Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రవాహం తన జీవన విధానం. పయనం తన జీవిత పాఠం. ఈ ప్రవాహంలో తనకు నచ్చనివి ఒడ్డున వదిలేస్తూ.. నచ్చినవి తనలో అంతర్భాగం చేసుకుంటూ.. తన జీవితాన్ని మరింత సారవంతం చేసుకుంది. గమ్యాన్ని కాదు గమనాన్ని ప్రేమించు అన్న వాస్తవాన్ని గ్రహిస్తూ పయనిస్తుంది. ఈ చిన్ని జీవితంలో చేసిన కొన్ని ప్రయాణాల్లో.. ఎందరో వ్యక్తులు, వారి మనస్తత్వాలు సన్నివేశాలు తనను ప్రభావితం చేశాయి. జీవితం ఒక చదరంగం అనే వాస్తవాన్ని తెలిపాయి. ఈ చదరంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఆటుపోట్లను తట్టుకొని తాన కాళ్లపై తాను నిలబడి తాను ఏ స్థాయి నుండి వచ్చానో అలాంటి పేద విద్యార్థుల ప్రగతి కోసం కషి చేస్తానంటున్న డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు పుర్ర జ్యోతి పయనం ఈ వారం జోష్..
ఒమూడేళ్ళ పాప గుక్కపట్టి ఏడుస్తోంది, అమ్మకు బాధ అనిపించినా కాని రెక్కడితేగాని డొక్కాడని కుటుంబం. కూలినాలికి వెళ్లి ఎంతోకొంత సంపాదిస్తేనే బతుకు బండి నడిచేది. పక్కనే ఉన్న గుడి పంతులు సహాయంతో తన ఐదేళ్ల బాబుతో పాటు ఆ మూడేళ్ల చిన్నారిని బడిలో చేర్పించారు ఆ తల్లిదండ్రులు. అలా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను ఆర్థిక ఇబ్బందులను చవిచూసింది. అట్టడుగు స్థాయి నుండి కష్టాలను అదిగమనించింది. కుటుంబంలో అప్పటికి చదువుకున్నవారు లేరు. అయినా పట్టుదలతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చదివింది. సాహిత్యం, కళలు, సాంస్కతిక రంగాలలో తన ప్రతిభ చాటింది.
తెలంగాణ విద్యార్థుల కలల సౌధం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ(తెలుగు) చదివింది. ఎంతోమంది స్పెషల్ తెలుగు విద్యార్థులు, పండిత పుత్రులు ఉన్నా అందరినీ అధిగమించి, యూనివర్సిటీ తృతీయ ర్యాంకు సాధించింది. అంతటితో ఆగలేదు తన గమ్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంది. అందుకోసం నిరంతరం పరితపించింది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(సంగారెడ్డి)లో తెలుగు అధ్యాపకురాలిగా ఉద్యోగం సాధించి తన కలను నిజం చేసుకుంది. కష్టాలను, సమస్యలను అధిగమించాలంటే అందుకు దఢ సంకల్పం ఉండాలి. అప్పుడే సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. తల్లి దుర్గమ్మ, తండ్రి పాపయ్య. ఇద్దరు మగ పిల్లలు కలిగాక సికింద్రాబాద్ కు వలస వచ్చారు. అక్కడే జ్యోతి జన్మించింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే, చూసుకునే వారు లేక పక్కనే ఉన్న గుడి పంతులు సహాయంతో మూడేళ్లకే ఆ చిన్నారిని తన అన్నయ్యతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆమె తన అన్న ఒకే తరగతి. పదవ తరగతి తర్వాత సికింద్రాబాదులో మారేడ్ పల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సిఈసిలో చేరింది. అక్కడే తన విజయ ప్రస్థానానికి పునాదులు పడ్డాయి. ఆ కాలేజీలోని తెలుగు అధ్యాపకురాలు స్వరాజ్యలక్ష్మి మేడం ప్రోత్సాహంతో చదువుతోపాటు కళలలో సాంస్కతిక కార్యక్రమాలలో ముందంజలో ఉండి తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుంది. వివిధ పోటీలలో వ్యాసరచన, వకృత్వం, నాటికలు, నాట్యం ఇలా ఒకటేమిటి అన్నింటిలోనూ మొదటి బహుమతి ఆమె సొంతం.
బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాంలో మొదటి లిస్టులోనే సీటు సాధించింది. అయితే తన స్నేహితురాలికి సీటు రాకపోవడంతో బీఏ తీసుకుందని తను కూడా బీఏ(ఈపీపీ)లో చేరింది. అక్కడే ఆమె జీవితం మరో మలుపు తిరిగింది. సిటీలో బీఏ చేసేవాళ్ళు చాలా అరుదు. అందులోనూ ఆమె తెలుగు మీడియం. బియ్యం ఎరుకోడానికే బీఏ చేస్తుందని అందరూ హేళన చేసేవారు. తన అన్నయ్య బీటెక్ చేస్తూ చదువులో ముందంజలో ఉంటూ మంచి భవిష్యత్తుకు నిర్మాణం చేసుకుంటుంటే... జ్యోతి ఇలా చేసిందని అందరూ అవమానించే వారు. అయినా కూడా ఈ బీఏ తోనే మంచి భవిష్యత్తును సాధిస్తానని గుండె ధైర్యంతో ముందుకు సాగింది. ఒకపక్క కళాశాల యూనియన్ మెంబర్గా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటూనే.. మరోపక్క డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తతీయ సంవత్సరాలలో మొదటి ర్యాంకు సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. పొలిటికల్ సైన్స్ విభాగంలో కళాశాల స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. కళాశాల స్థాయిలో తెలుగు విభాగంలో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. ఆ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలు లలితవాణి మేడం ప్రోత్సాహమే తనకు కొత్త జీవితాన్ని, విజయాలను అందించింది అని జ్యోతి సగర్వంగా చెబుతోంది. ఆమెను ఒక కూతురుల చూసేవారు.. ప్రతి క్షణం తన జీవితంలో గెలవాలి అనే సంకల్ప బలాన్ని ఇస్తూ వచ్చారు..
2012లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జీవవైవిద్య పోటీలలో ప్రథమ స్థానం కైవసం చేసుకొని జిల్లా కలెక్టర్ ముందు ప్రదర్శన ఇచ్చి మొదటి స్థానాన్ని పొంది అందరిచేత మన్ననలు పొందింది. సిటీ కళాశాల తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిపే పోటీలలో ప్రతిష్టాత్మకంగా అందించే ఆవత ఫలకం ప్రతి సంవత్సరం వరుసగా జ్యోతి కైవసం చేసుకుంది. రవీంద్రభారతి లోనూ దేశవ్యాప్తంగా అనేక కళాశాల విద్యార్థులతో పోటీపడి మొదటి స్థానాన్ని సంపాదించి నగదు బహుమతి పొందింది. ఇలా చెప్పుకుంటే మరెన్నో మరెన్నో విజయాలు ఆమె సొంతం. పోటీకి వెళ్తే బహుమతి రావాల్సిందే. చదువుతోపాటు, నాటికలు ప్రదర్శించడం తనకు చాలా ఇష్టం అంటోంది జ్యోతి. ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు ఎన్నో నాటికలలో అభినయించి తనదైన ముద్రను వేసుకున్నది. నాటికలే కాకుండా మహిళలు అంతగా మొగ్గు చూపని ఏకపాత్రాభినయంలో కూడా తన సత్తా చాటింది. రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, పల్లెపడుచు, తెలంగాణ తల్లి ఇటువంటి స్త్రీ పాత్రలే కాకుండా శ్రీకష్ణదేవరాయలు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, భీముడు మొదలైన పురుష పాత్రలతో కూడా ఏకపాత్రాభినయం చేసి అందరి మన్ననలు అందుకుంది. ఏ పాత్ర అయినా ఒదిగిపోయి ఆ పాత్రకు జీవం ఉట్టి పడేలా చేయడం జ్యోతి ప్రత్యేకత. తన జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటూ.. 'ఒకనాడు డిగ్రీ కాలేజీకి నాక్ టీం సందర్శించినప్పుడు జరిగిన కార్యక్రమంలో మా కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల ఉత్తమ విద్యార్థిగా నా పేరు ప్రకటించడం ఎన్నటికీ మర్చిపోలేను. ఎన్నో వందల మందిని దాటుకొని ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులను దాటుకొని ఉత్తమ విద్యార్థి బహుమతి పొందడం ఎన్నటికీ మర్చిపోలేను అనుభూతి నాకు. అలా గురువుల ప్రోత్సాహంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ(తెలుగు) సీటు సాధించాను. ఇదే నా జీవితంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల తెలుగు విభాగం ఆచార్యులు సూర్య ధనంజయ్, ప్రొఫెసర్ గోనానాయక్, సాగి కమలాకర శర్మ వంటి ఆచార్యుల సహకారంతో తెలుగు భాష పై మక్కువ మరింత పెరిగి, భాషపై పట్టు సాధించింది. తన బహుముఖ ప్రజ్ఞ చాటుకునేందుకు ఓయూ ఒక గొప్ప వేదికగా ఉపయోగపడింది. షరా మామూలుగానే చదువుతోపాటు సాంస్కతిక కార్యక్రమాలలో చోట పాకెట్ బడా ధమాకాగా పేరుగాంచింది. అలా అన్ని అంశాలలో ముందుంటూ స్పెషల్ తెలుగు, తనకంటే ముందు ఉన్న ఎందరినో అధిగమించి పట్టుదలతో విశ్వవిద్యాలయంలో తృతీయ స్థానము, మహిళలలో మొదటి స్థానం దక్కించుకోవడం జ్యోతి పట్టుదలకు నిదర్శనం. అనంతరం 2015 సంవత్సరంలో దశరథ్ తో వివాహం జరిగింది. అయినా జ్యోతి దష్టంతా చదువుపైనే. తల లక్ష్యం గుర్తొచ్చి నిద్రపోయేది కాదు. వివాహం జరిగినా నిరంతరం సాధన చేస్తూ జనరల్ కేటగిరిలో సెట్,నెట్ సాధించింది.ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు తన లక్ష్య సాధన, ఇంకోవైపు చిన్న బాబు. అయినా తన పట్టుదలను విడువలేదు. ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు వచ్చినా కుంగిపోలేదు. వివాహం తరువాత కూడా బోధనా వృత్తి పైన ఉన్నటువంటి అపారమైన ఇష్టంతో పాటు భర్త సహాకారంతో బి.ఎడ్లో చేరి అక్కడ కూడా ప్రధమ స్థానం సాధించింది. ప్రాక్టికల్స్ సమయంలో బయటి కళాశాల నుండి వచ్చిన ఎగ్జామీనర్ కూడా పాఠం చెప్పే విధానం పరిశీలించి ప్రశంసించారు. అనంతరం పద్యాలు పాడించుకుని విన్నారు. నువ్వు ఖచ్చితంగా ఒక మంచి టీచర్ అవుతావ్ అమ్మా అన్నారు. ఆ మాటలు ఎప్పటికి తాను మర్చిపోలేను అంటున్నారు. మూడవ సెమిస్టర్ చదువుతున్న సమయంలోనే తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. ఒక వైపు కుటుంబం బాధ్యతలు చూసుకుంటూ బి.ఎడ్ పరీక్షలకు సిద్ధమ వుతూ... డిఎల్ కోసం కష్టపడి చదివింది. ఇంటి పని చేసుకుంటూ తన బాబుకు ఒక చేత్తో అన్నం తినిపిస్తూ, మరో చేత్తో పుస్తకం పట్టుకుని చదివేది ఆమె. ఆమె శ్రమ వృధా కాలేదు. డిఎల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. నా కల నెరవేరింది. నాలా వివాహం జరిగిన తర్వాత కూడా చదువు పైన ఇష్టం కలిగిన వారికి, పేద విద్యార్థులకు ఉన్నత శిఖరానికి వెళ్లేందుకు పునాదులు వేయడంతో తన జన్మ సార్థకం అయింది అంటున్నారు జ్యోతి. తనకు లభించిన ఈ గొప్ప అవకాశం మరో జన్మగా భావించి తన విద్యార్థులను కూడా చక్కటి బాటలో నడిపించి... కేవలం పాఠాల జ్ఞానమే కాకుండా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలులుగా తన విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. వీరు బోధించిన పాఠాన్ని కేవలం ఒక పాఠం లాగా కాకుండా నాటికలు, పాటల రూపంలోకి మలిచి విద్యార్థుల చేత తరగతిగదిలో ప్రదర్శన చేయిస్తారు. ఈ విధంగా బోధనా రంగంలో వినూత్నమైన విధానాన్ని అవలంభించేందుకు గిరిజన సంక్షేమ అధికారులు శర్మ గారు, పద్మావతి గారు ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి హదయపూర్వక కతజ్ఞతలు తెలియజేశారు. తనకిష్టమైన అంశాలను గురించి చెప్తూ.. 