Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ఐపీఎల్లో వేగంగా 2వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మన్గా రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. బెంగళూరుపై వ్యక్తిగత స్కోర్ రెండు పరుగుల వద్ద రాహుల్ 2వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. అత్యంత వేగంగా రెండు వేల పరుగులు చేసిన రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ ఫీట్ సాధించడానికి టెండూల్కర్ 63 ఇన్నింగ్స్ తీసుకోగా.. రాహుల్ 60 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.