Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 సీజన్ యుఏఈలో జరుగనుంది. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారికంగా ఈవిషయాన్ని వెల్లడించనుంది. 51 రోజుల్లో 60 మ్యాచుల నిర్వహణకు బీసీసీఐ షెడ్యూల్ రూపకల్పన చేసింది. దుబారు, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్ మ్యాచులకు ఫిక్సింగ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు. 'ఐపీఎల్ యుఏఈలో మూడు వేదికల్లో జరుగుతుంది. భారత్లో ఎనిమిది నగరాల్లో జరిగేది. మూడు వేదికల్లో అవినీతి నిరోధక మానిటరింగ్ సులువు కానుంది. తుది షెడ్యూల్ వచ్చిన తర్వాత పని కార్యాచరణ రూపొందిస్తాం. ఏ విధమైన బయో సెక్యూరిటీ విధానాలను రూపొందిస్తామో ఇప్పుడే చెప్పటం పొరపాటు అవుతుంది. అక్కడ ఏసీయూకి మరింత సిబ్బంది అవసరం అని భావిస్తే యుఏఈలోనే నియమించుకుంటాం. ఓ ప్రయివేట్ లీగ్కు ఏసీయూ అధికారుల అవసరం కోసం ఐసీసీని సంప్రదిస్తే, వారు అందుకు అంగీకరిస్తే అందుకు అయ్యే ఖర్చును భరిస్తే సరిపోతుంది. బుకీలు, ఫిక్సర్లు అందరూ ఇంటర్ కనెక్టింగ్ వ్యవస్థ. మా వద్ద సమాచారం ఉంటే, వారు ఏ విధంగా పనిచేస్తారనే విషయం కూడా తెలుస్తుంది. ఐపీఎల్ తుది షెడ్యూల్, వేదిక ఖరారు అయిన తర్వాత ఏసీయూ ప్రణాళిక రూపొందిస్తాం' అని అజిత్ సింగ్ తెలిపాడు.