Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ అనుమతే తరువాయి
దుబాయ్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఖాళీ స్టేడియాల్లో, అభిమానులు లేకుండా జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. యుఏఈ ప్రభుత్వం అనుమతిస్తే అభిమానులకు ప్రవేశం కల్పిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ చెప్పగా.. తాజాగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ముబాషిర్ ఉస్మాని అదే విషయాన్ని వెల్లడించాడు. ' భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పూర్తి స్టాండర్డ్ అపరేటివ్ ప్రొసీజర్స్తో యుఏఈ ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. ఐపీఎల్ను మా అభిమానులు ఆస్వాదించాలని మా భావన. కానీ ప్రభుత్వ నిర్ణయమే అంతిమం. 30-50 శాతం సామర్థ్యం సీట్లతో అభిమానులను అనుమతించేందుకు చూస్తున్నాం. మా ప్రభుత్వం అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాం. ఐపీఎల్కు మరో ఏడు వారాల సమయం ఉండటంతో మరింత మెరుగైన వాతావరణం ఉంటుందని భావిస్తున్నాం' అని ఉస్మాని తెలిపాడు.