Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ అర్హత రెండోరౌండ్ పోటీలో అంకిత రైనా ఓటమి పాలైంది. గురువారం జరిగిన మహి ళల సింగిల్స్ రెండోరౌండ్ పోటీలో అంకిత 3-6, 2-6 తేడాతో కురుమి నార(జపాన్) చేతిలో పరాజయాన్ని చవిచూసింది. కురుమి బలమైన ఫోర్హ్యాండ్ షాట్ల ముందు అంకిత నిలువలేక వరుససెట్లలోనే ఓడింది. ఇరువురు క్రీడాకారిణుల మధ్య ఈ మ్యాచ్ 1గంటా 21 నిమిషాలసేపు సాగింది. అంతకుముందు తొలి రౌండ్ పోటీలో అంకిత 6-4, 4-6, 6-4 తేడాతో లోవిక్(సెర్బియా)ను ఓడించి రెండోరౌండ్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ పురుషుల, మహిళల సింగిల్స్లో ఈసారి భారత్కు ప్రాతినిధ్యం లభించనట్లైంది.