Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజురోజుకు పెట్రోల్, డిజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఈ-బైక్ల వైపు యువత ఆశగా ఎదురు చూస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ వాహనం.. కరెంట్తో నడుస్తుంది.. నెమ్మదిగా వెళ్తుంది.. శబ్ధ, వాయు కాలుష్యానికి చెక్ పెడుతుంది.. పర్యావరణ హితం. అందంగా ఉండే ఈ-బైక్పై హుందాగా పయనించొచ్చు. ఇప్పుడిదే నయా ట్రెండ్..
ఇప్పుడు ఈ-బైక్ల వినియోగమూ పెరుగుతోంది. సింగరేణి కార్మికులు, రైతులు, మహిళలు, అధికారులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు ప్రత్యేకంగా షోరూమ్ కూడా ప్రారంభం అవుతున్నాయి. పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ధర, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్, ఇతర మరమ్మతుల ఖర్చు కారణంగా ఈ-బైక్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వద్ధులకు, మహిళలకు ఎంతో ఉపయోగపడే విధంగా వివిధ కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఈ-బైక్ ఒకసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించవచ్చు.