యవస్థాపకులు, సిఇఓ రితేష్ అగర్వాల్. దేశంలో టెక్ ఆధారిత బడ్జెట్ లో రూమ్స్ రెంట్ కు ఇచ్చే రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. గుర్గావ్ హౌటల్లో కేవలం 19 సంవత్సరాల వయసులో 11రూమ్స్ తో అగర్వాల్ ఈ సంస్థను 2012 లో స్థాపించారు. కానీ తన దూరదష్టితో పాటు సంస్థను నడుపే సామర్ధ్యాలతో అగర్వాల్ ఇప్పుడు భారతదేశం అంతటా దాదాపు 65000 హౌటళ్లలో సుమారు 5500 గదులకు oyo ఖాతా పరిధిలోకి తీసుకువచ్చారు. రితేష్ కాలేజీ డ్రౌపౌట్ అయినా థీల్ ఫెలోషిప్ పొందిన మొట్టమొదటి రెసిడెంట్ ఆసియన్ అతడు. రితేష్ అగర్వాల్ ఒరావెల్ స్టేస్ అనే బడ్జెట్ వసతి పోర్టల్తో ప్రారంభించాడు, బడ్జెట్ హౌటళ్ళను బుకింగ్ కోసం 2013లో తన కంపెనీ oyo రూమ్లుగా ప్రారంభించారు. విజేత బిజినెస్ వరల్డ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు మరియు ఫోర్బ్స్ 30 లోపు 30 జాబితాలో పేరు సాధించారు అగర్వాల్.
కృష్ణ మండ
అమెరికాలోని న్యూయార్క్లో నివాసముండే మల్కాజిగిరి యువకుడు కష్ణ మండ అద్భుతమైన స్మార్ట్ హెల్మెట్ టెక్నాలజీని అభివద్ధి చేశాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి న్యూయార్క్ వెళ్లిన కష్ణ.. స్మార్ట్ హెల్మెట్ని కనిపెట్టి 'ఫోర్బ్స్ 30 అండర్ 30'లో స్థానం సంపాదించు కున్నాడు. 2012లో ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లిన కృష్ణ మండ 2016లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెనక నుంచి వేగంగా వచ్చిన వాహనం కృష్ణ వెళ్తున్న బైక్ని ఢీ కొట్టడంతో అతని చెయ్యి విరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదనే ఆలోచనతో కష్ణ.. స్మార్ట్ హెల్మెట్ని కనిపెట్టాడు. వెనక నుంచి వచ్చే వాహనాన్ని కూడా గమనించే విధంగా ఈ హెల్మెట్ని రూపొందించాడు. లేటెస్ట్ సెన్సార్ టెక్నాలజీతో రూపొందించిన ఈ హెల్మెట్ని త్వరలో భారత్లో కూడా లాంచ్ చేసే ఆలోచనలో కష్ణ ఉన్నాడు.
ఐరాస గుర్తించిన శాస్త్రవేత్త హరినాథ్రెడ్డి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్కు చెందిన ఐరెడ్డి హరినాథ్రెడ్డి. హరినాథ్ది వ్యవసాయ కుటుంబం. కొవిడ్ నేపథ్యంలో హరినాథ్రెడ్డి.. రీబా కోరాతో కలిసి 'పోర్టబుల్ ఐసొలేషన్ పరికరం' రూపొందించారు. కరోనా సోకిన వారికి దీన్ని అమర్చితే వారి నుంచి వైరస్ బయటకు వెళ్లకుండా, బయటి వైరస్ రోగికి అంటకుండా ఉంటుంది. ఈ ఆవిష్కరణను ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ 'వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్' ప్రచురించి హరినాథ్కు మేటి ఆవిష్కర్తగా గుర్తింపునిచ్చింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం(డీఎస్టీ) నుంచి మరో కీలక ప్రాజెక్టు చేజిక్కించుకున్నారు. ఉపగ్రహాల్లో ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూళ్ల తయారీ ఈ ప్రాజెక్టు లక్ష్యం. హరినాథ్ తన ఆవిష్కరణలు సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలో గుర్తించే పరికరాన్ని కనుగొనేందుకు కీలక ఆవిష్కరణ చేస్తున్నారు. 'ఎయిర్క్రిస్ సైంటిఫిక్ టెక్నాలజీస్' అంకుర సంస్థ స్థాపనకు సిద్ధపడుతున్నారు. గుర్రపు డెక్కతో చెరువులు కలుషితమవుతున్న క్రమంలో సేంద్రియ ఎరువులతో దాన్ని నిర్మూలించే ప్రాజెక్టు చేపడుతున్నారు.
కోణం సందీప్
నల్గొండ జిల్లా కేంద్రానికి కోణం సందీప్(25) ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ రూపొందించినందుకు సందీప్కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను అత్యంత భద్రంగా రోగులకు వారి మాత భాషల్లోకి ఈ యాప్ తర్జుమా చేసి అందిస్తుందని సందీప్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన 30 అండర్ 30 జాబితాలో సందీప్ పేరును చేర్చింది. ఈ నెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది. 2018లో డా.శివరావ్తో కలిసి అమెరికాలోని పిట్స్బర్గ్లో అబ్రిడ్ పేరుతో హెల్త్కేర్ గ్రూప్ సంస్థను స్థాపించిన సందీప్.. వైద్యరంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు. ఇడుపులపాయ ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ చదివిన సందీప్.. అమెరికాలోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ విభాగంలో ఎంఎస్ పూర్తిచేశారు. పలు హెల్త్కేర్ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు. ఈ సందర్భంగా సందీప్ను తెలంగాణ మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.