Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్కత నైట్రైడర్స్తో నేడు ఢీ
- మరో మ్యాచ్లో ముంబయి, పంజాబ్ ఢీ
అబుదాబి (యుఏఈ)
ఐపీఎల్ 2020 ద్వితీయార్థంలోకి అడుగుపెట్టింది. ప్రథమార్థంలో తుది జట్టు కూర్పు, ప్రణాళికల ఖరారుకే కొన్ని జట్లు ఇబ్బంది పడ్డాయి. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది మ్యాచుల్లో 3 విజయాలు సాధించగా.. కోల్కత నైట్రైడర్స్ ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించాయి. సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించుకోగా.. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే ఇయాన్ మోర్గానకు చుక్కెదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో పోటీ తీవ్రం అవుతున్న దశలో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక విజయంపై కన్నేసింది. ప్రతి మ్యాచ్నూ చావోరేవోగానే భావిస్తోన్న ఆరెంజ్ ఆర్మీ నేడు బిగ్ హిట్టర్ల కోల్కతను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. రెండు జట్లు సమస్యలకు పరిష్కారం కోసమే అన్వేషిస్తున్న తరుణంలో నేడు అబుదాబిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. సీజన్లో తొలి మ్యాచ్లో సన్రైజర్స్పై కోల్కత గెలుపొందింది. మరీ వార్నర్సేన మోర్గాన్ బృందంపై ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా) :
కోల్కత నైట్రైడర్స్ : శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), అండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, లాకీ ఫెర్గుసన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివం మావి.
సన్రైజర్స్ హైదరాబాద్ : డెవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, విజరు శంకర్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్.