Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రతిష్టాత్మక యూ ఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలు గుతున్న స్టార్ క్రీడాకారుల సంఖ్య పెరుగు తోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ఇప్పటికే ఈ మెగా ఈవెంట్కు దూరమయ్యారు. తాజాగా మహిళల సింగిల్స్ జాబితాలో ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో ర్యాంకర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) సైతం చేరారు. 'సురక్షిత వాతావరణంలో యూఎస్ ఓపెన్ను నిర్వహించేందుకు నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను నేను గౌరవిస్తున్నాను. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరి కాకు ప్రయాణించి నాతోపాటు నా సహాయక సిబ్బందిని ప్రమాదంలో నెట్టాలని భావిం చడంలేదు' అని గత ఏడాది యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరిన స్వితోలినా వ్యాఖ్యానించింది. 'కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముందుగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని మా దేశ ప్రధాని కోరారు. దాంతో నాకిష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ క్లే కోర్టు టోర్నీకి సన్నాహాలు దెబ్బతింటాయి' అని కికి బెర్టెన్స్ వ్యాఖ్యానించింది.