Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థామస్, ఉబర్ కప్లపై సైనా నెహ్వాల్
హైదరాబాద్ : అక్టోబర్లో డెన్మార్క్ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక థామస్, ఉబర్కప్లపై భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అనుమానాలు వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో థామస్ ఉబర్కప్ టోర్నీలకు తమ జట్లను పంపలేమని ఆరు దేశాలు టోర్నీ నుంచి వైదొలిగాయి. 13 సార్లు థామస్ కప్ విజేత, మూడుసార్లు ఉబర్ కప్ విజేత ఇండోనేషియా సైతం ఈ జాబితాలో ఉంది. దక్షిణ కొరియా, థారులాండ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, తైవాస్, సింగపూర్, హాంగ్కాంగ్లు సైతం థామస్, ఉబర్ కప్లో పాల్గొనటం లేదు. కుటుంబ కారణాల రీత్యా అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు సైతం తొలుత థామస్, ఉబర్ కప్లో ఆడలేనని తెలిపింది. కానీ బారు అధ్యక్షుడు జోక్యంతో సింధు ఆడేందుకు అంగీకారం తెలిపింది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు షరవేగంగా పెరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ టోర్నీల్లో షట్లర్ల ఆరోగ్య భద్రతపై ఎటువంటి హామీ లేదు. దీంతో థామ స్, ఉబర్ కప్లలో ఆడేందుకు షట్లర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ ట్విట్టర్లో థామస్, ఉబర్ కప్లపై ప్రశ్నించింది. ' థామస్, ఉబర్ కప్ల నుంచి ఏడు దేశాలు వైదొలిగాయి. కరోనా మహమ్మారి కఠిన పరిస్థితుల్లో థామస్, ఉబర్ కప్ల టోర్నీలను నిర్వహించటం సురక్షితమేనా?' అని సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది.