Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు ఆటగాళ్లకు పాజిటివ్
బెంగళూర్: హాకీ ఇండియాలో కరోనా వైరస్ కలవరం. బెంగళూర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సారు) సెంటర్లో శిక్షణ శిబిరానికి వచ్చిన ఆటగాళ్లలో ఇప్పటివరకు ఏడుగురు కోవిడ్19 పాజిటివ్గా తేలారు. కరోనా మహమ్మారితో హాకీ ఆటగాళ్లు క్యాంప్ నుంచి ఇండ్లకు వెళ్లారు. ఇప్పుడు ఆగస్టు ఆరంభంలో సారు సెంటర్లో శిక్షణ శిబిరానికి హాకీ ఇండియా షెడ్యూల్ చేసింది. అందుకోసం ఆటగాళ్లు ఇండ్ల నుంచి సారు సెంటర్కు చేరుకుంటున్నారు. ఇంటి నుంచి వచ్చిన మన్దీప్ సింగ్ తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డాడు. హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, డిఫెండర్ సురెందర్ కుమార్, జస్కరన్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్ కీపర్ క్రిష్టన్ బహదూర్ పాఠక్లు సైతం కోవిడ్19 పాజిటివ్గా తేలారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ సారు ఐసోలేషన్లో ఉంచింది. మిగతా క్రికెటర్లను క్వారంటైన్ చేసింది. క్వారంటైన్ అనంతరం మళ్లీ పరీక్షలు నిర్వహించి ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇవ్వనుంది. కరోనా పాజిటివ్ కేసులతో జాతీయ శిక్షణ శిబిరాన్ని హాకీ ఇండియా నెల రోజుల పాటు వాయిదా వేసింది.