Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పివి. సింధు సహా 8 మంది అథ్లెట్లు హాజరు
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం నుంచి ఎనిమిది మంది ఒలింపిక్ క్రీడాకారుల కోసం బ్యాడ్మింటన్ జాతీయ శిబిరాన్ని తిరిగి ప్రారంభించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి క్రీడా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అకాడమీలో తిరిగి శిక్షణ పొందబోయే ఎనిమిది మంది అథ్లెట్లలో పివి సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్ కిడాంబి, అశ్విని పొన్నప్ప, సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ఎన్ సిక్కి రెడ్డి ఉన్నారు. శిక్షణ సమయంలో అథ్లెట్లు పూర్తి భద్రత పాటించే విధంగా, భౌతిక దూరం పాటించేందుకు అకాడమీని కలర్ జోన్లుగా విభజించారు. ఈ సమయంలో సహాయక సిబ్బంది, పరిపాలనా సిబ్బందికి కోర్టులోకి ప్రవేశం లేదు.ఈ సందర్భంగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ఈ సుదీర్ఘ విరామం తర్వాత తమ షట్లర్లను తిరిగి ఆన్-ఫీల్డ్ శిక్షణ కోసం తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సురక్షితమైన వాతావరణంలో శిక్షణను తిరిగి ప్రారంభించడానికి తాము పూర్తిగా సన్నద్ధమయ్యామని తెలిపారు.