Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని, తలస్నానాలు చేసి, తొందర తొందరగా ఆఫీసులకు వెళ్లిపోతాం. ఒక్కోసారైతే ఇవేమీ పట్టించుకోకుండా గాబరాగాబరాగా పనుల్లోకి పరుగులు తీస్తాం. దీనివల్ల మన ఆరోగ్యానికి ప్రమాదమే కాకుండా, మనం చేస్తున్న పనులలో సామర్థ్యాన్ని కూడా కోల్పోతున్నాం. కాబట్టి మన ఆలోచనలను, పనిచేసే విధినిర్వహణలలో అప్పుడప్పుడూ కొన్ని మార్పులు చేసుకుంటే చాలా మంచిది. అవేవో ఒకసారి చూద్దాం....
దినచర్యల్లో కొన్ని మార్పుల వల్ల మన సామాజిక ద క్పథం పెరగడమే గాక ప్రతి ఒక్క విషయంలో చురుకుగా పాల్గొంటామని సూచిస్తున్నారు నిపుణులు. దీనికితోడు మనం పనిచేసే వాతావరణం, పరసరాలను బట్టి మనం చేసే పనులలో కూడా మార్పు వుంటుందని నిపుణులు చెబుతున్నారు. మనం పని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే.. మన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
నిబంధనలు పెట్టుకుంటే
మనం ఆఫీసులలో చాలావరకు 8 నుండి 10 గంటలవరకు సమయాన్ని కేటాయిస్తుంటాం. ఆ సమయాలలో చేసే పనిని ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేసుకోవాలని నిబంధన పెట్టుకుంటే... అప్పుడు మనలో వున్న సామర్థ్యం మరింతగా పెరుగుతుందంటున్నారు. ఇలా చేయడం ద్వారా మనం మన పనిగంటల్ని ఇంకా తక్కువ చేసుకోవచ్చు.
విశ్రాంతి లభిస్తుంది
మనకు అప్పగించిన పనిని తక్కువ సమయంలో పూర్తి చేసుకోవడం ద్వారా మనకు మిగిలిన సమయం ఆదా అవుతుంది. దాంతో కొంచెం విశ్రాంతి కూడా లభిస్తుంది. దీనివల్ల మెదడు కొంచెం రిలీఫ్ అయి, మనలో వున్న సామర్థ్యాన్ని పెంపొదిస్తుంది.
మెదడు చురుకౌతుంది
ఉదయాన్నే లేవగానే అరగంటసేపు వ్యాయామం చేసుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని సలహా ఇస్తున్నారు నిపుణులు. దీంతో మనం కూడా మనం చేసే కార్యాకాలపాలలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ఏకాగ్రతగా నిర్వహించుకోవచ్చు.
పరిశోధించి చెబుతున్నారు
అలాగే ఉదయాన్నే లేచి మనం ఇష్టారాజ్యంగా, అదేపనిగా వార్తలు చదవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెదడు కూడా మన శరీరంలో ఒక భాగమే. అది కూడా నిరంతరం పనిచేస్తూ వుంటుంది. దానికంటూ విశ్రాంతి కావాలి. ఉదయాన్నే లేవగానే న్యూస్ చదవడం వల్ల ఆ ప్రభావం మన మానసిక స్థితిపై ప్రభావం పడొచ్చంటున్నారు. మెదడుకు ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా రిలీఫ్ కోసం కాస్త వ్యాయామం చేసుకోవాలని, ఆ తర్వాతే మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు.