Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తినే తిండి కలుషితం.. తాగే నీరు కలుషితం.. పీల్చే గాలి కాలుష్యభరితం.. వీటి కారణంగా అనారోగ్యం పాలు కావడంతో పాటు మానసికఒత్తిడి పెరుగుతుందని శాస్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం ఎన్నో రకాలుగా మానవ జీవనంపై ప్రభావం చూపిస్తున్నది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి పర్యావరణ హితమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సైక్లింగ్తో గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతుంది భాగ్యనగరం. చాలా రకాల పొల్యూషన్లకు సైక్లింగ్ సోల్యూషన్ అంటూ వేలాది మందితో సైకిళ్ళపై రివ్వున దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డు కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించే గిన్నిస్ రికార్డు కోసం ఈరోజు వందలాది మందితో మాక్ రైడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్తో ముఖాముఖీ..
సైక్లింగ్తో గిన్నిస్ రికార్డు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
సైక్లింగ్ అనేది నాకు ఎంతో ఇష్టమైన వ్యాయామం. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు పాజిటివ్నెస్ను పెంచుతుంది. ప్రస్తుతం మన నగరంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. సైక్లింగ్ వల్ల శారీరక వ్యాయామంతో పాటు మానసికఉల్లాసం కలుగుతుంది. ఆర్థికంగా ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.
సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడానికి గిన్నిస్ రికార్డు ద్వారా అవగాహన మరింత పెంచాలనుకుంటున్నాం. కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ రైడింగ్ ఓ మార్గంగా ఎంచుకుని ప్రజల్లో చైతన్యం తేవాలన్నదే మా ప్రయత్నం.
హెచ్జీసీని ఎప్పుడు ప్రారరభిరచారు?
సైక్లింగ్పై అవగాహన పెంచడానికి 2016లో హెచ్సిజి(హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్)ను ఏర్పాటు చేశాం. ముగ్గురితో ప్రారంభమైన ఈ గ్రూప్లో ఈ రోజు ఐదువందల మంది సభ్యులుగా ఉన్నారు. ఎక్కడ ఈవెంట్స్ జరిగినా మా గ్రూప్ మెంబర్స్ తప్పనిసరిగా పాల్గొంటున్నారు. రన్నింగ్, సైక్లింగ్లో ఎన్నో అవార్డులు అందుకున్న ఎం. లక్ష్మణ్ రెడ్డిగారు ఎంతో సహకారం అందిస్తున్నారు. మా గ్రూప్లో ఐటి ఉద్యోగులు, డాక్టర్లతో పాటు డిసెబుల్డ్ వారు కూడా ఉన్నారు.
మీరు స్పోర్ట్స్ పర్సన్ కదా! సైక్లింగ్ వైపు ఆసక్తి ఎలా కలిగింది?
నిజమే. నేను స్కూలు స్థాయి నుంచి హాకీ పోటీల్లో జాతీయస్థాయిలో ఆడాను. మా నాన్న రాజేందర్గారు. ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి. ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో హాకీ ఆడారు. మా బాబాయి కూడా హాకీ ప్లెయర్. నాకు చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే ఇష్టం. స్కూలుకు, కాలేజీకి, హాకీ ప్రాక్టీస్కు కూడా సైకిల్పైన వెళ్ళేవాడిని. నూదీజలో జాబ్ చేసే సమయంలో సైక్లింగ్ రిప్రజెంటివ్గా ఉన్నాను. ఆ తర్వాత డెకథాన్లోనూ పనిచేశాను. సైక్లింగ్పై అందరిలోనూ అవగాహన పెంచాలన్న లక్ష్యంతో అనేక రైడ్స్ నిర్వహించాం.100 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై 3గంటల 20 నిమిషాల్లో పూర్తి చేశాను.ప్పుడు మా గ్రూప్లో ఇలాంటి రికార్డులు చేసిన వారు ఎక్కువగా ఉన్నారు. గిన్నిస్ రికార్డు ద్వారా పర్యావరణ పరిరక్షణకు, మానసిక ఉల్లాసానికి సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలనుకుంటున్నాం.