'నాకు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం. చిన్ననాటి నుండే గత సంవత్సరం వాడిన కుండలను, విరిగిపోయిన బకెట్లను, పాస్టిక్ బాటిల్లను తొట్టిలలాగా ఉపయోగించి ఎన్నో రకరకాల పువ్వుల మొక్కలను, తీగలను, పెంచేది. మిరప, చింతకాయ, టమాట, కాకరకాయ మొదలైన కూరగాయల మొక్కలతో, తీగలతో ఒక మినీ పార్కుల ఇంటి ముందు ప్రదేశాన్ని తయారు చేశాను. దేవుడిని పూజించడానికి పువ్వులు ఏ రోజు కొనలేదట వాళ్ళ అమ్మ. ఆ వీధివారు కూడా తీసుకెళ్ళేవారట. కాని ఆమె మనసు పువ్వులు తెంపడానికి అసలు అంగీకరించేది కాదు. వివాహం జరిగాక కూడా అత్తారింటికి వెళ్లే ముందు అమ్మ తర్వాత ఆ మొక్కలను పట్టుకొని ఏడుస్తూ బాధ పడ్డాను.... మొక్కలతో ఒక బంధుత్వాన్ని ఏర్పర్చుకొని ఒక కుటుంబంల భావించాను' ఆమె చెప్పారు. జ్యోతే కాదు ఆమె అన్నయ్య జీవితం కూడా ఆదర్శమే. చిన్నప్పటినుండి తెలుగు మీడియం చదివిన, ఐబిఎం వంటి అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించి ఉత్తమ ఉద్యోగి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వీరు జీవితం పేదింట్లో పుట్టి, ప్రభుత్వ బడిలో చదివి ఒక ఉన్నత స్థాయిలో నేడు ఉండి చక్కటి భవిషత్తు నిర్మాణానికి లక్షలు పోసి చదివించే వారికి ఒక మేలుకొలుపు.... ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న ఎంతో మంది విద్యార్థులకు ఒక మార్గదర్శకం వీరి జీవితం. ఇక సాహిత్యం విషయానికి వచ్చినట్లయితే అంతర్జాతీయ జాతీయ సదస్సులలో పాల్గొంటూ... డిసెంబర్-19లో తెలంగాణ సాహితి నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో 'తిరుపతి వెంకట కవులు' అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. తనదైన ప్రతిభ చాటుతున్నారు. ఇప్పటి వరకు 15 నాటికలు రాశారు. వీటితో రాస్తూ త్వరలో గ్రంథ రూపంలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. సాహిత్య రంగంలో ఇప్పుడిప్పుడే మొదటి అడుగులు వేస్తున్నారు. సాహిత్య రంగంలో కూడా తనదైన ఒక ముద్రను వేసుకోవాలని ఆశిస్తున్నాను అంటున్నారు జ్యోతి.
భవిష్యత్తు లక్ష్యం
విద్యార్థులను కేవలం ఉన్నత చదువు వరకు మాత్రమే కాకుండా వారు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడే వరకు కూడా వారికి తోడ్పాటు అందిస్తాను అంటుంది. ముఖ్యంగా వివాహం జరిగిన తర్వాత కూడా ఉన్నత విద్యలు అభ్యసించేలా స్త్రీల ప్రగతికి బాటలు వేస్తానంటున్నారు. తన తల్లి, గురువులు, భర్త, కుమారుడు చదువు విషయంలో ఎంతో సహకరించారు. మరి ఆ సహకారం కూడా లభించని వారు ఎందరో ఈ సమాజంలో ఉన్నారు వారి కోసం భవిష్యత్తులో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేస్తానని అంటూ తన అంతరంగాన్ని వెల్లడించారు. గురువులకు సరైన గౌరవం ఇవ్వలేని ఈ రోజుల్లో డిగ్రీ స్థాయి విద్యార్థులు అమ్మ అని పిలుస్తున్నారంటే ఆ మాటల్లోనే అర్ధం చేసుకోవచ్చు వారి గొప్పతనం. ఉద్యోగం సంపాదించిన ఒక సంవత్సరంలోనే మొత్తం గిరిజన సొసైటీ తరపున MERAKl- 2020 కార్యక్రమానికి మెంటర్ గా ఎంపిక అయి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వివిధ పోటిలలో విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందారు. ఇలాంటి విజయాలు మరెన్నో.... కళాశాల విజిట్ కి వచ్చిన RC రమేష్ గారు ఆమె గురించి ప్రిన్సిపాల్ గొప్పగా చెప్పడం విని వారి ముందు ఏకపాత్రాభినయం చేయమన్నారు. ఈమె చేయడంతో ఒక్కసారిగా చప్పట్ల వర్షము కురుసింది. నీ వంటి అధ్యాపకులు ఉండటం సంగారెడ్డి అదష్టం అన్నారు. ఆ మాటలు తాను ఎన్నటికి మరిచిపోలేను అన్నారు. గత సంవత్సరం సంగారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ అచ్యుతం గారు కూడా ఎంతగానో ప్రశంసించే వారు. గురువుల చేత వెలిగిన జ్యోతి జీవితం అందరికి వెలుగును పంచె దీపం.