Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: జపాన్ జిమ్నాస్ట్ కోహీ యుచిమురకు కరోనా సోకింది. వచ్చే ఏడాది ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న యుచిముర ఇంటర్నేషనల్ మీట్లో పాల్గొనేందుకు పదిరోజుల క్రితం వచ్చాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు టోర్నీ నిర్వాహకులు గురువారం తెలిపారు. దీంతో నిర్వాహకులు మూడుసార్లు ఒలింపిక్ స్వర్ణపతక విజేత యుచిమురను టోర్నీనుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో పాల్గొనేందుకు చైనా, రష్యా, అమెరికాలనుంచి స్టార్ జిమ్నాస్టులు విచ్చేశారు. యోయోగి నేషనల్ జిమ్నాస్టిక్ స్టేడియంలో జరిగే పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నిర్వాహకులు ప్రతిరోజూ 2వేలమందికి అవకాశం కల్పించారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి జిమ్నాస్టిక్(ఎఫ్ఐజీ) ప్రెసిడెంట్ మోరినరి వాట్నబే మాట్లాడుతూ.. యుచిమురలో కరోనా లక్షణాలేవీ కనబడలేదని, పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో అతనిని పోటీలకు దూరంగా ఉంచినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చినుంచి క్రీడలు నిలిచిపోగా.. జపాన్లో తిరిగి ప్రారంభమైన తొలి అంతర్జాతీయ క్రీడాంశం ఇదే.